మసకబారిన వెలుగు
నెల్లూరు నగరంలో విద్యుద్దీపాల నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. కొన్నిచోట్ల పగలు వెలుగుతుండగా- మరికొన్ని చోట్ల రాత్రిళ్లు వెలగకపోవడంతో అంధకారం నెలకొంటోంది. ఫిర్యాదులతో సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసినా..
మెక్లిన్స్ రోడ్డులో విద్యుద్దీపాలు వెలగక అలుముకున్న చీకట్లు
నెల్లూరు నగరంలో విద్యుద్దీపాల నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. కొన్నిచోట్ల పగలు వెలుగుతుండగా- మరికొన్ని చోట్ల రాత్రిళ్లు వెలగకపోవడంతో అంధకారం నెలకొంటోంది. ఫిర్యాదులతో సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసినా... నిరీక్షించినంత కాలం ఫలితం ఉండటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంధకారం నెలకొని కాలనీల్లో ప్రమాదాలు, దొంగతనాలు తీవ్రమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్టుడే : నగరం 150 చదరపు కి.మీ. విస్తరించింది. 54 డివిజన్లలో 1.60 లక్షల గృహాలు ఉండగా- సుమారు పది లక్షల మంది జనాభా ఉన్నారు. పలు ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ఏర్పాటు చేసిన వీధి దీపాలు పూర్తి స్థాయిలో వెలగడం లేదు. చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. కొన్ని స్తంభాలకు దీపాలే లేవు. శివారులోని కొత్తూరు, చంద్రబాబునగర్, భగత్సింగ్ కాలనీ, వైఎస్సార్ నగర్, శ్రామికనగర్, బుజబుజ నెల్లూరు, ఆర్టీసీ, రెవెన్యూ, టైలర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది.
కొరవడిన పర్యవేక్షణ
నగరంలో మొత్తం 40వేల వరకు వీధి దీపాలు ఉండగా- వీటిలో పది వేల వరకు మరమ్మతులకు గురైనట్లు సమాచారం. నిర్వహణను ఓ సంస్థకు అప్పగించారు. ఎల్ఈడీ దీపాలతో పాటు వాటి పరికరాలను సదరు సంస్థ సమకూరుస్తోంది. ప్రధాన కూడళ్లలో 110 వాట్స్, అంతర్గత వీధుల్లో 60, 20 వాట్స్ దీపాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆటో ఆన్, ఆటో ఆఫ్ విధానం అమలు చేస్తోంది. ఎక్కడైనా మరమ్మతులకు గురైతే.. దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం చేరిన 48 గంటల్లో కొత్తది ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇబ్బందులు ఉంటే.. ఆ ప్రాంతంలో విద్యుత్తు స్తంభానికి ఏర్పాటు చేసిన పెట్టెపై ఉన్న నంబరుకు ఫోన్ చేసి చెప్పొచ్చు. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదనే అసంతృప్తి ఉంది. దీనిపై ఎలక్ట్రికల్ డీఈ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి ఎక్కడ విద్యుద్దీపం వెలగడం లేదని ఫిర్యాదు వచ్చినా.. వెంటనే స్పందించి మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్