పరదాలు అడ్డుపెట్టి.. వేడికి మస్కా కొట్టి..
ఎండకు బయటకెళ్లలేక.. వేడికి ఇంట్లో ఉండలేక చెమటలు కక్కుతున్నారు. ఉపశమనానికి గదుల్లో ఏసీలు బిగించుకునే స్థోమత అందరికీ ఉండదు. తక్కువ ఖర్చుతో.. అసలు ఖర్చే లేకుండా ఇంటిని చల్లగా మార్చేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
ఎండకు బయటకెళ్లలేక.. వేడికి ఇంట్లో ఉండలేక చెమటలు కక్కుతున్నారు. ఉపశమనానికి గదుల్లో ఏసీలు బిగించుకునే స్థోమత అందరికీ ఉండదు. తక్కువ ఖర్చుతో.. అసలు ఖర్చే లేకుండా ఇంటిని చల్లగా మార్చేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
* వేసవిలో గాలి వస్తుందని కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం చాలా మందికి అలవాటు. గాలితో పాటు వేడి సైతం ఇంట్లోకి వస్తుంది. మొదటగా వేడికి అడ్డుకట్ట వేయాలి. కిటికీలు, తలుపులకు పరదాలు వేయాలి. కిటికీల వద్ద ఉన్న బ్లైండ్స్లను మూయాలి. ప్రత్యేకించి ఉత్తరం, పశ్చిమ వైపు ఉన్న కిటికీల నుంచి వేడి రాకుండా ముదురు రంగు పరదాలతో మూయాలి. వెలుతురు తగ్గితే లైట్లు వేసుకోవచ్చు. దీంతో చాలావరకు వేడి తగ్గిపోతుంది.
* కిటికీల్లో పూలు, అలంకరణ మొక్కలను పెంచుకోవడం ద్వారా వేడి నేరుగా ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడొచ్చు. మేడపైన తోట పెంచుకోవడం ద్వారా గ్రీన్రూఫ్గా మార్చుకోవచ్చు.
* అపార్ట్మెంట్ బాల్కనీల్లో ప్రస్తుతం స్లైడ్ డోర్లు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బాల్కనీల్లోంచి నేరుగా ఎండ, వేడి గాలి లోపలికి రాకుండా సమ్మర్ షేడ్ మ్యాట్లను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం వెదురుతో సహా రకరకాల సామగ్రితో అందంగా తయారు చేసిన చాపలు దొరుకుతున్నాయి. ఇవి చాలావరకు వేడిని అడ్డుకుంటాయి. ఈ చాపలను నీటితో తడిపితే చల్లని గాలి లోపలికి వస్తుంది. సైడ్డోర్లు మూయాల్సిన పని ఉండదు. వేసవిలోనే కాదు వర్షాకాలంలో వాననీరు లోపలికి రాకుండా ఉపయోగపడుతుంది. ఇవేవి లేకపోయినా.. ఇంట్లో పాతబెడ్షీట్ను సైతం అడ్డుగా వేసుకోవచ్చు.
* వేసవిలో ఇంట్లో ఫ్యాన్లు 24 గంటలూ తిరుగుతుంటాయి. ఎక్కువ వేగంతో తిరిగితే మరింత వేడి గాలే వస్తుంది. అందుకే కావాల్సిన వేగంతో పెట్టుకోవాలి. మధ్యమధ్యలో ఆపి తిరిగి వేసుకోవాలి.
* సాయంత్రం ఉష్ణోగ్రతలు తగ్గగానే కిటికీలు, తలుపులు తెరవడం ద్వారా బయటి నుంచి చల్లనిగాలి ఇంట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఇంట్లో ఉక్కపోత ఎక్కువ కాబట్టి గంటసేపు ఆరుబయట గడపడం మేలు.
* మేడపైన చల్లదనానికి కూల్ పెయింట్స్ వేసుకోవచ్చు.
* తెలుపు రంగు ఎల్ఈడీలు మేలు. వానాకాలం, శీతాకాలంలో వామ్ వైట్ లైటింగ్ను వినియోగించుకోవచ్చు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నూరు వైకాపా సర్పంచ్ తెదేపాలో చేరిక
[ 23-04-2024]
దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బుక్కే సునీత, ఆమె భర్త వెంకట రమణ నాయక్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
పది ఫలితాల్లో నిరాశే..
[ 23-04-2024]
తన కుమార్తె పదో తరగతి చదువుతుందని కాలనీలో అందరికీ చెప్పుకుంటూ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న తల్లి దాలు లక్ష్మి గత నెలలో రహదారి ప్రమాదంలో మరణించింది. -
పసుపు దళం.. విజయగళం
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నాలుగో రోజు పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. -
పచ్చటి బతుకులపై ఫ్లోరైడ్
[ 23-04-2024]
బతికుండగానే మనిషిని నిలువునా కుంగదీసి జీవచ్ఛవంలా మార్చే ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైకాపా అధికారంలోకి వస్తే ఎక్కడికక్కడ శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించిన ప్రజాప్రతినిధులు.. సమస్య పరిష్కారం దిశగా గత ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసిన వాటినీ పట్టించుకోలేదు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచండి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పోలీసు అధికారులను ఆదేశించారు -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే: కలెక్టర్
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోడ్ ఉంటే మాకేంటి..!
[ 23-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పక్కాగా జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది -
మీ మాటలకు మోసపోయాం!
[ 23-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వేతనం రూ.15 వేలకు పెంచుతానంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. -
జగన్ హామీ.. నెరవేరదేమీ?
[ 23-04-2024]
అనుమసముద్రంపేట దర్గా రోడ్లు విస్తరణ పేరుతో ఇలా ఛిద్రం చేశారు. ఆపై అభివృద్ధి మరిచారు. పనులు సొంతం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
గెలిచి వచ్చి అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి
[ 23-04-2024]
గెలుపుతో స్వగ్రామానికి తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్ వేసిన అనంతరం తన స్వగ్రామం ఇందుపూరుకు వచ్చారు -
ఆస్తులు బుగ్గవుతుంటే.. నివారించలేని జగన్ ప్రభుత్వం
[ 23-04-2024]
వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిద అవుతున్నాయి
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్