జగనన్నకు చెప్పినా.. వినట్లే!
‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ప్రతి సమస్యను గడువులోపు పరిష్కరిస్తున్నాం. బియాండ్ ఎస్ఎల్ఏ ఒక్క అర్జీ కూడా లేదు. - ఇవీ ఇటీవల కలెక్టర్ హరినారాయణన్ చెప్పిన మాటలు.
పరిష్కరించకనే.. పరిష్కరించామని సంక్షిప్త సందేశాలు
సీఎంవో నుంచి ఫోన్ రావడంతో ‘రీ- ఓపెన్’
ఈనాడు డిజిటల్, నెల్లూరు
కలెక్టరేట్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అర్జీలు తీసుకుంటున్న కలెక్టర్ హరినారాయణన్
‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ప్రతి సమస్యను గడువులోపు పరిష్కరిస్తున్నాం. బియాండ్ ఎస్ఎల్ఏ ఒక్క అర్జీ కూడా లేదు.
ఇవీ ఇటీవల కలెక్టర్ హరినారాయణన్ చెప్పిన మాటలు.
రికార్డుల ప్రకారం అది నిజమే అయినా.. తిరిగి ఓపెన్ అవుతున్న అర్జీల సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది. జిల్లాలోని ప్రతి మండల కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నా.. అక్కడ ఇచ్చే అర్జీలకు పరిష్కారం దొరకడం లేదనే ఉద్దేశ్యంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు కలెక్టరేట్కు వరుస కడుతున్నారు. ఆ సంఖ్య సగటున 200 నుంచి 250 వరకు ఉంటోంది. ఒక్క కలెక్టరేట్లో నిర్వహించే కార్యక్రమానికే ఇన్ని అర్జీలు వస్తుంటే.. జిల్లా, మండల కార్యాలయాల్లో ఆ సంఖ్య గణనీయంగానే ఉంటుంది. సమస్యను బట్టి వారం నుంచి మూడు నెలల్లో అర్జీ పరిష్కరించాల్సి ఉన్నా.. ఆ విషయంలో పలువురు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఎంతో మంది కలెక్టరేట్కు వచ్చి తమ గోడును అర్జీల రూపంలో అందిస్తుండగా.. వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించకుండానే.. చేసినట్లు చెబుతున్నారు. అర్జీదారుడికి సమాచారం ఇవ్వకుండానే సమస్య పరిష్కరించామని సెల్ఫోన్ సందేశం పంపి చేతులు దులుపుకొంటుండగా- బాధితులు మళ్లీ మళ్లీ ఫిర్యాదు చేయాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు.
ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉన్నా..
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను దరఖాస్తుదారుడికి తెలియకుండా మూసివేయడానికి వీలు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్రకారం సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సి ఉంటుంది. సంబంధిత శాఖ అధికారి అర్జీ ఇచ్చిన వారితో మాట్లాడటంతో పాటు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే తేదీ, సమయం, ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తాం అనే వివరాలను ముందుగా చెప్పాల్సి ఉంది. క్షేత్రస్థాయికి పరిశీలనకు వెళ్లగానే ముందుగా సమస్యపై మాట్లాడి.. ఆ సమయంలో అర్జీదారుడితో తప్పనిసరిగా ఫొటో తీసుకోవాలి. అనంతరం ఆ పోర్టల్లో అప్లోడ్ చేయడంతో పాటు ఏ విధంగా పరిష్కరించామనే వివరాలను పొందుపరచాల్సి ఉంది. ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.. పరిష్కారం కాకుండానే పూర్తయినట్లు చూపుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. స్పందనకు వచ్చిన అర్జీల వివరాలు, అవి ఏయే దశల్లో ఉన్నాయనే సమాచారం ఇవ్వడంలోనూ కలెక్టరేట్ సిబ్బంది గోపత్య పాటిస్తుండటం గమనార్హం.
26 అర్జీలు తిరిగి ప్రారంభం
క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారమైనట్లు అధికారులు నమోదు చేసిన తర్వాత.. సీఎంవో నుంచి అర్జీదారులకు ఫోన్ చేస్తున్నారు. మీ సమస్య పరిష్కారం అవడంపై మీ సంతృప్తి చెందుతున్నారా? అని అడగ్గా.. సుమారు 26 మంది లేదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దాంతో వాటిని తిరిగి ప్రారంభించాలని సూచించారు. రెవెన్యూ, గ్రామ సచివాలయాలు, పశుసంవర్ధకశాఖ, గ్రామీణ నీటిపారుదలశాఖ, వ్యవసాయం, సర్వే తదితర శాఖలవి తిరిగి ప్రారంభించాలన్న అర్జీలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
* నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి.. కాలువలు ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని స్పందనలో ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆయన చరవాణికి ఓ సంక్షిప్త సమాచారం వచ్చింది. ‘మీ సమస్యను పరిష్కరించాం’ అని అందులో ఉంది. సదరు వ్యక్తి.. సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లగా.. ఎలాంటి మార్పు లేదు. పనులు ఆగడం అటుంచి.. శరవేగంగా జరుగుతుండటంతో అవాక్కయ్యారు.
* కోవూరు నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి.. నార్తురాజుపాళెం వద్ద ప్రభుత్వ స్థలంలో గ్రావెల్ అక్రమంగా తవ్వుతున్నారని కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. వెంటనే నిలుపుదల చేసినట్లు ఆయనకు ఓ సమాచారం పంపారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు లేదు. పైగా ఫిర్యాదు చేసిన వ్యక్తికి బెదిరింపులు వచ్చాయి. దాంతో నాకెందుకులే అని మిన్నకుండిపోయారు.
ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి
రోణంకి కూర్మనాథ్, జేసీ
జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా వస్తున్న ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాం. వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నాం. కొన్ని దరఖాస్తులు తిరిగి రీ ఓపెన్ అవుతున్నాయి. అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నాం. దరఖాస్తుదారుడు లేకుండా ఏ అర్జీ మూసివేయడానికి వీలులేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకటేశ్వరలో టీవీఎస్ ప్రాంగణ ఎంపికలు
[ 25-04-2024]
కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో 21 మంది ఎంపికయ్యారని కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. -
చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి
[ 25-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి, మంచి రోజులు రానున్నాయని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. -
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం