పసుపు రైతుకు అగచాట్లు
రూ. లక్షల పెట్టుబడి పెట్టి.. ఆరుగాలం శ్రమించిన పసుపు రైతు.. తీరా పంట చేతికొచ్చిన సమయానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉదయగిరి, సీతారామపురం, న్యూస్టుడే
రూ. లక్షల పెట్టుబడి పెట్టి.. ఆరుగాలం శ్రమించిన పసుపు రైతు.. తీరా పంట చేతికొచ్చిన సమయానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెగుళ్ల కారణంగా.. అసలే ఆశించిన దిగుబడులు రాకపోగా- మార్కెట్లో గిట్టుబాటు ధరలు సైతం లేక పరేషాన్ అవుతున్నారు. కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయకపోతే.. తాము గట్టెక్కడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కల్లాల్లో పసుపు కొమ్ములు
జిల్లాలోనే ఉదయగిరి ప్రాంతం పసుపు సాగుకు ప్రసిద్ధి. ముఖ్యంగా ఉదయగిరి మండలంలోని కొండ కింద పల్లెలైన కృష్ణారెడ్డిపల్లి, బిజ్జంపల్లి, కొత్తపల్లి, లింగమనేనిపల్లి, బండగానిపల్లి, అయ్యవారిపల్లి తదితర గ్రామాల్లో రైతులు సాగు చేస్తారు. సీతారామపురం, దుత్తలూరు మండలాల్లోనూ సాగు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది సుమారు 300 ఎకరాల్లో వేసినట్లు రైతులు చెబుతున్నారు.
తెగుళ్లతో సతమతం
విత్తనం పసుపు, ఎరువులు, కూలీలు, వ్యవసాయం తదితర ఖర్చులు కలుపుకొని ఎకరం సాగుకు రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.40 లక్షల వరకు పెట్టుబడి పెట్టడంతో పాటు పంట తవ్వకాల సమయంలో కూలీ ఖర్చుల కింద ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇంతా చేసి.. ఎలాంటి తెగుళ్లు సోకకుండా ఉంటే.. ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వేరు, దుంప కుళ్లు తెగులు వెంటాడటంతో 30 నుంచి 40 క్వింటాళ్లలోపు మాత్రమే దిగుబడి వచ్చిందంటున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎండు పసుపు క్వింటా రూ. 4,500 నుంచి రూ. 5,500లోపు మాత్రమే పలుకుతోంది. ఈ లెక్కన పెట్టుబడులు సైతం దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పంట సాగు చేసిన వారు నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు.
కొనుగోలు కేంద్రం కోసం..
ప్రభుత్వం స్థానికంగా పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అందుకోసం ఇటీవల నిరసన సైతం తెలిపారు. గత ఏడాది మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి.. క్వింటా రూ. 6,850 మద్ధతు ధరతో కొనుగోలు చేశారు. ఈ ఏడాదీ అదే రీతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గిట్టుబాటు ధర కల్పించకపోతే నష్టాలే
దేవసాని శ్రీనివాసులురెడ్డి, రైతు
నాకున్న అయిదు ఎకరాల్లో సుమారు రూ. 6 లక్షలకుపైనే పెట్టుబడి పెట్టి.. పంట సాగు చేశా. తెగుళ్ల కారణంగా ఆశించిన మేర దిగుబడి రాలేదు. మార్కెట్లోనూ ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఉదయగిరిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి.. మద్ధతు ధరకు కొనుగోలు చేస్తే కాసింత ఊరట కలుగుతుంది. లేదంటే.. రైతులంతా తీవ్రంగా నష్టపోతారు. ఇకపై పంట సాగు చేయలేని పరిస్థితి తలెత్తుతుంది.
జీవో రావాల్సి ఉంది
పవన్కుమార్, మార్క్ఫెడ్ డీఎం
ఉదయగిరిలో పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి జీవో రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏమీ రాలేదు. హార్టికల్చర్ అధికారుల నుంచి సాగు వివరాలు రావాల్సి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట ఏమైనా దెబ్బతిందా? అనే వివరాలు అందాల్సి ఉంది. వచ్చిన వెంటనే ప్రభుత్వానికి పంపుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాయకుల రాజీనామా
[ 28-03-2024]
కావలి టౌన్ 29వ వార్డ్ తెదేపాకు చెందిన యువనేత నరేంద్ర, మాజీ కౌన్సిలర్ శెట్టిపల్లి మధు పార్టీకి రాజీనామా చేశారు. -
ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే
[ 28-03-2024]
కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రచారం ప్రారంభించారు. -
29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
[ 28-03-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే
[ 28-03-2024]
ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే -
అధనం.. నీదే భారం!
[ 28-03-2024]
ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. -
తెరచుకోని పాఠం
[ 28-03-2024]
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు -
ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు
[ 28-03-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. -
ఓటరన్నా.. మేలుకో!
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. -
జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం
[ 28-03-2024]
-
కన్నీటి శృతి
[ 28-03-2024]
తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. -
గొంతుకోసి మహిళ హత్య
[ 28-03-2024]
మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్