కన్నీటి వాన
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలు జన జీవనానికి, ముఖ్యంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి.
తల్లడిల్లిన అన్నదాతలు
అల్లూరు: ధాన్యం రాశులను చుట్టుముట్టిన వర్షపు నీరు
ఈనాడు డిజిటల్, నెల్లూరు: ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలు జన జీవనానికి, ముఖ్యంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. గురువారం మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండతో పాటు ఉక్కపోతగా ఉన్న వాతావరణం 3 గంటల సమయంలో ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికప్పుడు మబ్బులు కమ్ముకురావడంతో పాటు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం.. ఏకధాటిగా గంటకుపైగా కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. కందుకూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 3 గంటలకు ప్రారంభమైంది. కందుకూరు కోటారెడ్డినగర్, పోతురాజుమిట్ట ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. జలదంకి మండలం బ్రాహ్మణక్రాక కాకమ్మ చెరువులో పిడుగుపడి నాని(10) మృతి చెందగా- కొండికందుకూరులో రెండు పశువులు మృత్యువాత పడ్డాయి. కావలి పట్టణంతో పాటు బోగోలు, అల్లూరు, బిట్రగుంట, జలదంకి మండలాల్లో 3.30 గంటలకు వాన ప్రారంభమైంది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. ఇప్పుడిప్పుడే కళ్లాలోని నీటిని బయటకు పంపి.. పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న అన్నదాతలను మరోసారి ముంచేసింది. వర్షం ప్రారంభమైన కాసేపటికే.. అన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటలకే వర్ష ప్రభావం తొలగినా.. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించకపోవడంతో ఆయా ప్రాంతాలు అంధకారంగా మారాయి. బోగోలు మండల పరిధిలో విద్యుత్తు స్తంభాలు పక్కకు వాలగా, కరేడు, తుమ్మలపెంట పరిధిలో చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడ్డాయి. అధికారులు, సిబ్బంది స్పందించడంతో.. రాత్రి 10 గంటలకు విద్యుత్తు సరఫరాను దాదాపుగా పునరుద్ధరించారు.
బిట్రగుంట: ఓదెల్లోనే మొలకెత్తిన ధాన్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్విచక్ర వాహనాలు దగ్ధం
[ 18-04-2024]
కావలి పట్టణంలో నారాయణ స్కూల్ ఎదురుగా నిలిపి ఉన్న మూడు ద్విచక్రవాహనాలు దగ్ధం అయ్యాయి. -
చెక్పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
[ 18-04-2024]
జిల్లాలో ఎస్పీ కె.ఆరీఫ్ నైట్ బీట్, చెక్పోస్టులను తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రత దృష్యా బీవీ నగర్ పరిధిలోని నైట్బీట్లను తనిఖీ చేసి, గస్తీ ఎలా ఉందో పర్యవేక్షించారు. -
వైకాపాకు షాక్.. తెదేపాలో చేరిన కీలక నేతలు
[ 18-04-2024]
తెదేపాలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ డివిజన్లలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న ముఖ్య నాయకులు వైకాపాను వీడి తెదేపాలో చేరుతున్నారు. -
జగదభిరామ.. జానకిరామ
[ 18-04-2024]
జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ స్థూపం ప్రాంగణంలో వేలాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. -
20న సర్వేపల్లికి చంద్రబాబు రాక
[ 18-04-2024]
ప్రజాగళం పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారు. ఈ నెల 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. -
జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన జ్యోతిమోయ్ బయ్లంగ్, కంచన్ రామ్ మీనా నెల్లూరుకు విచ్చేశారు. బుధవారం రాత్రి నగరంలోని ఓ హోటల్కు చేరుకున్నారు. -
పరిశ్రమలేమోగానీ.. తిప్పలు గుల్ల
[ 18-04-2024]
ఆత్మకూరు పారిశ్రామిక వాడలో పరిశ్రమల మాటేమోగానీ.. అది వైకాపా మట్టి మాఫియాకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 23.4 కోట్లతో రెండో విడత అభివృద్ధి పనులు చేపడుతున్నారు. -
అధికార అహం.. అరాచక పర్వం!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అరాచకాలు, ఆగడాలు నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. అధికార పార్టీ నేతలన్న అహంతో కొందరు వైకాపా నాయకులు చెలరేగిపోగా- వారి దందాలు, దౌర్జన్యాలకు కొందరు అమాయకులు బలైపోయారు. -
నామినేషన్లకు వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఒక లోక్సభ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. -
పోలీస్ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పర్యవేక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. -
రైతు జపం.. ఏదో నెపం
[ 18-04-2024]
కౌలు రైతులకు కొత్త చట్టం తెచ్చామని జగన్మోహన్రెడ్డి చెబుతున్నా.. భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారు హక్కుపత్రాలు లభించని పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. -
కడలికి తూట్లు.. అక్రమార్కులకు కాసులు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదు. కానీ కొందరు సముద్రపు ఇసుకను తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
బేల్దారీ బేజారు
[ 18-04-2024]
భవన నిర్మాణ సామగ్రి ధరలు అసాధారణంగా పెరగడంతో వందల మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఒక పక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేదు. -
వేసవి ప్రణాళిక లేదు.. అధికారి లేరు
[ 18-04-2024]
ఎండలు మండి పోతున్నాయి. జిల్లాలో బావులు, నీటి వనరులు అడుగంటుతున్నాయి. జనం దాహార్తితో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదిక పనిచేయాల్సిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు.. బదిలీపై వెళ్లిపోతున్నారు. -
అరాచకాల్లో దిట్ట జగన్: బీద
[ 18-04-2024]
హత్యలు, దాడులు, కబ్జాలు, అరాచకాల్లో దిట్ట జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మూడేళ్ల చదువు ఉపాధికి ఆదరువు
[ 18-04-2024]
పదో తరగతి తరువాత మూడేళ్ల చదువు.. అనంతరం ఉపాధి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్లో చేరే అవకాశం.. ఇది పాలిటెక్నిక్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు. -
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: తెదేపా
[ 18-04-2024]
చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం రాత్రి బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురంలో యోహాన్ అతని అనుచరులు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి