ఈ సారీ.. చక్కెర లేదాయె
జిల్లాలో రేషన్ పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఒక నెలలో చక్కెర ఇస్తే.. మరో నెలలో కందిపప్పు ఇవ్వని దుస్థితి నెలకొంది. దీంతో కార్డుదారులకు ప్రతి నెలా ఇబ్బందులు తప్పడం లేదు.
కందిపప్పు అరకొరగానే..
కోవూరు, న్యూస్టుడే
కోవూరు మండలం ఇనమడుగు స్టాక్పాయింట్లో చక్కెర, కందిపప్పు కోసం వచ్చిన డీలర్లు
జిల్లాలో రేషన్ పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఒక నెలలో చక్కెర ఇస్తే.. మరో నెలలో కందిపప్పు ఇవ్వని దుస్థితి నెలకొంది. దీంతో కార్డుదారులకు ప్రతి నెలా ఇబ్బందులు తప్పడం లేదు. రేషన్ దుకాణంలో వచ్చే కందిపప్పు, చక్కెర కోసం ఎదురు చూడటం తప్ప.. ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు దృష్టిసారించి.. అవి సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
జిల్లాలో ఈ నెలలో చక్కెర పంపిణీకి అధికారులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పంపిణీ అనుమానంగానే ఉంది. కందిపప్పు సైతం 40శాతం మందికి సరిపడానే జిల్లాలోని 11 మండల స్టాక్ పాయింట్లకు సరఫరా చేయగా- అక్కడా అధికారులు తమకు అనుకూలమైన డీలర్లకు అధికంగా ఇచ్చి.. తక్కిన వారికి తక్కువ పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు నెలకొన్నాయి. చివర్లో ఉన్న వారికి అదీ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యం మాత్రమే పంపిణీ చేసి.. కందిపప్పు ఇవ్వకుంటే ప్రజలు తమను నిలదీస్తున్నారని.. పైగా కందిపప్పు అమ్మితేనే తమకు ప్రభుత్వం కమిషన్ ఇస్తుందని డీలర్లు వాపోతున్నారు. ఈ పరిస్థితులపై కార్డుదారులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బక్రీద్ సమయంలోనూ ఇంతేనా?
రసూల్, కోవూరు
బక్రీద్ ఉంది.. ఈ నెలలోనూ చక్కెర పంపిణీ చేయకుంటే ఎలా? రేషన్ దుకాణాలకు బదులు బియ్యం దుకాణం అని పేరు పెడితే బాగుండేది. చక్కెర, కందిపప్పు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
గుత్తేదారుడు సరఫరా నిలిపివేశారు
వెంకటేశ్వర్లు, డీఎం, పౌరసరఫరాలశాఖ
గుత్తేదారుడు చక్కెర సరఫరాను గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేశారు. విన్నవిస్తున్నా ఫలితం లేదు. జిల్లాకు ప్రతి నెలా 271.519 టన్నులు అవసరం. కందిపప్పు 25 శాతం అలాట్మెంట్ కింద 172 టన్నులు రావాల్సి ఉండగా.. 145 టన్నులు వచ్చింది. 27 టన్నులు కొరత ఏర్పడింది. అన్ని రేషన్ దుకాణాలకు కందిపప్పు సమానంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకటేశ్వరలో టీవీఎస్ ప్రాంగణ ఎంపికలు
[ 25-04-2024]
కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో 21 మంది ఎంపికయ్యారని కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. -
చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి
[ 25-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి, మంచి రోజులు రానున్నాయని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. -
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?