అయినాకాణి చిన్నచూపే!
అవసరాలు కొండంత.. నిధులు గోరంత- తాజా బడ్జెట్లో సోమశిల.. దాని అనుబంధ వ్యవస్థల పనులకు చేసిన కేటాయింపులను చూసినవారు అంటున్న మాటలివి.
ప్రాజెక్టు పనుల్లో కొరవడిన పురోగతి
ఆత్మకూరు, న్యూస్టుడే
ఆఫ్రాన్తోపాటు సోమశిల జలాశయ ఇతర రక్షణ కట్టడాల పటిష్ఠ పరిచే పనులను రూ. 99 కోట్లతో చేపట్టారు. ఇప్పటి వరకు రూ. 25కోట్ల పనులు చేశారు. బిల్లులు రాకపోవడంతో.. గుత్తేదారుకు సమస్యలు ఎదురై.. మూడు నెలలుగా పనులు ఆపేశారు. బిల్లులు ఎప్పటికి వస్తాయో? పనులు ఎప్పటికి పునః ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
హైలెవల్ కెనాల్లో భాగంగా సోమశిల వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు.. ఆగిపోయి మూడున్నరేళ్లకు పైగా అయింది. నిధుల ఊసేలేదు.. కదలిక అసలే లేదు. నిధుల కొరతతో.. ఈ పథకం పరిధిలో భూసేకరణ, ఆర్అండ్ఆర్ పూర్తికాక.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
ఇవి గుండెమడకల రిజర్వాయరు నిర్మాణ పనులు. సోమశిల హైలెవల్ కాలువ రెండో దశలో భాగంగా ఇప్పటి వరకు రూ. 100 కోట్ల విలువైన పనులు చేశారు. కంపసముద్రం రిజర్వాయరు, ఇతర పనులు చేపడుతున్నా.. చేసిన వాటికి బిల్లులు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి.
కండలేరు వరద కాలువ.. వెడల్పు పనులు చేపట్టారు. రూ. 80 కోట్లపైనే బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎప్పటికి చెల్లిస్తారో తెలియని స్థితి నెలకొనడంతో పనులు ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయన్న దానిపై స్పష్టత లేదు.
అవసరాలు కొండంత.. నిధులు గోరంత- తాజా బడ్జెట్లో సోమశిల.. దాని అనుబంధ వ్యవస్థల పనులకు చేసిన కేటాయింపులను చూసినవారు అంటున్న మాటలివి. ఇప్పటికే జలాశయం.. దాని అనుబంధ కాలువల పరిధిలో చేసిన పనులకు చెల్లించాల్సిందే సుమారు రూ. 375 కోట్లు ఉండగా- చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. బడ్జెట్లో కేటాయింపులు మాత్రం రూ. 46 కోట్లే. దీంతో ప్రస్తుత కార్యాచరణలో ఉన్న అభివృద్ధి పనుల అవసరాలు తీరవనే ఆవేదన వ్యక్తమవుతోంది.
హైలెవల్ కాలువల ఊసేది?
మెట్ట ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే హైలెవల్ కాలువల పనుల సాకారానికి నిధుల కేటాయింపులు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొదటి దశ పనుల్లో మూడున్నరేళ్లుగా కదలిక లేదు. కీలకమైన భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులు పూర్తికాక.. చేసిన పనులు నిరుపయోగమవుతున్నాయి. రెండో దశ పనులు చేపడుతున్నా.. చేసిన వాటికి బిల్లుల చెల్లింపు లేదు. దీంతో ఎప్పటి వరకు సాగుతాయో తెలియని పరిస్థితి. ఉత్తర కాలువ వెడల్పు, జలాశయం వద్ద వరద నీటి విడుదల సందర్భంగా దెబ్బతిన్న రక్షణ కట్టడాలు పటిష్ఠం చేసే పనులు, కండలేరు వరద కాలువ వెడల్పు పనులకు సంబంధించిన చెల్లింపులు జరగకపోవడంతో అంతటా సందిగ్ధత నెలకొంది. దీనికి తోడు ఈ బడ్జెట్లో కేటాయించిన రూ. 46 కోట్లలో.. ఈ పనులకు ఏ మేరకు చెల్లిస్తారో తెలియడం లేదు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ప్రాజెక్టు అనుబంధ కాలువలు.. వాటి అభివృద్ధి పనుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యం కోరాం
దశరథరామిరెడ్డి, ఈఈ సోమశిల ప్రాజెక్టు
అంతరాష్ట్ర ప్రాధాన్యం కలిగిన సోమశిల జలాశయం రక్షణ పనులకు కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యం కోరాం. రూ. 30 కోట్లు సాయం అందించాలని అడిగాం. త్వరలోనే ఈ విషయమై సమాచారం రానుంది. నిధులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తక్కిన పనులు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
[ 24-04-2024]
కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.