బడి చిత్రం మారలేదు!
మరో పది రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవులు పూర్తి చేసుకొని పిల్లలంతా ఉత్సాహంగా బడి బాట పట్టనున్నారు. చక్కటి గదులు, వసతులతో స్వాగతం చెప్పాల్సిన ప్రభుత్వ విద్యాలయాలు మాత్రం అసౌకర్యాలతోనే కునారిల్లుతున్నాయి.
బిల్లుల సమస్యతో ముందుకు కదలని నాడు-నేడు పనులు
మరో పది రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవులు పూర్తి చేసుకొని పిల్లలంతా ఉత్సాహంగా బడి బాట పట్టనున్నారు. చక్కటి గదులు, వసతులతో స్వాగతం చెప్పాల్సిన ప్రభుత్వ విద్యాలయాలు మాత్రం అసౌకర్యాలతోనే కునారిల్లుతున్నాయి. నాడు-నేడు రెండో విడత కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో పునాదులు దశే దాటనివెన్నో, దీంతో ఈ విద్యా సంవత్సరం కూడా గదుల కొరతతో ఆరుబయట, చెట్ల కింద పాఠాలు చెప్పాల్సిన దుస్థితి. ఫలితంగా విద్యార్థులకు పాఠశాలల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
ఈనాడు డిజిటల్, నెల్లూరు: విద్య, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన బడి నాడు-నేడు’ ద్వారా మౌలిక వసతులు కల్పిస్తామన్న ప్రకటనలు కార్యరూపం దాల్చడంలో జాప్యం జరుగుతోంది. నూతన విద్యా విధానాన్ని ఆగమేఘాలపై అమలు చేస్తున్న ప్రభుత్వం- అందుకు అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై తగిన దృష్టి పెట్టలేదు. మరో పది రోజుల్లో పాఠశాలలు ప్రారంభమవుతున్నా.. నేటికీ చాలా బడుల్లో పనులు ఊపందుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి నిలిచిపోయాయి. మొన్నటి వరకు సిమెంట్, ఇసుక, ఇనుము కొరతతో జరగకపోగా- గత కొన్ని రోజులుగా బిల్లుల సమస్యతో ముందుకు సాగడం లేదు. నూతన విద్యా విధానంలో భాగంగా ఉన్నత పాఠశాలకు కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను విలీనం చేశారు. ఇప్పటి వరకు 6-10 తరగతులతో నడిచే 200కు పైగా ఉన్నత పాఠశాలు.. ఈ ఏడాది నుంచి 3-10 తరగతులుగా మారాయి. ఆ ప్రకారం ప్రతి తరగతికి ఒక గది ఉండాల్సి ఉండగా- 90 శాతం పాఠశాల్లో తగినన్ని లేవు.
నిర్మాణాలు.. నత్తతో పోటీ
3, 4, 5 తరగతుల విలీనాన్ని దృష్టిలో పెట్టుకుని నాడు-నేడు రెండో దశలో ఉన్నత పాఠశాలల్లో గదుల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. 854 బడుల అభివృద్ధికి, 552 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 453.91 కోట్లు మంజూరు చేసింది. వీటిలో దాదాపు అన్నిచోట్ల పనులు ప్రారంభమైనట్లు అధికారులు లెక్కలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి సిమెంట్, ఇనుము సరఫరా చేస్తామని చెప్పడంతో గుత్తేదారులు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని పాఠశాలలకు ఇసుక సరఫరా చేసినా.. మిగిలినవి అందుబాటులో లేకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. చాలా చోట్ల పునాదుల్లో నిలిచిపోయాయి. బిల్లులు కూడా విడతల వారీగా విడుదల అవుతుండటంతో.. గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఈ ఏడాదీ విద్యార్థులకు వరండాలు, చెట్ల నీడే దిక్కయ్యేలా ఉందని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.
వెంకటాచలం:
వెంకటాచలం ఉన్నత పాఠశాలలో గదులు సరిపోకపోవడంతో విద్యార్థులను చెట్ల కిందనే కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడాది కిందట అదనపు తరగతి గదులను మంజూరు చేశారు. ప్రస్తుతం వాటి నిర్మాణం ప్రారంభమైంది. బిల్లులు సకాలంలో రాకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మండలంలోని చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
నెల్లూరు
మూలాపేటలోని రామయ్య బడిలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులివి. ఇక్కడున్న పాత భవనాలను కూల్చి.. కొత్తవి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ సుమారు 400 మంది చిన్నారులు ఉండగా.. గదులు సరిపోని పరిస్థితి. ఈ ఏడాది 3, 4, 5 తరగతుల వారు వచ్చి చేరుతుండటంతో సమస్య జఠిలమయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు పనులు పూర్తవుతాయో.. ఎప్పుడు గదులు అందుబాటులోకి వస్తాయోనని ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
వేగం పెంచుతాం
ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్షా అభియాన్
నాడు-నేడు పనుల్లో వేగం పెంచుతున్నాం. పాఠశాలలు ప్రారంభించేలోపు మరుగుదొడ్లు, బోర్డులు, ప్రహరీలు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అదనపు గదుల్లో 80 పైకప్పు దశలో ఉన్నాయి. త్వరితంగా అన్నింటినీ పూర్తి చేసి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూస్తాం.
వేగం పెంచుతాం
ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్షా అభియాన్
నాడు-నేడు పనుల్లో వేగం పెంచుతున్నాం. పాఠశాలలు ప్రారంభించేలోపు మరుగుదొడ్లు, బోర్డులు, ప్రహరీలు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అదనపు గదుల్లో 80 పైకప్పు దశలో ఉన్నాయి. త్వరితంగా అన్నింటినీ పూర్తి చేసి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
[ 19-04-2024]
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
పసుపులేటి గూటికి వైకాపా కీలక నేత
[ 19-04-2024]
కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. -
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి