అడిగేదెవరు? ఆక్రమించేశారు
అదో పారిశ్రామిక ప్రాంతం.. అక్కడ స్థలాలకున్న గిరాకీ అంతా ఇంతా కాదు.. అంకణం రూ. 4 లక్షల పైమాటే.. అలాంటి చోట ఏకంగా రహదారి పక్కనున్న రూ. 25కోట్ల విలువ చేసే 0.97 ఎకరాల స్థలం(580 అంకణాలు) దర్జాగా ఆక్రమించారు.
రూ. 25 కోట్ల ప్రభుత్వ స్థలానికి ఎసరు
వెంకటాచలం, ముత్తుకూరు, న్యూస్టుడే
ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు
అదో పారిశ్రామిక ప్రాంతం.. అక్కడ స్థలాలకున్న గిరాకీ అంతా ఇంతా కాదు.. అంకణం రూ. 4 లక్షల పైమాటే.. అలాంటి చోట ఏకంగా రహదారి పక్కనున్న రూ. 25కోట్ల విలువ చేసే 0.97 ఎకరాల స్థలం(580 అంకణాలు) దర్జాగా ఆక్రమించారు. ప్రభుత్వ కార్యాలయాల ముందే.. అధికారుల కళ్లెదుటే.. ఏకంగా నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని పరిస్థితి. ఈ నిష్క్రియాపరత్వమే మరిన్ని ఆక్రమణలకు ఊతమిస్తోందన్న ఆవేదన స్థానికంగా వ్యక్తమవుతోంది.
వసతిగృహ నిర్మాణానికి వేసిన శిలాఫలకం
ముత్తుకూరులో.. నెల్లూరు-ముత్తుకూరు ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో.. సర్వే నంబరు 485-1బీలో 0.97 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. దాన్ని రెండు దశాబ్దాల కిందట నాటి ప్రభుత్వం ఎస్సీ వసతిగృహ నిర్మాణానికి కేటాయించింది. శంకుస్థాపన కూడా చేశారు. బిల్లులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో పనులు దక్కించుకున్న గుత్తేదారుడు.. పునాదుల దశలోనే భవన నిర్మాణ పనులు నిలిపివేశారు. అప్పటి నుంచి ఆ స్థలం అలానే ఉండగా.. కృష్ణపట్నం పోర్టు ఏర్పాటు కావడంతో స్థలాలకు భారీగా గిరాకీ పెరిగింది. అదే స్థాయిలో అక్రమాలు ఊపందుకున్నాయి.
నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు.. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ స్థలానికి మంచి గిరాకీ ఏర్పడటంతో.. కబ్జాదారుల కన్నుపడింది. కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ వెళ్లారు. సుమారు రూ. 25కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని.. ఇప్పటికే 80 శాతం వరకు ఆక్రమించారు. కొందరు సర్వే నంబర్లు మార్చి.. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ఆరోపణలు ఉండగా- ఆక్రమించిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేసి క్రయ విక్రయాలు చేస్తున్నారనే ఫిర్యాదులు సైతం అధికారులకు అందాయి. 2015లో ఆక్రమణలపై దళిత నాయకులు, స్థానికులు ఎస్సీ కమిషన్తో పాటు అప్పటి కలెక్టర్ జానకికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆమె.. నిగ్గుతేల్చాలని విచారణకు ఆదేశించగా.. కొద్దిరోజులు ఆక్రమణదారులు మిన్నకుండిపోయారు. ప్రస్తుతం తిరిగి ఆక్రమణలు
ప్రారంభించారు.
అర్ధరాత్రి పూట నిర్మాణాలు
మొత్తం 0.97 ఎకరాల స్థలంలో చాలా వరకు ఆక్రమించగా- ప్రస్తుతం కొంత మాత్రమే మిగిలింది. అప్పట్లో వసతిగృహ నిర్మాణానికి మంత్రులు వేసిన శిలాఫలకం ఆ స్థలంలోనే ఉంది. వారం రోజులుగా శిలా ఫలకాన్ని పక్కకు నెట్టి.. ఉన్న కొద్దిపాటినీ ఆక్రమించి.. నిర్మాణాలు చేపడుతున్నారు. రహదారి పై వెళ్లే వారికి కనిపించకుండా పెద్ద పెద్ద తెరలు అడ్డుగా పెట్టి నిర్మాణాలు చేపడుతున్నారు. స్థలానికి ఒకవైపు(రహదారి మార్గంలో) గదులు, మరో వైపు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. శని, ఆదివారాలు అర్ధరాత్రి సమయంలో పైకప్పు వేశారు.
ఫిర్యాదు అందినా... పట్టని అధికారులు
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి.. నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్థులు వారం రోజులుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా.. కనీసం పరిశీలించిన దాఖలాలు లేవు. అధికారులు నిత్యం అటుగా వెళుతున్నా.. ఆ వైపు కన్నెత్తి చూడటడం లేదు. దాంతో కొందరు గ్రామస్థులు సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ అధికారులూ మిన్నకుండిపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని అయినా కాపాడాలని కోరుతున్నారు.
