ఠారెత్తిస్తున్న ఎండలు
తీవ్రమైన ఎండలు జిల్లా వాసులను ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 30 నుంచి 31 డిగ్రీలు నమోదవుతుండటంతో రాత్రిళ్లూ వాతావరణం చల్లబడటం లేదు.
38 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదు
ఎండ తాకిడికి బోసిపోయిన వేదాయపాళెం రోడ్డు
ఈనాడు డిజిటల్, నెల్లూరు: తీవ్రమైన ఎండలు జిల్లా వాసులను ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 30 నుంచి 31 డిగ్రీలు నమోదవుతుండటంతో రాత్రిళ్లూ వాతావరణం చల్లబడటం లేదు. సాయంత్రం ఆరు గంటల సమయంలోనూ చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోంది. శనివారం జిల్లాలోని 38 మండలాల్లో.. 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా రాపూరు మండలం వేపినాపి అక్కమాంబపురంలో అత్యధికంగా 43.8 డిగ్రీలు నమోదైంది. కలిగిరిలో 42.6, మనుబోలు మండలం కట్టువపల్లెలో 42.5, జలదంకి 42.2, వెంకటాచలం మండలం కసుమూరులో 42, బ్రహ్మదేవిలో 42 డిగ్రీలుగా ఉంది. అత్యల్పంగా అల్లూరు మండలంలో 40 డిగ్రీలుంది. దీంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. అధిక లోడుతో విద్యుత్తు నియంత్రికలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ప్రారంభం కావడంతో పాటు.. వడగాడ్పులు ఉండటంతో పిల్లలు,మహిళలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిర్జలీకరణ(డిహైడ్రేషన్)తో ఆసుపత్రులకు వెళుతున్న చిన్నారుల సంఖ్య పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు ప్రజాగళం నేడే
[ 29-03-2024]
న్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. కావలి పట్టణంతో పాటు.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో రోడ్షో, సభల్లో పాల్గొననున్నారు. -
ఘోరప్రమాదం.. పెళ్లింట విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి.. బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడ్డారు. కుమారుడు, బంధువులతో కలిసి పెళ్లి వేడుక జ్ఞాపకాలతో ఆనందంగా కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. -
చెరువులను చెరబట్టారు!
[ 29-03-2024]
నగర, పట్టణ ప్రాంతాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకుల ధోరణితో గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువులతో రూ. కోట్లలో స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. -
వైకాపాకు మద్దతుగా వాట్సాప్లో స్టేటస్
[ 29-03-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వాలంటీరుపై వేటు పడింది. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన శ్రీనివాసులు వాలంటీరుగా పని చేస్తున్నారు. తన చరవాణిలో వైకాపాకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టారు. -
ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే చర్యలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హరినారాయణన్ హెచ్చరించారు. -
బాలలకేదీ సురక్ష..?
[ 29-03-2024]
పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు. -
వైకాపా సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు
[ 29-03-2024]
కందుకూరు వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గురువారం ఉలవపాడు మండలం చాగొల్లులో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ఆహ్లాదం.. హామీలకే పరిమితం
[ 29-03-2024]
ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి