త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తాం
సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1, ఫేజ్-2 నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల భూ సమస్యలను త్వరితంగా పరిష్కరిస్తామని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు.
కలెక్టర్ హరినారాయణన్
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హరినారాయణన్
మర్రిపాడు, న్యూస్టుడే: సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1, ఫేజ్-2 నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల భూ సమస్యలను త్వరితంగా పరిష్కరిస్తామని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. పడమటినాయుడుపల్లి, కంపసముద్రం గ్రామాల్లో శుక్రవారం హైలెవల్ కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పడమటినాయుడుపల్లిలో 2013 నుంచి హైలెవల్ కెనాల్ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని.. భూసేకరణ, ఆర్అండ్ఆర్ సమస్యలు పరిష్కారం కాలేదని ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి సీఎం జగన్మోహన్రెడ్డికి నివేదిక అందించారన్నారు. దాంతో సీఎం ఆదేశాల మేరకు గ్రామస్థులతో సమావేశం నిర్వహించామన్నారు. భూసేకరణ డ్రాఫ్ట్ డిక్లరేషన్ వరకు వచ్చిందని.. త్వరలో రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. ఆర్అండ్ఆర్ ప్రక్రియ కూడా త్వరితంగా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని భూ సమస్యలను ప్రజలు, రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. త్వరలో గ్రామసభ నిర్వహించి.. సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చారు.
సోమశిల జలాశయం సందర్శన
అనంతసాగరం : కలెక్టర్ హరినారాయణన్ శుక్రవారం సోమశిల జలాశయాన్ని సందర్శించారు. తొలుత శంకరనగరంలోని కొమ్మలేరు వాగును పరిశీలించారు. నిర్మాణ పనుల్లో పొలాలు నష్టపోయి.. పరిహారం అందక ఇబ్బంది పడుతున్న రైతులతో మాట్లాడారు. స్థానిక అధికారులతో చర్చించారు. పూర్తి నివేదికను తయారు చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సోమశిల జలాశయం నీటి నిల్వను తిలకించారు. డెల్టా, నాన్ డెల్టాకు విడుదల చేసే నీటి వివరాలను ప్రాజెక్టు ఈఈ దశరథరామిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆగిపోయిన ఆఫ్రాన్ పనులపై ఆరా తీశారు. ఉత్తర, దక్షిణ కాలువలకు విడుదల విడుదల చేసే సాగునీటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగేలా సిబ్బందిని పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కూర్మనాథ్, ఆర్డీవో కరుణకుమారి, ఇన్ఛార్జి తహసీల్దారు ప్రదీప్, ప్రాజెక్టు డీఈఈ, జేఈఈలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్ నియంత్రణ అవసరం
[ 28-03-2024]
విద్యుత్ నియంత్రణ అవసరమని కొండాపురం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఎస్కే ఖాదర్ బాషా తెలిపారు. -
పొగాకు బ్యారెన్లు దగ్ధం
[ 28-03-2024]
కొండాపురం మండలంలో ఆదిమూర్తిపురం గ్రామంలో ప్రమాదవశాత్తు 4 పొగకు బ్యారెన్లు దగ్ధమైన సంఘటన గురువారం జరిగింది. -
నాయకుల రాజీనామా
[ 28-03-2024]
కావలి టౌన్ 29వ వార్డ్ తెదేపాకు చెందిన యువనేత నరేంద్ర, మాజీ కౌన్సిలర్ శెట్టిపల్లి మధు పార్టీకి రాజీనామా చేశారు. -
ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే
[ 28-03-2024]
కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రచారం ప్రారంభించారు. -
29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
[ 28-03-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే
[ 28-03-2024]
ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే -
అధనం.. నీదే భారం!
[ 28-03-2024]
ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. -
తెరచుకోని పాఠం
[ 28-03-2024]
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు -
ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు
[ 28-03-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. -
ఓటరన్నా.. మేలుకో!
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. -
జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం
[ 28-03-2024]
-
కన్నీటి శృతి
[ 28-03-2024]
తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. -
గొంతుకోసి మహిళ హత్య
[ 28-03-2024]
మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు