ఆరిన కంటి పాపలు
వారు నిరుపేదలు.. తమ కష్టాలు పిల్లలకు రావొద్దని వారిని కష్టపడి చదివిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటున్నారు.
చిన్నారి మృతదేహం వద్ద మంత్రి కాకాణి, విలపిస్తున్న కుటుంబ సభ్యులు
వెంకటాచలం, న్యూస్టుడే : వారు నిరుపేదలు.. తమ కష్టాలు పిల్లలకు రావొద్దని వారిని కష్టపడి చదివిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటున్నారు. తల్లికి పనిలో తోడుగా దుస్తులు ఉతికేందుకు సమీపంలోని కాలువ వద్దకెళ్లారు. ఒక్కసారిగా అదుపుతప్పి పడి పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న హృదయ విదారక ఘటన వెంకటాచలం మండలం చింతలపాలెంలో శనివారం జరిగింది.. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కసుమూరు పంచాయతీ చింతలపాలెంనకు చెందిన కడివేటి పెంచలరత్నం, భవాని దంపతుల కుమార్తె లక్కీషా(13), శేషం అంకయ్య, నాగమణిల కుమార్తె అక్షిత(12) శనివారం ఉదయం దుస్తులు ఉతికేందుకు కాలనీలోని కొందరితో కలిసి గ్రామ సమీపంలోని కనుపూరు కాలువ వద్దకెళ్లారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోవడంతో ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తుంది. ఇద్దరు చిన్నారులు అదుపుతప్పి పడిపోయి కొంత దూరం ప్రవాహంలో కొట్టుకెళ్లి ఈత రాక మునిగి పోయారు. అక్కడున్న వారు పెద్దగా కేకలు వేయడంతో గ్రామస్థులు హుటాహుటిన వచ్చి కాలువలో గాలించి చిన్నారులను బయటకు తీశారు. వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి చిన్నారులు మృతిచెందినట్లు చెప్పారు. లక్కీషా కసుమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా, అక్షిత నెల్లూరులోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. కడివేటి పెంచల రత్నంనకు లక్కీషా ఒకే కుమార్తె కాగా, శేషం అంకయ్యకు ముగ్గురు కుమార్తెల్లో అక్షిత రెండో కుమార్తె. సమాచారం తెలుసుకున్న వెంకటాచలం సీఐ గంగాధర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చింతలపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలను మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పరామర్శించారు. వారిని ఓదార్చి అండగా ఉంటామన్నారు.
బావిలో ఈత కొడుతూ..
నాగులవరం(బిట్రగుంట) : బోగోలు మండలంలోని నాగులవరానికి చెందిన రేగలగడ్డ తిరుపాలు (45) శనివారం గ్రామ సమీపంలోని బావిలో ఈత కొడుతూ మృత్యువాత పడ్డారు. వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి బావిలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. కావలి గ్రామీణ సీఐ రాజేష్, బిట్రగుంట ఎస్సై ఆదిలక్ష్మి సంఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలికి తరలిస్తున్నామని సీఐ రాజేష్ తెలిపారు. బిట్రగుంట ఎస్సై ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.