విచారణ.. సాగదీత
వెంకటాచలం మండలం పంచాయతీరాజ్ విభాగంలో సిమెంట్, ఇసుక పక్కదారి పట్టిన వ్యవహారంపై అధికారుల విచారణ ముందుకు సాగడం లేదు.
నిగ్గు తేలని సిమెంటు, ఇసుక స్వాహాపర్వం
వెంకటాచలం, న్యూస్టుడే
వెంకటాచలం మండలం పంచాయతీరాజ్ విభాగంలో సిమెంట్, ఇసుక పక్కదారి పట్టిన వ్యవహారంపై అధికారుల విచారణ ముందుకు సాగడం లేదు. జిల్లా మంత్రి, కలెక్టర్, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విచారణ వేగవంతం చేసి అక్రమాలు నిగ్గు తేల్చాలని చెప్పినా.. నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి.
వెంకటాచలం మండలంలో రూర్బన్, ఉపాధి నిధులతో రూ. కోట్లు వెచ్చించి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశారు. గుత్తేదారుల సౌలభ్యం కోసం అప్పట్లో ప్రభుత్వం ముందుగా రాయితీపై సిమెంట్, ఇసుక సరఫరా చేసింది. వాటికి సంబంధించిన నగదును తర్వాత బిల్లుల్లో రికవరీ చేశారు. ఇక్కడే అధికారులు అవినీతికి తెరలేపారు. చాలా మంది గుత్తేదారులకు సిమెంట్, ఇసుక సరఫరా చేయకుండానే.. చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి బిల్లుల్లో నగదు స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న గుత్తేదారులు ఖంగుతిన్నారు. తమకు సిమెంట్, ఇసుక ఇవ్వకుండా బిల్లుల్లో నగదు ఎలా మినహాయించుకుంటారని నాటి ఏఈని నిలదీశారు. సమాధానం కరవైంది. ఈ మొత్తం వ్యవహారంపై ఫిబ్రవరి 18న ‘గుత్తేదారులకే సున్నం’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది.
ఆదేశాలిచ్చినా.. అమలేదీ?
‘ఈనాడు’లో కథనం వచ్చిన వెంటనే స్పందించిన మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి.. ఆరోపణలతో పాటు మొత్తం పనులపై విచారణ జరపాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు(పూర్వ, ప్రస్తుత) ఆ మేరకు మూడు నెలల కిందటే ఆదేశాలు జారీ చేసినా, నేటికీ విచారణ పూర్తి చేయలేదు. ప్రారంభంలో విచారణ పేరుతో హడావుడి చేసి.. ఆ తర్వాత మిన్నకుండిపోయారని గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. విచారణ మొక్కుబడిగా సాగుతోందంటూ కొందరు ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిగ్గు తేల్చాలని.. అక్కడి నుంచి కూడా 20 రోజుల కిందటే ఆదేశాలు వచ్చినా.. ‘చూస్తాం.. చేస్తాం.. మాట్లాడుతున్నాం’ అనే మాటే వినిపిస్తోందని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోతుగా పరిశీలిస్తే...
జిల్లా అధికారులు ఒకటీ, రెండు పనులపైనే విచారణ జరిపారు. సిమెంట్, ఇసుక పక్కదారి పట్టిందని నిర్ధారించారు. ఒకరికి సిమెంటు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపి నగదు తగ్గించగా, ఒక గుత్తేదారుడికి పనులకు మించి సిమెంటు సరఫరా చేసినట్లు గుర్తించారు. అలా ఒకరి సిమెంటును మరొకరికి విక్రయించి అప్పటి పంచాయతీ రాజ్ ఏఈ చేతివాటం ప్రదర్శించారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం కొన్ని పనులకు మాత్రమే బిల్లులు చెల్లించింది. చాలా మందికి ఇంకా రావాల్సి ఉంది. బిల్లులు తీసుకున్న వారు.. వాటిలో సిమెంట్, ఇసుక ఇవ్వకుండా నగదు తగ్గించడాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారు. అందరికీ మొత్తం బిల్లులు చెల్లిస్తే.. ఎంత వరకు అక్రమాలు జరిగాయన్నది వెల్లడవుతుంది. ఆ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గుత్తేదారులు కోరుతున్నారు.
మరి ఇసుక...
