అంగన్వాడీ కేంద్రాల్లో శుద్ధజలం
మాతా శిశు సంరక్షణలో కీలక సేవలందిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు ‘సాక్ష్యం’ పథకం కింద శుద్ధజలం సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు స్థానికంగా ఉండే బోర్లు, రక్షిత పథకాల నుంచి నీటిని తెచ్చి వినియోగిస్తున్నారు.
మినీ ఆర్వో ప్లాంట్లు మంజూరు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: మాతా శిశు సంరక్షణలో కీలక సేవలందిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు ‘సాక్ష్యం’ పథకం కింద శుద్ధజలం సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు స్థానికంగా ఉండే బోర్లు, రక్షిత పథకాల నుంచి నీటిని తెచ్చి వినియోగిస్తున్నారు. ఆ నీటినే బాలింతలు, చిన్నారులు, గర్భిణులకు ఇస్తున్నారు. చిన్నారులకు ఆటపాటలతో విద్య నేర్పుతూ.. పోషకాహారం అందిస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రయోజనకరం కానుంది. శాశ్వత భవనాలున్న వాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వగా... విడతల వారీగా అన్నింటా ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో 2,934 కేంద్రాలు.. జిల్లాలో 2,934 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా- 1008కి సొంత భవనాలు ఉన్నాయి. తొలిదశలో జూన్ నాటికి ఈ కేంద్రాలన్నింటిలో మినీ ఆర్వోప్లాంట్లు రానున్నాయి. అద్దె భవనాల్లో 1,147 ఉండగా- అద్దె లేకుండా 310, మిగిలినవి పాఠశాల ప్రాంగణాల్లో నడుస్తున్నాయి. దశల వారీగా వీటన్నింటిలో శుద్ధజల కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఒక్కో దానికి రూ. 24వేలు.. ఒక్కో శుద్ధజల కేంద్రంలో 15 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును అమర్చుతారు. గంటకు 12 లీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది. కేంద్రానికి నీటి సదుపాయం ఉంటే నేరుగా పైపులు ఏర్పాటు చేస్తారు. ఆ సదుపాయం లేని చోట్ల ప్రత్యామ్నాయాలు ఆలోచించనున్నారు. ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించనున్నట్లు సమాచారం.
400 ఏర్పాటుచేశాం
జిల్లాలో ఇప్పటి వరకు 400 అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న శుద్ధజల కేంద్రాలను ఏర్పాటు చేశాం. విడతల వారీగా అన్నింటా ఈ సౌకర్యం కల్పిస్తాం.
సౌజన్య, ఐసీడీఎస్ పీడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.