అక్రమాలకు రిజిస్ట్రేషన్!
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఓ ప్రహసనంలా మారింది. జిల్లాలో మొత్తం 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా- రోజుకు సగటున 150 నుంచి 200 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి.
సూత్రధారులను తప్పించేందుకు యత్నం
చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నాయకుడు
ఈనాడు డిజిటల్, నెల్లూరు
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఓ ప్రహసనంలా మారింది. జిల్లాలో మొత్తం 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా- రోజుకు సగటున 150 నుంచి 200 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఒక్క నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే (మంగళ, శుక్రవారం మినహా) 40 శాతం వరకు ఉంటాయి. ఇక్కడ ప్రతి పది లక్షల డాక్యుమెంట్ వ్యాల్యు రిజిస్ట్రేషన్కు 1 నుంచి 5 శాతం మామూళ్లు ఇచ్చుకోవాలన్నది బహిరంగ రహస్యం. అలా వస్తున్న మొత్తాలు అన్ని స్థాయిల్లో పంపకాలు జరుగుతుండగా- కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులకూ నెల వాటాలుగా వెళతాయన్న ప్రచారం జరుగుతోంది. తద్వారా తమపై విచారణలు లేకుండా చేసుకుంటున్నారని మాట వినిపిస్తోంది.
పట్టుబడుతున్నా.. మార్పులేదు..
ఇటీవల కాలంలో నకిలీ రిజిస్ట్రేషన్ల బాగోతాలు తరచూ వెలుగులోకి వస్తుండగా- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అనిశా దాడులు సర్వసాధారణంగా మారాయి. అయినా ఇక్కడ పరిస్థితులు మారడం లేదన్న మాట వినిపిస్తోంది. ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న వెంకట రమేష్.. సర్వే నంబరు 1లోని 431.29 ఎకరాల మేత పోరంబోకు స్థలంలో 40 ఎకరాలను నకిలీ పత్రాలు సృష్టించి వేరొకరికి విక్రయించగా.. రిజిస్ట్రేషన్ చేశారు. స్థానికులు ఆందోళన చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన్ను సస్పెండ్ చేశారు. సదరు రిజిస్ట్రేషన్ను రద్దు చేశారు. ప్రస్తుతం జరిగింది అలాంటిదే అయినా.. ఉన్నతాధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి అధికారులను కాపాడేందుకు పెద్ద వ్యక్తులు రంగంలోకి దిగారనే విమర్శలు ఉన్నాయి.
* దీనిపై జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులును వివరణ కోరగా.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్టోన్హౌస్పేట విషయంలో డీఐజీ ఆదేశాల మేరకు విచారణ చేశామని, నివేదిక అందజేస్తానన్నారు. ప్రస్తుతం దానిపై తానేమీ మాట్లాడకూడదన్నారు.
* స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖ డీఐజీ కిరణ్కుమార్ వివరణ అడగ్గా.. విషయం తెలిసిన వెంటనే విచారణ చేయాలని జిల్లా రిజిస్ట్రార్ను ఆదేశించాను. ప్రస్తుతం సెలవులో ఉన్నా.. రాగానే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.
స్టోన్హౌస్పేట సప‘రేటు’
నెల్లూరు స్టోన్హౌస్పేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో తాజాగా చోటు చేసుకున్న వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వెలుగు చూసిన సర్వే నంబరు 809-ఎ వివాదానికి ఈ కార్యాలయమే కేంద్రంగా నిలుస్తోంది. సదరు భూమిని దూబగుంట గోపికృష్ణమూర్తి నుంచి ఈ ఏడాది మార్చి 14వ తేదీ శ్రీధర్రావుకు రిజిస్ట్రేషన్ చేయగా.. అదే రోజు ఆ భూమిలోని కొంత భాగాన్ని ఇద్దరు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ ఇద్దరూ కార్యాలయంలోని ఓ కీలక అధికారికి తెలిసిన వ్యక్తులేనని సమాచారం. వివాదం రావడంతో అదే నెల 29న వాటిని రద్దు చేసుకున్నారు. ఆ వెంటనే అదే భూమిని మరో నలుగురికి రిజిస్ట్రేషన్ చేయడం ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని అంటున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తం చేతులు మారగా.. రద్దు చేసుకునే సమయంలో.. దాన్ని వారం రోజుల్లో ఇస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ ప్రజాప్రతినిధి అండగా ఉండటంతో.. సూత్రధారులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
[ 24-04-2024]
కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.