అసైన్డ్ భూముల్లో అక్రమాల పర్వం
ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జా చేసి, ప్లాట్లు వేసి విక్రయాలకు పాల్పడుతున్నారు. రాజకీయమే అండగా.. అధికారమే పెట్టుబడిగా.. కొందరు అసైన్డ్, సీలింగ్ భూములను వదలకుండా దోచుకుంటున్నారు.
ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జా చేసి, ప్లాట్లు వేసి విక్రయాలకు పాల్పడుతున్నారు. రాజకీయమే అండగా.. అధికారమే పెట్టుబడిగా.. కొందరు అసైన్డ్, సీలింగ్ భూములను వదలకుండా దోచుకుంటున్నారు. ఎవరైనా అభ్యంతరం చెబితే.. రెవెన్యూ అధికారుల సాయంతో రికార్డులను ఇష్టానుసారం మార్చి ముప్పుతిప్పలు పెడుతుండగా- ప్రస్తుతం బాధితులంతా కలెక్టర్, జేసీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఈనాడు డిజిటల్, నెల్లూరు: నగరం విస్తరించే అవకాశాలు ఉండటంతో.. సమీప ప్రాంతాలతో పాటు నెల్లూరు గ్రామీణ మండలంలోని భూములకు గిరాకీ వచ్చింది. సమీప కొత్తూరు, అంబాపురం, ధనలక్ష్మీపురం, కోడూరుపాడు, గుడిపల్లిపాడు, వావిలేటిపాడు ప్రాంతాల్లో ఎకరం విలువ రూ. కోట్లకు చేరింది. అదే అదనుగా అధికారమే అండగా కొందరు వ్యక్తులు మాఫియాగా ఏర్పడి భూ దందాకు తెరదీశారు. దానికి రూరల్ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి సహకారం ఇవ్వడంతో రెచ్చిపోయారు. కొవిడ్ సమయంలో వందలాది ఎకరాలను యథేచ్ఛగా కబ్జా చేశారు. పేదలకు ఇచ్చిన భూములు కొనుగోలు చేసినట్లు, వారసత్వంగా వచ్చినట్లు రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులు చేశారు. వాటికి సంబంధించిన రికార్డులేవీ కార్యాలయంలో అందుబాటులో లేకుండా చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునేవారు లేకపోవడంతో... ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే స్పందనలో అర్జీలు సమర్పిస్తున్నారు. ఆ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ నుంచి తహసీల్దారు కార్యాలయానికి సదరు అర్జీలు పంపిస్తుండగా- వాటికి సంబంధించిన ఎలాంటి రికార్డులు లేవని చెబుతుండటం గమనార్హం. ఇటీవల రెండు సమస్యలకు సంబంధించి రికార్డులు తీసుకురావాలని జేసీ కూర్మనాథ్ అడిగినా.. ఎలాంటి స్పందన లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
నాలుగేళ్లలో నాశనం
నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఆ అధికారి అన్నీ తానై పని చేశారు. ఓ ప్రజాప్రతినిధి అండతో నాలుగేళ్లలో భూ రికార్డులు నాశనం చేశారు. ఎందరు తహసీల్దార్లు వచ్చినా.. అధికార బలంతో అక్కడ ఉండనీయలేదు. రికార్డుల మార్పు మొదలు.. అసలు దస్త్రాలు మాయం చేయడం వరకు, పేదల భూములను పక్కదారి పట్టించేందుకు ఎన్ని చేయాలో.. అన్నీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా తమ భూమికి సంబంధించిన వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా.. కనీసం సమాధానం ఇచ్చేవారు కాదని, అడిగితే మా దగ్గర లేవు. ఏం చేసుకుంటారో చేసుకోండని సమాధానం చెబుతున్నారని బాధితులు ఉన్నతాధికారుల వద్ద వాపోయిన సంఘటనలు ఉన్నాయి. కొత్తూరు పరిధిలో గతంలో 395 ఎకరాలను పేదలకు అసైన్మెంట్ కింద పట్టాలుగా పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ భూములన్నీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కుట్రపూరితంగా రికార్డులు మార్చి.. అక్రమార్కులకు కట్టబెట్టినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వస్తున్న అర్జీలే చెబుతున్నాయి. కొందరు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తే.. వెంటనే ఆ భూమిని లేఅవుట్లుగా మార్చి విక్రయిస్తుండటం గమనార్హం. ఉన్నతాధికారులు పదే పదే వివరాలు కావాలని అడుగుతుండటంతో.. సదరు ఉద్యోగి సెలవుపై వెళ్లారు. ఇదంతా అధికారులకు తెలిసినా.. కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై చర్చ నడుస్తుండటంతో.. రూరల్ తహసీల్దారు కార్యాలయమంటేనే అధికారులు భయపడుతున్నారు. తహసీల్దారు సెలవుపై వెళ్లి నాలుగు నెలలైనా.. ఇప్పటికీ అక్కడ ఎవరూ విధుల్లో చేరలేదు.
ప్రత్యేక గ్రీవెన్స్కు 60 అర్జీలు
నెల్లూరు రూరల్ నుంచి.. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఎక్కువగా ప్రజలు వస్తుండటంతో జేసీ కూర్మనాథ్ ఇటీవల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. దాదాపు 60 అర్జీలు అందాయి. వాటిలో తమ భూమి ఆక్రమించుకున్నారని, రికార్డులు మార్చారని, వాటిని సరిచేసి న్యాయం చేయాలన్నవే ఎక్కువ. మరికొందరు సమస్య కోర్టులో ఉన్నా.. అధికారులు విచారణ జరుపుతున్నా.. అక్రమార్కులు విక్రయాలు జరిపి.. నిర్మాణాలు చేపడుతున్నారని వాపోయారు.
* దీనిపై జేసీ కూర్మనాథ్ మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ నుంచి వచ్చిన భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. వాటిని పరిశీలించి.. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తాం. అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే
[ 28-03-2024]
కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రచారం ప్రారంభించారు. -
29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
[ 28-03-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే
[ 28-03-2024]
ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే -
అధనం.. నీదే భారం!
[ 28-03-2024]
ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. -
తెరచుకోని పాఠం
[ 28-03-2024]
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు -
ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు
[ 28-03-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. -
ఓటరన్నా.. మేలుకో!
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. -
జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం
[ 28-03-2024]
-
కన్నీటి శృతి
[ 28-03-2024]
తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. -
గొంతుకోసి మహిళ హత్య
[ 28-03-2024]
మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి