logo

క్యాన్సర్‌ ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం

నెల్లూరు నగరంలోని రెడ్‌క్రాస్‌ సొసైటీ క్యాన్సర్‌ ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు యాలమూరి రంగయ్యనాయుడు రూ.5 లక్షలు విరాళంగా అందించారు.

Published : 26 Mar 2023 02:41 IST

కలెక్టర్‌కు చెక్కు అందజేస్తున్న రంగయ్యనాయుడు

నెల్లూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: నెల్లూరు నగరంలోని రెడ్‌క్రాస్‌ సొసైటీ క్యాన్సర్‌ ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు యాలమూరి రంగయ్యనాయుడు రూ.5 లక్షలు విరాళంగా అందించారు. శనివారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబును కలిసి ఈమేరకు చెక్కు అందజేశారు.  నూతన భవనంలో ఒక గదికి తన తల్లిదండ్రులైన రామచంద్రయ్యనాయుడు, రమణమ్మ పేర్లు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యులు   నాగేశ్వరరావు, సామాజిక కార్యకర్త కె.సురేష్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని