బాలుడి అపహరణ.. 2 గంటల్లో గుర్తింపు
అమ్మమ్మతో దేవస్థానానికి వెళ్లిన బాలుడిని గుర్తుతెలియని మహిళ అపహరించింది. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు.
ఎస్పీ సమక్షంలో బాలుడిని తల్లికి అప్పగిస్తున్న నగర డీఎస్పీ
నెల్లూరు (నేర విభాగం), న్యూస్టుడే: అమ్మమ్మతో దేవస్థానానికి వెళ్లిన బాలుడిని గుర్తుతెలియని మహిళ అపహరించింది. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని బీవీనగర్లో శ్రీకాంత్రెడ్డి, ఇంద్రజ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సవ్యసాక్షిక్రెడ్డి అనే నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఇంద్రజ తల్లి తాటిపర్తి పద్మ తన మనవడితో కలసి శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లారు. అక్కడ గుర్తుతెలియని మహిళ బాలుడ్ని ఆడిస్తున్నట్లు నటించి తీసుకెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన ఆమె కుమార్తెకు విషయాన్ని తెలియజేసి దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ సీహెచ్ విజయరావు వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయడంతో నగరంలో నాకా బందీ నిర్వహించారు. చెక్పోస్టులు, టోల్ప్లాజాల వద్ద తనిఖీ చేపట్టారు. దేవస్థానంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అపహరణ చేసిన మహిళ బాలుడితో కలిసి పద్మావతి సెంటరు వైపు వెళ్లి అక్కడి నుంచి ఆటో ఎక్కి ఆత్మకూరు బస్టాండుకు వెళ్లినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆటోను గుర్తించి డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా ఆ మహిళ ఆత్మకూరు బస్టాండులో దిగి పామూరు బస్సు ఎక్కినట్లు తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి గాలించగా బాలుడు కనిపించాడు. అపహరణ చేసిన మహిళ కనపడలేదు. దీంతో పోలీసులు బాలుడ్ని ఎస్పీ చేతులమీదుగా తల్లికి అప్పగించారు. రెండు గంటల్లోనే కుమారుడిని సురక్షితంగా అప్పగించినందుకు పోలీసు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిభ కనబరిచిన నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, దర్గామిట్ట ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య, పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. అపహరించిన మహిళ ఎవరనేది తెలియరాలేదు. ఆమె కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెంచులక్ష్మీపురంలో ఇంటింటి ప్రచారం
[ 24-04-2024]
కావలి నియోజకవర్గంలోని బోగోలులో రైల్వే ప్రాజెక్టును తీసుకువచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు -
తెదేపాలో చేరిక
[ 24-04-2024]
బోగోలు మండలం విశ్వనాధరావుపేట పంచాయతీ 6వ వార్డు వైకాపా నేత సుధీర్, ఎం. జయకుమార్ తెదేపాలో చేరారు. -
మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా అభ్యర్థి
[ 24-04-2024]
అల్లూరు మండలంలో తెదేపా అభ్యర్థి కావ్యక్రిష్టారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
[ 24-04-2024]
కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.