ఆగని తెల్లరాయి అక్రమ తవ్వకాలు
వరికుంటపాడు మండలం గువ్వాడి అటవీప్రాంతంలో ఇటీవల అక్రమార్కులు భారీ వాహనాలతో తెల్లరాయి తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారం సంబంధిత అటవీశాఖ అధికారులకు అందింది.
వరికుంటపాడు మండలం గువ్వాడి అటవీప్రాంతంలో ఇటీవల అక్రమార్కులు భారీ వాహనాలతో తెల్లరాయి తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారం సంబంధిత అటవీశాఖ అధికారులకు అందింది. దీంతో సంబంధిత అధికారులు ఆ ప్రదేశానికి వెళ్లగా అక్కడ అక్రమంగా తెల్లరాయి తవ్వుతున్నారు. దీంతో అక్కడి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆపై అటవీప్రాంతంలో అక్రమంగా తెల్లరాయి తీస్తున్నందుకు రూ. 5 లక్షలకు పైగా జరిమానా విధించారు.
న్యూస్టుడే, దుత్తలూరు: ఉదయగిరి నియోజకవర్గంలో తగిన పరిమాణంలో ఉన్న తెల్లరాయిని అక్రమంగా తవ్వి తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటన్నారు. అటవీ, ప్రభుత్వ, అసైన్మెంట్ భూములనే తేడా లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కూలీలతో రేయింబవళ్లు భారీ యంత్రాలతో గుంతలు తవ్వించి తెల్లరాయిని వెలికితీస్తున్నారు. ఆపై ఇతర రాష్ట్రాలకు తరలించి రూ. లక్షలు అర్జిస్తున్నారు. రాత్రికి రాత్రే లారీల ద్వారా జిల్లా హద్దులు దాటించి జేబులు నింపుకుంటున్నారు. ఈ అక్రమం వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి మండలాల్లోని వివిధ గ్రామాల్లో కొన్ని నెలలుగా సజావుగా సాగుతోంది.
* ఉదయగిరి, వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లోని బత్తినవారిపల్లి, గోళ్లవారిపల్లి, తక్కెళ్లపాడు, చాకలికొండ, గువ్వాడి, బోయమడుగుల, పాపంపల్లి, వెంకటంపేట, సోమలరేగడ తదితర గ్రామాల్లో ఈ తెల్లరాయి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
* నియోజకవర్గంలో మొత్తం 500 హెక్టార్లకుపైగా తెల్లరాయి నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. తెల్లరాయిలో మొదటి రకం గ్రేడ్ టన్ను రూ. 9 వేల వరకు పలుకుతోంది. ద్వితీయ గ్రేడ్ ధర రూ. 2 వేల వరకు పలుకుతోంది. దీంతో ఆయా మండలాలకు చెందిన కొందరు ఇతర మండలాలకు చెందిన తెల్లరాయి తరలింపునకు సంబంధించి అనుమతి కలిగిన వారితో కుమ్మక్కై పట్టపగలే కూలీలతో తెల్లరాయిని భూముల నుంచి వెలికితీస్తున్నారు. ఆపై దాన్ని రాత్రిళ్లు ఇతర ప్రదేశాలకు తరలించి రూ. లక్షలు ఆర్జిస్తున్నారు.
* అక్రమార్కులకు ప్రభుత్వ భూములే అడ్డాగా మారాయి. వాటిలో భారీ యంత్రాలతో గుంతలు తవ్వి తెల్లరాయి తవ్వకాలు జరుపుతుండటం విశేషం. ః ప్రతి వారం సుమారు ఐదు నుంచి పది లారీల వరకు తెల్లరాయి అక్రమ రవాణా జరుగుతున్నా అటవీశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ సిబ్బంది చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి వారం అక్రమార్కులు రూ. లక్షల్లో ప్రభుత్వ భూముల నుంచి ఆదాయం పొందుతున్నారు.
* తెల్లరాయి తవ్వకాలు, తరలింపునకు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇవేవీ అమలుకావటంలేదు. అధికారులు స్పందించి తెల్లరాయి తవ్వకాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అటవీ భూముల్లో తెల్లరాయి తరలింపునకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని ఉదయగిరి రేంజి అధికారిఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. ఎవరైనా అటవీ భూముల్లో తెల్లరాయి తవ్వకాలు జరిపినట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ భూములపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
దుత్తలూరు మండలం పాపంపల్లి ప్రభుత్వ భూముల్లో తెల్లరాయిని ఇష్టానుసారం తవ్వి తరలిస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ భూముల్లో కొన్ని నెలలుగా తవ్వకాలు జరుపుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే
[ 28-03-2024]
కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రచారం ప్రారంభించారు. -
29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
[ 28-03-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే
[ 28-03-2024]
ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే -
అధనం.. నీదే భారం!
[ 28-03-2024]
ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. -
తెరచుకోని పాఠం
[ 28-03-2024]
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు -
ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు
[ 28-03-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. -
ఓటరన్నా.. మేలుకో!
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. -
జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం
[ 28-03-2024]
-
కన్నీటి శృతి
[ 28-03-2024]
తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. -
గొంతుకోసి మహిళ హత్య
[ 28-03-2024]
మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