నిజమే.. పరిశీలించి చర్యలు
మనోహర్బాబు, తహసీల్దారు, ముత్తుకూరు
వసతిగృహానికి కేటాయించిన ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కొందరు ఫిర్యాదు చేశారు. పరిశీలించాలని వీఆర్వోకు సూచించాం. వారం కిందట నిర్మాణాలు నిలిపివేశాం. రెండు రోజుల కిందట అర్ధరాత్రి సమయంలో పైకప్పు వేస్తున్నారని సమాచారం ఇచ్చారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలని తేలితే కూల్చివేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్విచక్ర వాహనాలు దగ్ధం
[ 18-04-2024]
కావలి పట్టణంలో నారాయణ స్కూల్ ఎదురుగా నిలిపి ఉన్న మూడు ద్విచక్రవాహనాలు దగ్ధం అయ్యాయి. -
చెక్పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
[ 18-04-2024]
జిల్లాలో ఎస్పీ కె.ఆరీఫ్ నైట్ బీట్, చెక్పోస్టులను తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రత దృష్యా బీవీ నగర్ పరిధిలోని నైట్బీట్లను తనిఖీ చేసి, గస్తీ ఎలా ఉందో పర్యవేక్షించారు. -
వైకాపాకు షాక్.. తెదేపాలో చేరిన కీలక నేతలు
[ 18-04-2024]
తెదేపాలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ డివిజన్లలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న ముఖ్య నాయకులు వైకాపాను వీడి తెదేపాలో చేరుతున్నారు. -
జగదభిరామ.. జానకిరామ
[ 18-04-2024]
జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ స్థూపం ప్రాంగణంలో వేలాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. -
20న సర్వేపల్లికి చంద్రబాబు రాక
[ 18-04-2024]
ప్రజాగళం పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారు. ఈ నెల 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. -
జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన జ్యోతిమోయ్ బయ్లంగ్, కంచన్ రామ్ మీనా నెల్లూరుకు విచ్చేశారు. బుధవారం రాత్రి నగరంలోని ఓ హోటల్కు చేరుకున్నారు. -
పరిశ్రమలేమోగానీ.. తిప్పలు గుల్ల
[ 18-04-2024]
ఆత్మకూరు పారిశ్రామిక వాడలో పరిశ్రమల మాటేమోగానీ.. అది వైకాపా మట్టి మాఫియాకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 23.4 కోట్లతో రెండో విడత అభివృద్ధి పనులు చేపడుతున్నారు. -
అధికార అహం.. అరాచక పర్వం!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అరాచకాలు, ఆగడాలు నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. అధికార పార్టీ నేతలన్న అహంతో కొందరు వైకాపా నాయకులు చెలరేగిపోగా- వారి దందాలు, దౌర్జన్యాలకు కొందరు అమాయకులు బలైపోయారు. -
నామినేషన్లకు వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఒక లోక్సభ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. -
పోలీస్ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పర్యవేక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. -
రైతు జపం.. ఏదో నెపం
[ 18-04-2024]
కౌలు రైతులకు కొత్త చట్టం తెచ్చామని జగన్మోహన్రెడ్డి చెబుతున్నా.. భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారు హక్కుపత్రాలు లభించని పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. -
కడలికి తూట్లు.. అక్రమార్కులకు కాసులు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదు. కానీ కొందరు సముద్రపు ఇసుకను తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
బేల్దారీ బేజారు
[ 18-04-2024]
భవన నిర్మాణ సామగ్రి ధరలు అసాధారణంగా పెరగడంతో వందల మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఒక పక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేదు. -
వేసవి ప్రణాళిక లేదు.. అధికారి లేరు
[ 18-04-2024]
ఎండలు మండి పోతున్నాయి. జిల్లాలో బావులు, నీటి వనరులు అడుగంటుతున్నాయి. జనం దాహార్తితో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదిక పనిచేయాల్సిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు.. బదిలీపై వెళ్లిపోతున్నారు. -
అరాచకాల్లో దిట్ట జగన్: బీద
[ 18-04-2024]
హత్యలు, దాడులు, కబ్జాలు, అరాచకాల్లో దిట్ట జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మూడేళ్ల చదువు ఉపాధికి ఆదరువు
[ 18-04-2024]
పదో తరగతి తరువాత మూడేళ్ల చదువు.. అనంతరం ఉపాధి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్లో చేరే అవకాశం.. ఇది పాలిటెక్నిక్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు. -
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: తెదేపా
[ 18-04-2024]
చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం రాత్రి బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురంలో యోహాన్ అతని అనుచరులు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM