శతాబ్దాల చరిత.. కలువాయి చెరువు ఘనత
కలువాయి చెరువుకు శతాబ్దాల చరిత్ర ఉంది. కాలంలో కాస్త వెనక్కి వెళ్తే 500 సంవత్సరాల క్రితం కలువాయి కనిగిరి, ఉదయగిరి ప్రాంతాలు శ్రీకృష్ణ దేవరాయలు సామ్రాజ్యంలో ఉండేవి.
కలువాయి చెరువు
కలువాయి, న్యూస్టుడే: కలువాయి చెరువుకు శతాబ్దాల చరిత్ర ఉంది. కాలంలో కాస్త వెనక్కి వెళ్తే 500 సంవత్సరాల క్రితం కలువాయి కనిగిరి, ఉదయగిరి ప్రాంతాలు శ్రీకృష్ణ దేవరాయలు సామ్రాజ్యంలో ఉండేవి. ఆయన ఈ ప్రాంతాన్ని క్రీ.శ.1509 నుంచి 1529 వరకు పాలించారు. 1512లో ఉదయగిరి దుర్గాన్ని జయించి.. దానికి అధిపతిగా రాయసం కొండముర్సయ్యను నియమించారు. ఈయన గొప్ప సేనాని. అంతేగాకుండా ప్రజల కష్ట సుఖాలు తెలిసిన నాయకుడు. నాటి ఉదయగిరి దుర్గం ఏలుబడిలో ఆత్మకూరు, ఉదయగిరి, కనిగిరి, కలువాయి ప్రాంతాలు ఉండేవి.
తటాకం నిర్మించింది ఇలా..
క్రీ.శ. 1520లో ఉదయగిరి దుర్గం రక్షణ కోసం సైన్యాన్ని బలపరిచే నిమిత్తం కావలసిన గుర్రాల కొనుగోలుకు దేవరాయలు 10వేల వరహాలు కొండముర్సయ్య ఇచ్చి తంజావూరు నగరాధీశుని వద్ద గుర్రాలను కొనుగోలు చేసి తీసుకురమ్మని పంపించాడు. వెంటనే ఆయన బయల్దేరి మార్గమధ్యలో కలువాయి పక్కనే ఉన్న బ్రాహ్మణపల్లిలో ఒక రోజు విడిది చేశాడు. వెంట వచ్చిన సైనికులు ఆ ప్రాంతలో దొరికిన రాగులతో రాగి సంగటి చేసుకొని తిని తృప్తి చెందారు. కొండముర్సయ్య మాత్రం వరి బియ్యం కోసం గ్రామంలోకి మనుషులను పంపించాడు. ఎక్కడా వారికి బియ్యం దొరకలేదు. గ్రామంలోని ఒక వృద్ధురాలు దుర్గాధిపతితో.. ‘ఇక్కడ వరిపంట పండదు. పెంచలకోన కొండల నుంచి వచ్చే వాగులన్నీ పెన్నా నదిలోకి ప్రవహిస్తాయి. అందువల్ల ఇక్కడ వరిసాగు లేదు’ అని చెప్పింది. దీంతో అక్కడ పరిస్థితిపై బాధపడిన కొండముర్సయ్య ప్రజల కష్టనష్టాల గురించి ఆలోచించి.. గుర్రాల కోసం ఇచ్చిన 10వేల వరహాలను వినియోగించి బ్రాహ్మణపల్లి కొండ, బొటికొండల మధ్య కట్టను ఏర్పాటు చేసి కలువాయి చెరువును నిర్మించారు. అయితే అప్పట్లో వారు చెరువుకు పడమటి అలుగును మాత్రమే నిర్మించారు. దీంతో ప్రజలకు కొంతమేర మాత్రమే ఉపయోగంలో ఉండేది. తరువాత కాలంలో కుల్లూరు సీమ అధిపతి చింతపట్ల రుద్రప్ప 1612లో తూర్పు అలుగును నిర్మించాడు. దీంతో ప్రజలకు పూర్తిస్థాయిలో కలువాయి తటాకం వినియోగంలోకి వచ్చింది.
ఏడాదికి రెండు పంటలు
ఇటీవల కాలంలో సోమశిల జలాశయం నిర్మాణం తరువాత దక్షిణ కాలువను ఏర్పాటు చేసి కలువాయి చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయడంతో కలువాయి, బ్రాహ్మణపల్లి, పెన్నబద్దెవోలు, నూకనపల్లి ప్రజల సాగునీటి, తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఈ చెరువు ఆయకట్టుదారులు ఏడాదికి రెండు సీజన్లలో పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెంచులక్ష్మీపురంలో ఇంటింటి ప్రచారం
[ 24-04-2024]
కావలి నియోజకవర్గంలోని బోగోలులో రైల్వే ప్రాజెక్టును తీసుకువచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు -
తెదేపాలో చేరిక
[ 24-04-2024]
బోగోలు మండలం విశ్వనాధరావుపేట పంచాయతీ 6వ వార్డు వైకాపా నేత సుధీర్, ఎం. జయకుమార్ తెదేపాలో చేరారు. -
మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా అభ్యర్థి
[ 24-04-2024]
అల్లూరు మండలంలో తెదేపా అభ్యర్థి కావ్యక్రిష్టారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
[ 24-04-2024]
కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.
తాజా వార్తలు (Latest News)
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్