గ్రామీణ యువత.. ప్రతిభా గీతిక
వారు గ్రామాల్లో పుట్టారు. పేదమధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఒకరికి తండ్రి లేరు. తల్లి కష్టంతో చదువుకుంటున్నారు. ఇంకొకరు రైతు కూలీల ఇంట పుట్టారు.
సాధన చేస్తున్న క్రీడాకారులు
న్యూస్టుడే, కావలి: వారు గ్రామాల్లో పుట్టారు. పేదమధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఒకరికి తండ్రి లేరు. తల్లి కష్టంతో చదువుకుంటున్నారు. ఇంకొకరు రైతు కూలీల ఇంట పుట్టారు. అది కూడా మారుమూలప్రాంతం. మరొకరు ఆటోడ్రైవర్ కుమార్తె. వీరు కష్టపడి ఆటల్లో ప్రావీణ్యం సంపాదించారు. జాతీయ స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలకు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. దీంతో వాటిల్లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. పట్టణంలోని డీబీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ పొందుతున్నారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది పాల్గొంటున్నారు.
ఆటోడ్రైవర్ కుమార్తె.. స్టార్ ఆఫ్ ఇండియా
పాత ఉమ్మడి జిల్లాలోని గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలోని తిక్కవరం గ్రామానికి చెందిన ఎం. శ్వేత వరుసగా రెండేళ్ల నుంచి స్టార్ ఆఫ్ ఇండియాగా దేశవ్యాప్త బ్యాడింటన్ పోటీల్లో అవార్డు అందుకుంది. సీనియర్ నేషనల్స్ టోర్నమెంట్లో 2021, 22 సంవత్సరాల్లో అవార్డు లభించింది. ఈసారి కూడా అదే ఘనత పొందుతానని చెబుతుంది. క్రీడల కోటాలో లభించిన ప్రవేశంతో చెన్నైలో ఇంజినీరింగ్ చదువుతుంది. దీంతో ఆమె చదివే విశ్వవిద్యాలయం తరఫున కూడా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపింది. ఈమె తండ్రి మల్లికార్జున్ ఆటోడ్రైవర్, తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. జాతీయ స్థాయి పోటీల్లో ఘనత చాటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడతానని శ్వేత చెబుతుంది.
తల్లి కష్టంతో..
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలోని నీలకంఠాపురం గ్రామానికి చెందిన పి.ఏడుకొండలు క్రీడల కోటాలో వచ్చిన సీటుతో బెంగళూరులోని ప్రముఖ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. విద్యాభ్యాసంతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాడు. ఇతని తండ్రి వెంకటేశ్వర్లు మరణించారు. తల్లి మల్లమ్మ వ్యవసాయ పనులు చేస్తూ చదివిస్తుంది. ఆమె ఆశలు నెరవేర్చేలా జాతీయస్థాయిలో సత్తా చాటుతున్నాడు. గతంలో 2018లో జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్స్ పోటీల్లోనూ ప్రతిభ చూపాడు. జాతీయ సీనియర్స్ బాల్బ్యాడ్మింటన్ -2020 చెన్నై సెయింట్ జోసెఫ్ క్రీడామైదానంలో జరిగిన పోటీల్లోనూ పాల్గొన్నాడు. బెంగళూరులో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ బ్యాడ్మింటన్ 2023 పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈసారి మహారాష్ట్ర పోటీల్లో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. రైల్వేలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు.
రైతు బిడ్డ జాతీయ ఖ్యాతి
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం కొత్త సీతారామపురానికి చెందిన జి.నాగూర్మీరా పలుమార్లు జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటాడు. చెన్నై నగరంలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో క్రీడా కోటాలో వచ్చిన సీటుతో చదువుతున్నాడు. తండ్రి మస్తాన్, తల్లి ఖాసింబి. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. ఇతను గత జనవరిలో కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి సీనియర్ నేషనల్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. జూనియర్స్ పోటీల్లో 2019లో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణపతకం అందుకున్నాడు. కరోనా అనంతరం 2021, 2022లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రజత పతకం సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని లక్ష్యంతో సాధన చేస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.