పురోగతి సరే.. పటిష్ఠతేదీ?
జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా పురోగతి సాధించినా.. నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. ఒక్కో యూనిట్కు రూ. 1.80 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా..
జగనన్న కాలనీల్లో నాసిరకంగా ఇళ్ల నిర్మాణం
కనీస ప్రమాణాలు పాటించని గుత్తేదారులు
అంబాపురం సమీపంలోని జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లు
జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా పురోగతి సాధించినా.. నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. ఒక్కో యూనిట్కు రూ. 1.80 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా.. ఇందులో కేంద్రం రూ. 1.50 లక్షలు భరిస్తోంది. మిగిలిన రూ. 30వేలను గ్రామీణ ప్రాంతాల్లో నరేగా కింద సర్దుబాటు చేస్తుండగా- పట్టణ ప్రాంతాల్లో మాత్రం రాష్ట్రం భరించాల్సి వస్తోంది. పెరిగిన ధరల నేపథ్యంలో ఇంటి నిర్మాణం లబ్ధిదారులకు కష్టతరంగా మారింది. మేస్త్రీ కూలీ నిర్మాణ పనుల్లో సగం ఉంటుండగా- ఇసుక, స్టీలు, సిమెంట్, ఇటుక ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రభుత్వం ఇస్తున్న సాయం సరిపోక కొందరు లబ్ధిదారులు ముందుకు రాకపోగా.. గుత్తేదారులు డబ్బును బట్టి ఇంటి నిర్మాణం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల కిందట కురిసిన గాలి వానకు.. నెల్లూరు రూరల్ పరిధిలోని అంబాపురం సమీపంలోని లేఅవుట్లో చేపట్టిన నిర్మాణాల్లో ఒకటి గాలికి పడిపోవడం విమర్శలకు తావిచ్చింది.
ఈనాడు డిజిటల్, నెల్లూరు: కలెక్టరేట్, న్యూస్టుడే
జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి దాదాపు 90,092 ఇళ్లను ప్రభుత్వం పేదలకు మంజూరు చేసింది. వాటిలో ఇప్పటి వరకు 11,667 పూర్తి చేయగా.. 40,965 బీబీఎల్ స్థాయిలో నిలిచిపోయాయి. 20,597 బీబీఎల్ దశలో ఉన్నాయి. ఇదే సమయంలో కాలనీల్లో నిర్మాణాల పటిష్ఠతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పునాది బలంగా ఉంటేనే ఇల్లు పది కాలాలు దృఢంగా ఉంటుందనే సూత్రాన్ని కొందరు గుత్తేదారులు విస్మరిస్తున్నారు. బేస్మెంట్ నిర్మాణాలు నాసిరకంగా చేపట్టడంతో పాటు పిల్లర్ల నిర్మాణంలోనూ కనీస నిబంధనలు పాటించడం లేదు. కొన్నిచోట్ల ఒక్క అడుగు తవ్వకుండా.. నేలపైనే బీమ్ నిర్మించి.. బేస్మెంట్ వేస్తున్నారు. నిర్మాణం తర్వాత గోడలకు నీరు పట్టకపోవడంతో బలహీనంగా మారుతున్నాయి. నాసిరకం ఇటుకలు వినియోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఒక్కో ఇంటికి రూ. 2.15 లక్షలు
పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మూడో ఐచ్ఛికం కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తోంది. అందులో భాగంగా జిల్లాలో 22,693 ఇళ్ల నిర్మాణాన్ని గుత్తేదారులకు అప్పగించారు. బిల్లులు నేరుగా లబ్ధిదారుల ఖాతా నుంచి.. వారికి జమయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో ఇంటికి రూ. 1.80 లక్షలు ప్రభుత్వం ఇస్తోంది. దీంతో పాటు లబ్ధిదారుడికి రూ. 35వేలు వడ్డీలేని రుణం మంజూరు చేసి.. ఆ మొత్తం కూడా గుత్తేదారు సంస్థ ఖాతాలోకి మళ్లిస్తున్నారు. ఇలా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.15 లక్షలు చెల్లిస్తున్నారు. గుత్తేదారులకు రూ. 487.89 కోట్ల విలువైన ఇళ్ల పనులను అప్పగించగా..ఇప్పటి వరకు 468 మాత్రమే పూర్తి చేశారు. ఆర్సీ, ఆర్ఎల్ స్థాయిలో 3,600 ఉన్నాయి.
* దీనిపై గృహ నిర్మాణశాఖ పీడీ నరసింహం వివరణ కోరగా.. నాసిరకంపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. అంబాపురం వద్ద వర్షానికి ప్లాస్టరింగ్ కారినట్లు సిబ్బంది తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని గుత్తేదారులకు సూచించాం. ఎక్కడైనా నాణ్యతను విస్మరించినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
బేస్మెంట్తోనే సరి..
జిల్లాలో గుత్తేదారులు చేపట్టిన ఇళ్లన్నీ దాదాపు బేస్మెంట్ దశలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 468 పూర్తి చేశారు. బేస్మెంట్ పూర్తయిన వాటికి ప్రభుత్వం రూ. 70వేలు చెల్లిస్తోంది. దీంతో అక్కడి నుంచి నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రారంభించిన వాటిలో 12,875 బేస్మెంట్ స్థాయిలో నిలిచిపోయాయి. మిగిలిన వాటిలో 2,242 రూఫ్ దశ పూర్తి చేసుకోవడం గమనార్హం. నెలల తరబడి పనులు నిలిచిపోవడంతో నాణ్యత దెబ్బతింటోందని లబ్ధిదారులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతను పరిశీలిస్తే.. పదికాలల పాటు పటిష్ఠంగా ఉంటాయని అభిలషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
[ 19-04-2024]
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
పసుపులేటి గూటికి వైకాపా కీలక నేత
[ 19-04-2024]
కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. -
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత