Nellore: అమ్మే.. ఆయుష్షు తీసింది
కనురెప్పే కనుపాపను కాటేసింది.. పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బిడ్డను తల్లే కడతేర్చింది. కారణమేదైనా.. అమ్మ స్పర్శ.. ఆమె రూపం తప్ప.. మరో ప్రపంచం తెలియని ఏడాదిన్నర బిడ్డ.. కన్నతల్లి కర్కశత్వానికి విగతజీవిగా మారింది.
చిన్నారి అదృశ్యం.. విషాదాంతం
చిన్నారి లక్ష్మీ హారిక
నెల్లూరు(నేర విభాగం), న్యూస్టుడే: కనురెప్పే కనుపాపను కాటేసింది.. పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బిడ్డను తల్లే కడతేర్చింది. కారణమేదైనా.. అమ్మ స్పర్శ.. ఆమె రూపం తప్ప.. మరో ప్రపంచం తెలియని ఏడాదిన్నర బిడ్డ.. కన్నతల్లి కర్కశత్వానికి విగతజీవిగా మారింది. మాతృత్వానికే కలంకం తీసుకొచ్చే ఈ విషాద సంఘటన నెల్లూరులోని గుర్రాలమడుగు సంఘంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని ఓ కళాశాలలో ఎంసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనూషకు బంధువైన మణికంఠతో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి కృతిక, లక్ష్మీహారిక సంతానం. భర్త రాపూరులో హోటల్ నిర్వహిస్తూ.. అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటారు. ఈ నెల 2వ తేదీ రాత్రి అనూష తన ఇద్దరు పిల్లలతో సమీపంలోని బంధువుల ఇంట్లో నిద్రపోయింది. చిన్న కుమార్తె లక్ష్మీహారిక ఊయలలో నిద్రించగా.. పెద్ద కుమార్తె, తల్లి కింద పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నిద్రలేచి చూడగా ఊయలలో లక్ష్మీ హారిక కనిపించలేదు. రెండు బొమ్మలు ఉన్నాయి. దాంతో పాపను ఎవరో అపహరించారని తల్లి పెద్ద ఎత్తున కేకలు వేసింది. అనంతరం బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. రెండు రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ తెలియకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. తల్లి అనూషను అదుపులోకి తీసుకుని విచారించగా.. తొలుత తనకే పాపం తెలియదని బుకాయించింది. ఆ తర్వాత అసలు విషయం వెల్లడించింది. తన చదువు, భవిష్యత్తుకు రెండో బిడ్డ అడ్డుగా ఉందని భావించి రెండో తేదీ అర్ధరాత్రి ఇంటి వెనకున్న సర్వేపల్లి కాలువలో పడేశానని విచారణలో ఒప్పుకొంది. దాంతో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి ఈతగాళ్లను పిలిపించి సర్వేపల్లి కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి మృతదేహం వెలుగుచూసింది. శవపంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదృశ్యం కేసును హత్య కేసుగా మార్చారు. బుధవారం సాయంత్రం నిందితురాలిని బాలాజీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలను నగర డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ రాములు నాయక్, ఎస్సై సుమన్, లేఖా ప్రియాంక, సిబ్బందిని అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్ నియంత్రణ అవసరం
[ 28-03-2024]
విద్యుత్ నియంత్రణ అవసరమని కొండాపురం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఎస్కే ఖాదర్ బాషా తెలిపారు. -
పొగాకు బ్యారెన్లు దగ్ధం
[ 28-03-2024]
కొండాపురం మండలంలో ఆదిమూర్తిపురం గ్రామంలో ప్రమాదవశాత్తు 4 పొగకు బ్యారెన్లు దగ్ధమైన సంఘటన గురువారం జరిగింది. -
నాయకుల రాజీనామా
[ 28-03-2024]
కావలి టౌన్ 29వ వార్డ్ తెదేపాకు చెందిన యువనేత నరేంద్ర, మాజీ కౌన్సిలర్ శెట్టిపల్లి మధు పార్టీకి రాజీనామా చేశారు. -
ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే
[ 28-03-2024]
కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రచారం ప్రారంభించారు. -
29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
[ 28-03-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే
[ 28-03-2024]
ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే -
అధనం.. నీదే భారం!
[ 28-03-2024]
ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. -
తెరచుకోని పాఠం
[ 28-03-2024]
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు -
ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు
[ 28-03-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. -
ఓటరన్నా.. మేలుకో!
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. -
జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం
[ 28-03-2024]
-
కన్నీటి శృతి
[ 28-03-2024]
తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. -
గొంతుకోసి మహిళ హత్య
[ 28-03-2024]
మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!