పథకాల సద్వినియోగంతో అభివృద్ధి: కలెక్టర్
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కలెక్టర్ హరినారాయణన్ సూచించారు.
నమునా చెక్కును రైతులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరిస్తున్న కలెక్టర్ హరినారాయణన్
నెల్లూరు(స్టోన్హౌస్పేట), న్యూస్టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కలెక్టర్ హరినారాయణన్ సూచించారు. రైతు భరోసా ఐదో విడత నిధులు, పంట నష్ట పరిహారం విడుదల నమూనా చెక్కులను నగరంలోని ముత్తుకూరు రోడ్డు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఏఆర్ఎస్ ప్రాంగణంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లు, చిరుధాన్యాలు, వైఎస్సార్ యంత్ర సేవ, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 2,14,636 మంది రైతులకు తొలివిడత రైతు భరోసా- పీఎం కిసాన్ నగదు రూ.118 కోట్లు, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 1579 మంది రైతులకు పరిహారం రూ.1.85 కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్రాజు, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, శిక్షణ కలెక్టర్ సంజనా సింహ, వ్యవసాయ శాఖ డీడీ శివన్నారాయణ, ఏడీలు అనిత, నర్సోజీరావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
వసతి గృహాల్లో ఎక్కువ మంది చేరేలా చర్యలు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబరులో సాంఘిక సంక్షేమ శాఖలో అమలవుతున్న పథకాలు, వసతి గృహాల పనితీరు, వసతులు, తాగునీరు, పరీక్షల ఫలితాలు తదితర విషయాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ సంజన సిన్హా, జిల్లాలోని సహాయ సాంఘిక సంక్షేమాధికారులు పాల్గొన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందించడమే లక్ష్యంగా అయిదు రకాల గుర్తింపు కార్డులు అందించాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆధార్, రేషన్, ఓటరు, ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలన్నారు. సమావేశంలో ప్రాజెక్టు అధికారి మందా రాణి, ఈఈ వసంత, ఐటీడీఏ అధికారులు పరిమళ, శ్రీనివాసులు, కలీం తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారులకు భూసేకరణ వేగవంతం చేస్తూ రైతులకు పరిహారం అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి వివరించారు. అమరావతి నుంచి భూహక్కు పత్రాల పంపిణీ, విద్యుత్తు, జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మాణ లబ్ధిదారులకు రుణాలు, ఎన్ఆర్ఈజీఎస్, జలజీవన్ మిషన్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఎం.హరినారాయణన్, జేసీ రోణంకి కూర్మనాథ్, నగరపాలకసంస్థ కమిషనర్ వికాస్మర్మత్, శిక్షణ కలెక్టర్లు విద్యాధరి, సంజన సిన్హా జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!