గుప్తనిధులకొచ్చి.. శవమై తేలి
ఉదయగిరి దుర్గం కొండపై గుప్త నిధుల తవ్వకాల కోసం ముఠాతో కలిసి వెళ్లిన ప్రకాశం జిల్లాకు చెందిన ఒక యువకుడు మృత్యువాత పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.
ప్రకాశం జిల్లా యువకుడి మృతి
మృతదేహాన్ని మూటగట్టి పడేశారు
ఉదయగిరి దుర్గంపై దుర్ఘటన
ఉప్పు శ్రీను (పాత చిత్రం)
ఉదయగిరి, న్యూస్టుడే : ఉదయగిరి దుర్గం కొండపై గుప్త నిధుల తవ్వకాల కోసం ముఠాతో కలిసి వెళ్లిన ప్రకాశం జిల్లాకు చెందిన ఒక యువకుడు మృత్యువాత పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం మేరకు గత నెల 31వ తేదీన ఉదయగిరి దుర్గం కొండపై చిన్న మసీదు ప్రాంతంలో గుప్తనిధుల కోసం ఒక ముఠా తవ్వకాలు చేపట్టింది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామానికి చెందిన ఉప్పు శ్రీను(35) అనే యువకుడు మరి కొందరు కలిసి తవ్వకాల్లో భాగంగా బ్లాస్టింగ్ చేశారు. ఈ సమయంలో ఉప్పుశ్రీను పేలుడు ప్రాంతానికి సమీపంలో ఉండటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో ముఠా సభ్యులు శ్రీను మృతదేహాన్ని మూటకట్టి గుట్టుచప్పుడు కాకుండా ఈనెల ఒకటో తేదీ అర్ధరాత్రి కారులో మృతుడు స్వగ్రామమైన ముటుకులకు తీసుకెళ్లారు. అతని ఇంటి ముందు శవాన్ని పడేసి కారును వేగంగా వెనక్కి మళ్లించుకొని పారిపోయారు. మృతదేహాన్ని ఇంటి వద్ద పడేసి కారు వేగంగా వెళుతున్న విషయాన్ని అదే వీధిలో నిద్రిస్తున్న కొందరు గమనించారు. మూట ఏమిటని తెరచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. ఇంటి యజమాని లింగాలును నిద్రలేపి చూపగా తన కుమారుడు శ్రీనుగా ఆయన గుర్తించారు. మూటతోపాటు అందులో రూ. 35 వేలు నగదు, లేఖ ఉంది. ఆ లేఖలో ‘మీ పిల్లాడిని మావద్దకు పనికి పంపారు. పని చేసే క్రమంలో ప్రమాదవశాత్తు మీ కుమారుడు చనిపోయాడు. మాకు కూడా గాయాలయ్యాయి. మట్టి ఖర్చుల కోసం రూ. 35 వేలు ఇస్తున్నాం. పిల్లల బాధ్యతను కూడా ఎంతో కొంత మేం తీసుకుంటాం’. అని లేఖలో ఉన్నట్లు తెలిసింది. పని కోసమని వెళ్లిన శ్రీను శవంగా రావటం... అసలు అతను ఎలా చనిపోయారన్న విషయం తెలియకపోవటం, మూటలో మృతదేహాన్ని కట్టి ఇంటి వద్దకు తెచ్చి ఎవరు పడేశారన్నది అంతుచిక్కటంలేదు. దీనికితోడు ఇది హత్యా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం సైతం తెలియటంలేదు. శ్రీను మృతి విషయం సంచలనంగా మారటంతో పుల్లలచెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శ్రీను ఉదయగిరి కొండపై గుప్తనిధుల తవ్వకాలకు వెళ్లి మృతిచెందినట్లు తెలుసుకున్నారు. దీంతో ప్రకాశం జిల్లా పుల్లలచెరువు, పెద్దారవీడు ఎస్సైలు సిబ్బందితో కలిసి ఉదయగిరికి చేరుకున్నారు. ఉదయగిరి సీఐ వి.గిరిబాబు సహకారంతో ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ముఠాలో ఎవరున్నారే విషయాలపై ముమ్మర విచారణ చేపట్టారు. ఉదయగిరి దుర్గంపై చిన్న మసీదు ప్రాంతానికి ఆదివారం పోలీసుల బృందం వెళ్లనున్నదని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
పేదలకు ఆకలి తీరుస్తున్న ఆదర్శ దంపతులు
[ 29-03-2024]
నెల్లూరు పట్టణవాసులు, సంయుక్త సేవా సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు, లలిత దంపతులు తమ కుమారుడు జై సాయిరామ్ జ్ఞాపకార్థం పేదల ఆకలిని తీరుస్తు్న్నారు. -
తెదేపాతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి
[ 29-03-2024]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం జరిగింది. -
చంద్రబాబు ప్రజాగళం నేడే
[ 29-03-2024]
న్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. కావలి పట్టణంతో పాటు.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో రోడ్షో, సభల్లో పాల్గొననున్నారు. -
ఘోరప్రమాదం.. పెళ్లింట విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి.. బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడ్డారు. కుమారుడు, బంధువులతో కలిసి పెళ్లి వేడుక జ్ఞాపకాలతో ఆనందంగా కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. -
చెరువులను చెరబట్టారు!
[ 29-03-2024]
నగర, పట్టణ ప్రాంతాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకుల ధోరణితో గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువులతో రూ. కోట్లలో స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. -
వైకాపాకు మద్దతుగా వాట్సాప్లో స్టేటస్
[ 29-03-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వాలంటీరుపై వేటు పడింది. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన శ్రీనివాసులు వాలంటీరుగా పని చేస్తున్నారు. తన చరవాణిలో వైకాపాకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టారు. -
ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే చర్యలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హరినారాయణన్ హెచ్చరించారు. -
బాలలకేదీ సురక్ష..?
[ 29-03-2024]
పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు. -
వైకాపా సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు
[ 29-03-2024]
కందుకూరు వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గురువారం ఉలవపాడు మండలం చాగొల్లులో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ఆహ్లాదం.. హామీలకే పరిమితం
[ 29-03-2024]
ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?