logo

పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో కేంద్రాలకు ఉచితంగా వెళ్లే సౌకర్యాన్ని కల్పించామని ప్రజా రవాణా శాఖ జిల్లా అధికారి పి.వి.శేషయ్య శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Published : 26 Mar 2023 02:07 IST

నెల్లూరు (రవాణా), న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో కేంద్రాలకు ఉచితంగా వెళ్లే సౌకర్యాన్ని కల్పించామని ప్రజా రవాణా శాఖ జిల్లా అధికారి పి.వి.శేషయ్య శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వచ్చే నెల మూడో తేదీ నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్న రోజుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. కండక్టర్‌కు హాల్‌టిక్కెట్‌  చూపించి నివాస ప్రాంతం నుంచి పరీక్ష కేంద్రం వరకు రాకపోకలు సాగించవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని