లక్ష్యం ఘనం.. పనుల్లో జాప్యం..!
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పనులు కల్పించడంతో పాటు భవిష్యత్తు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనుల్లో భాగంగా అమృత్ సరోవర్ కింద నీటి వనరుల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
అధికారుల పర్యవేక్షణ లేక నత్తనడకన సాగుతున్న వైనం
నాడు.. దాసరిపల్లి ఊర చెరువు.
న్యూస్టుడే, ఉదయగిరి, సీతారామపురం
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పనులు కల్పించడంతో పాటు భవిష్యత్తు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనుల్లో భాగంగా అమృత్ సరోవర్ కింద నీటి వనరుల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాలకు సమీపంలో ఉండే చెరువులు, ఊట కుంటలు గుర్తించి వాటిని వినియోగంలోకి తెస్తే స్థానికులతో పాటు పశు పక్షాదులకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాలో 31 మండలాల్లో 191 పనులను గుర్తించగా అందులో 111 పనులను ఎంపిక చేశారు. వాటిల్లో ఇప్పటి దాకా 48 చోట్ల పూర్తయ్యాయి.
ప్రయోజనమిలా..
ఉపాధిహామీ పథకంలో భాగంగా చేసే పనుల్లో గ్రామాలకు సమీపంలో ఉన్న చెరువులు, ఊట కుంటలను ఎంపిక చేశారు. గ్రామ సమీపంలో చేస్తే కూలీలు ఆసక్తిగా పనులకు రావడమే గాక చెరువులు, కుంటలను అభివృద్ధి చేయటం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెంచడం ద్వారా భూగర్భజలాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. కట్టలను అభివృద్ధి చేసి వాటిపై ఉదయం, సాయంత్రం సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు కాసేపు సేదతీరేలా వీటిని సిద్ధం చేస్తున్నారు. కట్టపైన లేదా దిగువ భాగంలో మొక్కలను నాటి వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు.
అభివృద్ధి పనులు చేపట్టాం
ఉపాధిహామీలో కొన్ని పనులను అమృత్ సరోవర్లో భాగంగా చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయగిరి మండలంలో మూడు పనులను గుర్తించి జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం పనులు చేయిస్తున్నాం. గ్రామాలకు సమీపంలో చెరువులు, కుంటలు అభివృద్ధి పనులు చేపట్టాం. ఈ పనులతో గ్రామీణ ప్రాంతాల వారికి ప్రయోజనం కలుగుతుంది.
శ్రీనివాసులు, ఏపీవో ఉదయగిరి
ప్రతి పనికి రూ.2 లక్షలు..
కూలీలతో పనులు చేయించి అభివృద్ధి చేయడంతో పాటు కట్ట ఎత్తు పెంచేందుకు అవసరమైన గ్రావెల్ తరలింపు, రివిట్మెంట్, అలుగు ప్రాంతాల్లో మరమ్మతులు చేసేందుకు, కట్టపై ప్రజల సేద తీరేందుకు అవసరమైన సిమెంట్ బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పనికి మెటీరియల్ కాంపోనెంట్ నిధుల కింద ఒక్కో పనికి రూ. 2 లక్షల వంతున ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 31 మండలాల్లో అక్కడి పరిస్థితులకనుగుణంగా రెండు నుంచి ఐదు వరకు పనులను చేపట్టారు. ప్రభుత్వం లక్ష్యం మేరకు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదంతో పాటు భూగర్భజలాలు పెరిగే అవకాశముంది.
నేడు.. పనులు చేసిన తరువాత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నూరు వైకాపా సర్పంచ్ తెదేపాలో చేరిక
[ 23-04-2024]
దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బుక్కే సునీత, ఆమె భర్త వెంకట రమణ నాయక్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
పది ఫలితాల్లో నిరాశే..
[ 23-04-2024]
తన కుమార్తె పదో తరగతి చదువుతుందని కాలనీలో అందరికీ చెప్పుకుంటూ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న తల్లి దాలు లక్ష్మి గత నెలలో రహదారి ప్రమాదంలో మరణించింది. -
పసుపు దళం.. విజయగళం
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నాలుగో రోజు పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. -
పచ్చటి బతుకులపై ఫ్లోరైడ్
[ 23-04-2024]
బతికుండగానే మనిషిని నిలువునా కుంగదీసి జీవచ్ఛవంలా మార్చే ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైకాపా అధికారంలోకి వస్తే ఎక్కడికక్కడ శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించిన ప్రజాప్రతినిధులు.. సమస్య పరిష్కారం దిశగా గత ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసిన వాటినీ పట్టించుకోలేదు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచండి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పోలీసు అధికారులను ఆదేశించారు -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే: కలెక్టర్
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోడ్ ఉంటే మాకేంటి..!
[ 23-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పక్కాగా జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది -
మీ మాటలకు మోసపోయాం!
[ 23-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వేతనం రూ.15 వేలకు పెంచుతానంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. -
జగన్ హామీ.. నెరవేరదేమీ?
[ 23-04-2024]
అనుమసముద్రంపేట దర్గా రోడ్లు విస్తరణ పేరుతో ఇలా ఛిద్రం చేశారు. ఆపై అభివృద్ధి మరిచారు. పనులు సొంతం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
గెలిచి వచ్చి అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి
[ 23-04-2024]
గెలుపుతో స్వగ్రామానికి తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్ వేసిన అనంతరం తన స్వగ్రామం ఇందుపూరుకు వచ్చారు -
ఆస్తులు బుగ్గవుతుంటే.. నివారించలేని జగన్ ప్రభుత్వం
[ 23-04-2024]
వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిద అవుతున్నాయి
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM