logo

రైలు కిందపడి మహిళ మృతి

ఉలవపాడు రైల్వే స్టేషన్‌లో ఎగువ లైన్‌లో సాయంత్రం ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్‌ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందింది.

Published : 03 Jun 2023 02:08 IST

ఉలవపాడు, న్యూస్‌టుడే: ఉలవపాడు రైల్వే స్టేషన్‌లో ఎగువ లైన్‌లో సాయంత్రం ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్‌ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉలవపాడు పండు మార్కెట్లో చిరు వ్యాపారులు మామిడి కాయలు కొనుగోలు చేసి రోజూ గూడూరు-విజయవాడ రైలుకు ఒంగోలు నుంచి బాపట్ల వరకు ప్రయాణిస్తుంటారు. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ఉలవపాడు పండు మార్కెట్లో మామిడి కాయలు కొనుగోలు చేసిన చిరువ్యాపారులు ట్రేలలో కాయలను రైల్వేస్టేషనుకు తరలించారు. విజయవాడ వెళ్లే రైలు 4గంటల 21నిమిషాలకు మూడు నాలుగు ప్లాట్‌ఫాంల మధ్యలైన్‌లో నిలిపారు. వ్యాపారులు ఒక్కసారిగా ట్రేలతో రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా చెన్నై వైపు వెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును గమనించని ఒక మహిళ రైలు కిందపడి ప్రాణాలొదిలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని