గుంతల దారి.. సర్దుకుపో బాటసారీ
ఉదయగిరి-నెల్లూరు రహదారి నందవరం నుంచి నందిపాడు వరకు అధ్వానంగా తయారైంది. మార్జిన్లలో రెండు వైపులా కొన్ని అడుగుల మేర గుంతలు ఏర్పడ్డాయి.
చినమాచునూరు సెంటర్లో అధ్వానంగా రోడ్డు
ఆత్మకూరు గ్రామీణం(మర్రిపాడు), న్యూస్టుడే: ఉదయగిరి-నెల్లూరు రహదారి నందవరం నుంచి నందిపాడు వరకు అధ్వానంగా తయారైంది. మార్జిన్లలో రెండు వైపులా కొన్ని అడుగుల మేర గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గం ఇరుకుగా ఉండటంతోపాటు ప్రయాణం నరకంగా మారింది. ఈ గతుకుల నుంచి ఎప్పుడు బయట పడతామా? అని ప్రయాణికులు నిట్టూర్చుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుందనీ, గేరు తగ్గించుకుని నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోందని వాహనచోదకులు చెబుతున్నారు.
చినమాచునూరు నుంచి మరీ అధ్వానం..
రాంపల్లి నుంచి నెర్ధనంపాడు వరకు రోడ్డు కొంత ఫర్వాలేదు. కానీ, చినమాచునూరు నుంచి నందిపాడు వరకు అడుగడుగునా గుంతలతో వాహనచోదలకు అవస్థలు ఎదురవుతున్నాయి. ఎదుటి వాహనానికి దారివ్వాలంటే ఆగి పక్కకు తప్పుకోవాల్సిందే. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సుల్లో ప్రయాణించే వారు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే పరిస్థితి ఉండదు. దారి ఇరుకుగా ఉండటంతోపాటు, ఎదురుగా వాహనాలు వస్తుండటంతో నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి. రోడ్డు పక్క మార్జిన్లు నిర్వహణ లేక గోతులతో ఉండటంతో కిందికి దిగి వాహనాలను దాటి వెళ్లలేని పరిస్థితి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే కనాకష్టంగా మారింది. రెండు వరుసలుగా మార్చేందుకు సర్వే చేసి ప్రతిపాదనలు సిద్ధమైనా నేటికీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
ఆర్టీసీకి నిర్వహణ భారం
నరక దారుల్లో ఒక రోజు డ్యూటీకి వెళ్లొస్తే ఒళ్లు గుల్లవుతోందని బస్సు డ్రైవర్లు చెబుతున్నారు. బస్సులు తీవ్ర కుదుపులకు గురై.. ఒళ్లు హూనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే బస్సులకు స్ప్రింగ్లు, కట్టలు, టైర్లు తరచూ మరమ్మతులకు గురవుతూ ఆర్టీసీకి నిర్వహణ భారం తప్పడంలేదు. గుంతలదారి కావడంతో బస్సులు మాటిమాటికీ పాడవుతున్నాయి. మెకానిక్లు వీటికి ఎన్నిసార్లు మరమ్మతులు చేస్తున్నా.. పునరావృతం అవుతూనే ఉన్నాయని డ్రైవర్లు చెబుతున్నారు.
ప్రతిపాదనలకే పరిమితం
వీటి మరమ్మతులకుగానూ రహదారులు, భవనాలశాధికారులకు రూ.ఏడు కోట్ల వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు అనుమతి రాలేదు. ఫలితంగా ఇటుగా రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ర.భ.శాఖ ఏఈ అనిల్ను వివరణ కోరగా రూ.20 లక్షలతో రోడ్డుపై పెద్ద గుంతలు పడ్డి ఉన్నచోట మరమ్మతుల పనులు చేపట్టామన్నారు. రహదారి నిర్మాణానికి ప్రతిపాదనల ఆమోదం లభించిన వెంటనే పనులు మొదలు పెడతామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నీరో’ల పాలన
[ 20-04-2024]
ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా శుద్ధజల కేంద్రాలను నిర్మించింది. -
జగన్ జమానాలో పప్పన్నం కష్టమే!
[ 20-04-2024]
‘2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్మోహన్రెడ్డి.. రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరకులే దొరకడం లేదంటూ ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. -
నేడు పొదలకూరులో ప్రజాగళం
[ 20-04-2024]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. -
నిమ్మ రైతుకు జగన్ దగా
[ 20-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో హామీలే తప్ప వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్టప్రాం తం కావడంతో ఎక్కువ మంది వర్షాధారిత పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు.. -
ఉత్తర కాలువపై ఉత్తుత్తి హామీ
[ 20-04-2024]
అయిదేళ్లయింది. ఇప్పటి వరకు హామీ నెరవేర్చేందుకు చేసిన కృషి ఏమీ లేదు. ఆయకట్టు రైతులకు చేకూరిన ప్రయోజనమూ ఏమీలేదు. -
రెండో రోజు ఎనిమిది నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
మాటలే.. పనుల్లేవ్!
[ 20-04-2024]
పట్టణంలో ప్రధానమైన ట్రంకురోడ్డు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పలుమార్లు హామీలు ఇచ్చారు. -
అడ్డగోలు పోస్టులు పెడితే ఇబ్బందే
[ 20-04-2024]
చేతిలో చరవాణి ఉందని ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై పోస్టులు పెట్టడం.. సామాజిక వర్గాలను కించపరచడం... -
సర్పంచుల ఒత్తిడితోనే ఆర్థిక సంఘం నిధుల విడుదల
[ 20-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన తరువాత రూ.988 కోట్లు విడుదల అయ్యాయని సర్పంచుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి తెలిపారు. -
ఆర్ఐ రోడ్డుకు జగన్ పోటు
[ 20-04-2024]
తీరంలో నాలుగు మండలాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. -
పల్లె పాలనకు వైకాపా గ్రహణం
[ 20-04-2024]
వింజమూరు రవి పాఠశాల నుంచి నడిమూరు దేవతమహల్ సెంటర్ వరకు కాలువల్లో పూడిక పేరుకుపోయింది. -
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
[ 20-04-2024]
చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనని దగదర్తి మండలంలోని కాట్రాయపాడుకు చెందిన తాళ్లూరు సుధాకర్నాయుడు ప్రతిన బూనారు. -
తనిఖీలు విస్తృతం చేయండి: కలెక్టర్
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తి రూ.2.45 కోట్లు
[ 20-04-2024]
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తుల విలువ రూ.2.45 కోట్లుగా అఫిడవిట్లో చూపించారు. -
అభ్యర్థుల వ్యయాలపై దృష్టి
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నెల్లూరు పార్లమెంటు వ్యయ పరిశీలకులు జి.ప్రసాద్ దత్తాత్రేయ పేర్కొన్నారు. -
నామపత్రాల ధరావతు ఎందుకు పెంచారంటే..
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.