logo

కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన

కాంగ్రెస్‌ అగ్ర నాయకులు రాహుల్‌గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనర్హత వేటు వేయడంపై నెల్లూరులో ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి.

Published : 26 Mar 2023 02:31 IST

ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్‌రెడ్డి, లతారెడ్డి తదితరులు

నెల్లూరు(జడ్పీ) : కాంగ్రెస్‌ అగ్ర నాయకులు రాహుల్‌గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనర్హత వేటు వేయడంపై నెల్లూరులో ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా కాంగ్రెస్‌ భవన్‌ నుంచి ట్రంకురోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించారు. పలువురు నాయకులు నల్లదుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు లతారెడ్డి, నగర ఇన్‌ఛార్జి ఫయాజ్‌, పీసీసీ కార్యదర్శి మోహనరెడ్డి, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు గణేశ్‌, అధికార ప్రతినిధి సురేష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని