సజావుగా ఉపాధి పనులు: పీడీ
ప్రస్తుత వేసవిలో గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ వెంకట్రావు సూచించారు.
వివరాలు తెలుసుకుంటున్న డ్వామా పీడీ వెంకట్రావు
జలదంకి, న్యూస్టుడే: ప్రస్తుత వేసవిలో గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ వెంకట్రావు సూచించారు. గత ఏడాది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రూ 7 లక్షల నగదు హెచ్చించి చామదల గ్రామ పంచాయతీలోని ఆదిరెడ్డి పాలెం గిరిజన కాలనీ లోతట్టు ప్రాంతంలో గ్రావెల్ మట్టితో మెరక తోలి చదును పనులు చేశారు. ఏడాది గడిచినా పనులకు నేటికీ బిల్లులు రాలేదని గ్రామ సర్పంచి పి.సీతారామమ్మ, ఎంపీటీసీ పి.అమరావతి స్పందన కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. జిల్లా అధికారుల సూచనల మేరకు శుక్రవారం డ్వామా పీడీ వెంకట్రావు, ఎంపీడీవో శ్రీధర్బాబుతో కలిసి ఆదిరెడ్డిపాలెం గిరిజన కాలనీలో చేపట్టిన పనులను పరిశీలించారు. గ్రామ సర్పంచి, ఎంపీటీసీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీడీ మాట్లాడుతూ సమస్యను జిల్లా కలెక్టర్కు తెలిపి త్వరితగతిన బిల్లులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక గిరిజనులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, ఇళ్లు నిర్మించుకోలేనివారు గుత్తేదారుల ద్వారా గృహాలు నిర్మింపజేయాలని ఎంపీడీవోకు సూచించారు. ఏపీవో శ్యామల, టీఏ రంగారెడ్డి, పి.రవిచంద్ర పాల్గొన్నారు.
యువకుడిని కాపాడిన మెరైన్ పోలీసులు
ఉలవపాడు, న్యూస్టుడే: సముద్రంలో మునిగిపోతున్న యువకుడిని మెరైన్ పోలీసులు శుక్రవారం కాపాడారు. సీఐ కిషోర్కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరులోని కోటమిట్ట ప్రాంతానికి చెందిన 17ఏళ్ల పటాన్పిల్ కుటుంబసభ్యులతో కలిసి గురువారం రాత్రి తెట్టు ఉత్సవానికి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం సముద్రంలో స్నానాలు చేసేందుకు రామాయపట్నం తీరానికి చేరారు. పటాన్పిల్కు పిట్స్ రావడంతో సముద్రంలో మునిగిపోతుండగా గమనించిన మెరైన్ పోలీసులు కాపాడారు. యువకుడికి స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. క్షేమంగా ఇంటికి పంపించారు.
నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలి
నెల్లూరు(విద్య), న్యూస్టుడే: విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన సరఫరా అందించేందుకు సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్ఈ వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్తు కోతలు విధించడం లేదని, సాంకేతిక సమస్యలతో అంతరాయం ఏర్పడుతోందన్నారు. అధిగమించేందుకు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈదురుగాలులు, వర్షం కారణంగా సాంకేతిక లోపాలు తలెత్తితే సిబ్బంది త్వరితగతిన చర్యలు తీసుకొని సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. డీటీఆర్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. జగనన్న కాలనీలకు విద్యుత్తు అందించాలని, గడపగడపకు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎనర్జీ ఆడిట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు బెనర్జీ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
[ 19-04-2024]
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
పసుపులేటి గూటికి వైకాపా కీలక నేత
[ 19-04-2024]
కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. -
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు