తగ్గిన పాలధర
ఎండలు మండిపోతున్నాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రభావం పాల దిగుబడిపై పడింది. పాలు తక్కువగా వస్తుండటంపై తమ జీవనంపై ప్రభావం చూపుతోందని పాడి రైతులు
ఎండలు మండిపోతున్నాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రభావం పాల దిగుబడిపై పడింది. పాలు తక్కువగా వస్తుండటంపై తమ జీవనంపై ప్రభావం చూపుతోందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా- ఉష్ణోగ్రత ప్రభావం పడకుండా పశుసంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పశువైద్యులు సూచిస్తున్నారు.
నెల్లూరు(స్టోన్హౌస్పేట), న్యూస్టుడే : పశుసంవర్ధకశాఖ లెక్కల ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా 6,46,106 నల్ల, 57,774 తెల్ల పశువులు ఉండగా- వీటిల్లో పాలిచ్చేవి 3,47,799 ఉన్నాయి. సంవత్సరంలో ప్రతి 90 రోజులకు.. వాటి నుంచి వచ్చే పాల దిగుబడిని లెక్కిస్తారు. ఆ ప్రకారం రోజువారీ 22 లక్షల లీటర్ల పాల దిగుబడులు వస్తున్నాయి. వేసవిలో ఈ మొత్తం తగ్గడం సహజం. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెల వరకు ఈ పరిస్థితి ఉంటుంది.
ఈ ఏడాది 20 శాతం తగ్గుదల
ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. ప్రస్తుతం 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. ఎండలకు తోడు.. వేడి గాలుల ప్రభావం పాల దిగుబడిపై పడింది. ఎండా కాలంలో పచ్చగడ్డి దొరకదని, పశువులకు మేతగా ఎండుగడ్డే ఇవ్వడం.. ఉష్ణోగ్రతల కారణంగా పాల దిగుబడి తగ్గిపోయిందని పోషకులు చెబుతున్నారు. ప్రస్తుతం 18 లక్షల లీటర్ల దిగుబడి ఉండొచ్చని జిల్లా పశుసంవర్ధకశాఖ అంచనా వేస్తోంది. విజయ పాల డెయిరీకి సాధారణ రోజుల్లో.. రోజువారీ 28 వేల లీటర్లు వస్తుండగా- ప్రస్తుతం 18 వేలకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో ఖర్చులు పెరిగి.. ఆదాయం తగ్గిందని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా- వేసవి తీవ్రత తగ్గి.. వర్షాకాలం మొదలవగానే.. యథాప్రకారం పాల దిగుబడి పెరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు.
18 లీటర్లకు 13
నా వద్ద ఉన్న పశువుల్లో 5 బర్రెలు పాలిస్తాయి. వాటి నుంచి రోజువారీ 18 లీటర్లకు పైగా వచ్చేవి. ఇటీవల నుంచి 12 లీటర్లు వస్తున్నాయి. ఎండలు తగ్గే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. - పెంచలయ్య, వెంకటాచలం మండలం
ప్రత్యేక చర్యలతో..
ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో పశుసంరక్షణకు రైతులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఎండకు మేపునకు వదలకుండా.. షెడ్డులో ఎండ పడకుండా.. పశువులకు గాలి బాగా వచ్చేలా ఫ్యాన్లు ఏర్పాటు చేయడం తదితరాలు చేపట్టాలి. వాటికి ఏదైనా సమస్య వస్తే.. వెంటనే పశువైద్య సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాలి. నీటిని అందుబాటులో ఉంచాలి. ఎండలు తగ్గితే.. మళ్లీ పాల దిగుబడి పెరుగుతుంది.
డాక్టర్ మంజునాథ్ సింగ్, పశుసంవర్ధకశాఖ వైద్యులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నూరు వైకాపా సర్పంచ్ తెదేపాలో చేరిక
[ 23-04-2024]
దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బుక్కే సునీత, ఆమె భర్త వెంకట రమణ నాయక్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
పది ఫలితాల్లో నిరాశే..
[ 23-04-2024]
తన కుమార్తె పదో తరగతి చదువుతుందని కాలనీలో అందరికీ చెప్పుకుంటూ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న తల్లి దాలు లక్ష్మి గత నెలలో రహదారి ప్రమాదంలో మరణించింది. -
పసుపు దళం.. విజయగళం
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నాలుగో రోజు పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. -
పచ్చటి బతుకులపై ఫ్లోరైడ్
[ 23-04-2024]
బతికుండగానే మనిషిని నిలువునా కుంగదీసి జీవచ్ఛవంలా మార్చే ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైకాపా అధికారంలోకి వస్తే ఎక్కడికక్కడ శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించిన ప్రజాప్రతినిధులు.. సమస్య పరిష్కారం దిశగా గత ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసిన వాటినీ పట్టించుకోలేదు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచండి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పోలీసు అధికారులను ఆదేశించారు -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే: కలెక్టర్
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోడ్ ఉంటే మాకేంటి..!
[ 23-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పక్కాగా జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది -
మీ మాటలకు మోసపోయాం!
[ 23-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వేతనం రూ.15 వేలకు పెంచుతానంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. -
జగన్ హామీ.. నెరవేరదేమీ?
[ 23-04-2024]
అనుమసముద్రంపేట దర్గా రోడ్లు విస్తరణ పేరుతో ఇలా ఛిద్రం చేశారు. ఆపై అభివృద్ధి మరిచారు. పనులు సొంతం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
గెలిచి వచ్చి అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి
[ 23-04-2024]
గెలుపుతో స్వగ్రామానికి తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్ వేసిన అనంతరం తన స్వగ్రామం ఇందుపూరుకు వచ్చారు -
ఆస్తులు బుగ్గవుతుంటే.. నివారించలేని జగన్ ప్రభుత్వం
[ 23-04-2024]
వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిద అవుతున్నాయి
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!