logo

వైద్య చికిత్సకు వచ్చి ఆకస్మిక మృతి

చికిత్స నిమిత్తం నగరంలోని హనుమాన్‌పేటలో ఓ ప్రైవేటు వైద్యశాలకు వచ్చిన గుర్తుతెలియని వృద్ధుడు (70) మృతి చెందిన ఘటన గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Published : 26 Mar 2023 02:29 IST

విజయవాడ: చికిత్స నిమిత్తం నగరంలోని హనుమాన్‌పేటలో ఓ ప్రైవేటు వైద్యశాలకు వచ్చిన గుర్తుతెలియని వృద్ధుడు (70) మృతి చెందిన ఘటన గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వృద్ధుడు పేరు రాజు అని, ఊరు నెల్లూరు అని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. శనివారం ఉదయం సిరివెళ్ల నర్సింగ్‌ హోంకు వచ్చి అకస్మాత్తుగా చనిపోయారు. మృతదేహాన్ని కొత్త ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. తెలిసిన వారు గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌ 0866-2576023 నెంబరును సంప్రదించాలని పోలీసులు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని