అందని నిధులు.. సమకూరని వసతులు
ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణ, అభివృద్ధికి ఏర్పాటైన కమిటీలు నామమాత్రంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రోగులకు అవసరమైన వసతులు, మందులు, సేవల్లో అనేక లోపాలు కనిపిస్తున్నాయి.
నర్రవాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
న్యూస్టుడే, దుత్తలూరు:ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణ, అభివృద్ధికి ఏర్పాటైన కమిటీలు నామమాత్రంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రోగులకు అవసరమైన వసతులు, మందులు, సేవల్లో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ఈ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలకు తగినన్ని నిధులు అందకపోవటం ప్రధాన సమస్యగా మారింది. ఫలితంగా కమిటీల ఉద్దేశం నెరవేరటంలేదు.
* నిబంధనల మేరకు ఆసుపత్రి కమిటీలను రిజిస్టర్ చేయాల్సి ఉంది. అయినా ఎక్కడా ఈ తతంగం పూర్తి అవలేదు. దీనికితోడు ప్రభుత్వం ఏటా వైద్యశాలలకు విడుదల చేసే అభివృద్ధి నిధులకు భారీగా కోత పెట్టారు.గత ఏడాది వైద్యశాలల ఖాతాలకు జమ చేసిన నిధులనే ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఆపై ప్రభుత్వం ప్రతి పీహెచ్సీకి రూ. 25 వేలు వంతున చెల్లించి చేతులు దులుపుకుంది.
* దీనికితోడు గతంలో అత్యవసర మందులు కొనటానికి నెలకు ప్రతి పీహెచ్సీకి రూ. 3 వేలు మంజూరు చేసేవారు. గడిచిన మూడేళ్లుగా ఆ నిధులు కూడా విడుదలవటంలేదని వైద్య సిబ్బంది వాపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు, సామగ్రి కొనాలన్నా నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తోంది.
* ప్రతి రెండు నెలలకొకసారి వైద్యశాలల అభివృద్ధి కమిటీలు తప్పనిసరిగా సమావేశమవ్వాలి. అనంతరం హాజరైనవారి వివరాలు, వైద్యశాలల ఆదాయవ్యయ వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలి. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగటంలేదు. అసలు వైద్యశాలలకు అభివృద్ధి కమిటీలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* గతంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీల్లో డ్వాక్రా మహిళలు, విశ్రాంత ఉద్యోగులు సభ్యులుగా ఉండేవారు. కమిటీ ఛైర్మన్లను ప్రభుత్వం నియమించేది. ప్రస్తుత ప్రభుత్వం ఎంపీపీ ఛైర్మన్గా ఎంపీడీవో, తహసీల్దారు, వైద్యాధికారి, స్థానిక సర్పంచి, ఆసుపత్రి పరిధిలోని మరో మహిళా సర్పంచి సభ్యులుగా కమిటీల్లో నియమించింది.
* ఉదయగిరి నియోజకవర్గంలో రెండు సామాజిక, పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రతి వైద్యశాలకు ఒక కమిటీని నియమించి అభివృద్ధి నిధులు కేటాయించారు. ఆ నిధులను ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వేటికి ఖర్చు చేయాలనే అంశంపై చర్చించేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఏటా ఇచ్చే అభివృద్ధి నిధులు రూ. 1.75 లక్షల నుంచి రూ. 2.50 లక్షలకు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు (సీహెచ్సీలు) రూ. 5 లక్షలకు పెంచుతామని ప్రకటించింది. ఆచరణలో భిన్నమైన పరిస్థితి నెలకొంది.
తగిన చర్యలు తీసుకుంటాం
గతంలో ప్రతి ప్రభుత్వ వైద్యశాలకు అభివృద్ధి కమిటీలను నియమించిన మాట వాస్తవమే. ప్రతి రెండు నెలలకొకసారి తప్పనిసరిగా కమిటీలు సమావేశమై తీర్మానాలు చేయాలి. ఇక నుంచి ప్రతి వైద్యశాలలో అభివృద్ధి కమిటీలు సమావేశమయ్యేలా తగిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిధులతో అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తున్నాం.
పెంచలయ్య, జిల్లా వైద్యశాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నూరు వైకాపా సర్పంచ్ తెదేపాలో చేరిక
[ 23-04-2024]
దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బుక్కే సునీత, ఆమె భర్త వెంకట రమణ నాయక్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
పది ఫలితాల్లో నిరాశే..
[ 23-04-2024]
తన కుమార్తె పదో తరగతి చదువుతుందని కాలనీలో అందరికీ చెప్పుకుంటూ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న తల్లి దాలు లక్ష్మి గత నెలలో రహదారి ప్రమాదంలో మరణించింది. -
పసుపు దళం.. విజయగళం
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నాలుగో రోజు పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. -
పచ్చటి బతుకులపై ఫ్లోరైడ్
[ 23-04-2024]
బతికుండగానే మనిషిని నిలువునా కుంగదీసి జీవచ్ఛవంలా మార్చే ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైకాపా అధికారంలోకి వస్తే ఎక్కడికక్కడ శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించిన ప్రజాప్రతినిధులు.. సమస్య పరిష్కారం దిశగా గత ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసిన వాటినీ పట్టించుకోలేదు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచండి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పోలీసు అధికారులను ఆదేశించారు -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే: కలెక్టర్
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోడ్ ఉంటే మాకేంటి..!
[ 23-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పక్కాగా జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది -
మీ మాటలకు మోసపోయాం!
[ 23-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వేతనం రూ.15 వేలకు పెంచుతానంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. -
జగన్ హామీ.. నెరవేరదేమీ?
[ 23-04-2024]
అనుమసముద్రంపేట దర్గా రోడ్లు విస్తరణ పేరుతో ఇలా ఛిద్రం చేశారు. ఆపై అభివృద్ధి మరిచారు. పనులు సొంతం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
గెలిచి వచ్చి అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి
[ 23-04-2024]
గెలుపుతో స్వగ్రామానికి తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్ వేసిన అనంతరం తన స్వగ్రామం ఇందుపూరుకు వచ్చారు -
ఆస్తులు బుగ్గవుతుంటే.. నివారించలేని జగన్ ప్రభుత్వం
[ 23-04-2024]
వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిద అవుతున్నాయి
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!