వెంకటాచలంలో ఉంటున్న నాలి రవికుమార్ కాకుటూరులో రూ. 12.25 లక్షలతో సిమెంట్ రోడ్లు వేయించారు. ఈయనకు సిమెంట్, ఇసుక ఇవ్వలేదు. సిమెంట్ 640 బస్తాలు(32 మెట్రిక్ టన్నులు), ఇసుక 224 టన్నులు ఇచ్చినట్లు చూపి బిల్లులో రూ. 1.20 లక్షలు, రూ. 84వేలు కోత విధించారు. ఈ విషయంపై ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన వెంటనే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన పంచాయతీరాజ్ అధికారులు సిమెంట్ మరో గుత్తేదారుడికి ఇచ్చారని తేల్చి.. నగదు ఇచ్చారు. ఇసుక విషయం కూడా తేల్చాలని సదరు గుత్తేదారుడు మూడు నెలలుగా తిరుగుతున్నా నేడు, రేపు అంటూ అధికారులు కాలయాపన చేస్తూనే ఉన్నారు.
రికార్డులు చూపించాలని చెప్పాం..
బాలసుబ్బారావు, పీఆర్ ఈఈ
వెంకటాచలం మండలంలో సిమెంట్, ఇసుక పక్కదారి పట్టించారని వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నాం. అప్పట్లో గడ్డ కడుతోందని ఒకరి సిమెంట్ మరొకరికి ఇచ్చారు. జరిగిన పనులకు సబంధించిన మొత్తం రికార్డులు చూపించాలని అప్పటి ఏఈకి సూచించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడ్డగోలు పోస్టులు పెడితే ఇబ్బందే
[ 20-04-2024]
చేతిలో చరవాణి ఉందని ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై పోస్టులు పెట్టడం.. సామాజిక వర్గాలను కించపరచడం... -
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
[ 20-04-2024]
చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనని దగదర్తి మండలంలోని కాట్రాయపాడుకు చెందిన తాళ్లూరు సుధాకర్నాయుడు ప్రతిన బూనారు. -
‘నీరో’ల పాలన
[ 20-04-2024]
ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా శుద్ధజల కేంద్రాలను నిర్మించింది. -
జగన్ జమానాలో పప్పన్నం కష్టమే!
[ 20-04-2024]
‘2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్మోహన్రెడ్డి.. రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరకులే దొరకడం లేదంటూ ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. -
నేడు పొదలకూరులో ప్రజాగళం
[ 20-04-2024]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. -
నిమ్మ రైతుకు జగన్ దగా
[ 20-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో హామీలే తప్ప వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్టప్రాం తం కావడంతో ఎక్కువ మంది వర్షాధారిత పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు.. -
ఉత్తర కాలువపై ఉత్తుత్తి హామీ
[ 20-04-2024]
అయిదేళ్లయింది. ఇప్పటి వరకు హామీ నెరవేర్చేందుకు చేసిన కృషి ఏమీ లేదు. ఆయకట్టు రైతులకు చేకూరిన ప్రయోజనమూ ఏమీలేదు. -
రెండో రోజు ఎనిమిది నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
మాటలే.. పనుల్లేవ్!
[ 20-04-2024]
పట్టణంలో ప్రధానమైన ట్రంకురోడ్డు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పలుమార్లు హామీలు ఇచ్చారు. -
సర్పంచుల ఒత్తిడితోనే ఆర్థిక సంఘం నిధుల విడుదల
[ 20-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన తరువాత రూ.988 కోట్లు విడుదల అయ్యాయని సర్పంచుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి తెలిపారు. -
ఆర్ఐ రోడ్డుకు జగన్ పోటు
[ 20-04-2024]
తీరంలో నాలుగు మండలాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. -
పల్లె పాలనకు వైకాపా గ్రహణం
[ 20-04-2024]
వింజమూరు రవి పాఠశాల నుంచి నడిమూరు దేవతమహల్ సెంటర్ వరకు కాలువల్లో పూడిక పేరుకుపోయింది. -
తనిఖీలు విస్తృతం చేయండి: కలెక్టర్
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తి రూ.2.45 కోట్లు
[ 20-04-2024]
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తుల విలువ రూ.2.45 కోట్లుగా అఫిడవిట్లో చూపించారు. -
అభ్యర్థుల వ్యయాలపై దృష్టి
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నెల్లూరు పార్లమెంటు వ్యయ పరిశీలకులు జి.ప్రసాద్ దత్తాత్రేయ పేర్కొన్నారు. -
నామపత్రాల ధరావతు ఎందుకు పెంచారంటే..
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!