ఇష్టపడి సాధన చేసి.. ఆటల్లో మెరిసి
వారు పేదింటి విద్యార్థులు. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. అరకొర వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ప్రదర్శనలు చేస్తున్నారు.
జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం
న్యూస్టుడే, కందుకూరు పట్టణం : వారు పేదింటి విద్యార్థులు. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. అరకొర వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ప్రదర్శనలు చేస్తున్నారు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తమ జీవిత లక్ష్యాలు సాధించే దిశగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి ప్రస్తుతం రాష్ట్ర జట్టు తరఫున జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 8వ తేదీ నుంచి మధ్యప్రదేశ్లో జరగబోయే హ్యాండ్బాల్, హాకీ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు కందుకూరు పట్టణంలోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు. వీరికి పీడీ సుబ్బారావు శిక్షణ ఇస్తున్నారు. జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటాలని కళాశాల ప్రిన్సిపల్ కదిరి నాగేశ్వరరావు ఆకాంక్షించారు.
హ్యాండ్బాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటా
వేముల నరేంద్ర, మల్లంపేట ...ఉమ్మడి ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేటకు చెందిన అల్లూరయ్య, రమణమ్మ దంపతుల కుమారుడు వేముల నరేంద్ర. ప్రస్తుతం పట్టణంలోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. పాఠశాలలో స్నేహితుల పరిచయాలతో హ్యాండ్బాల్ క్రీడపై మక్కువ పెంచుకున్నాడు. టీఆర్ఆర్లో హ్యాండ్బాల్ బాలుర, బాలికల జట్లు రాష్ట్ర స్థాయిలో పోటీపడిన విషయం తెలుసుకున్నాడు. తను కూడా అందులో ఉన్నతస్థాయికి చేరుకోవాలని భావించి రెండేళ్ల క్రితం టీఆర్ఆర్లో చేరాడు. అప్పటినుంచి పీడీ టి.సుబ్బారావు ఆధ్వర్యంలో సాధన చేస్తూ నైపుణ్యం సాధించాడు. ఈఏడాది ఫిబ్రవరిలో అనంతపురం జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు తరఫున ప్రాతినిథయం వహించిన నరేంద్ర ఉత్తమ ప్రతిభ చూపడంతో రాష్ట్ర హ్యాండ్బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈమేరకు ఈనెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరగబోయే అండర్-19 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటేందుకు కసరత్తు చేస్తున్నాడు.
జాతీయ జట్టులో ఎంపికవ్వాలని..
లింగసముద్రం మండలంలోని మొగిలిచర్లకు చెందిన పడిదపు శ్రీను, వెంకటరమణమ్మ దంపతుల కుమార్తె నందిని. చిన్ననాటి నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలో 4వతరగతి చదివేటప్పుడు స్కూల్ గేమ్స్లో రాణించి కడప క్రీడా పాఠశాలకు ఎంపికై అక్కడే పదోతరగతి వరకు చదివింది. హాకీలో కఠోర సాధన చేసి నైపుణ్యం సాధించింది. టీఆర్ఆర్ కళాశాలలో చేరి మరింత సాధన చేసింది. గతేడాది కాకినాడలో జరిగిన జూనియర్స్ విభాగం జాతీయ పోటీల్లో రాష్ట్ర జట్టుకు గోల్కీపర్గా రాణించింది. 2022-23 అండర్-19 స్కూల్ గేమ్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున ఆడి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గోల్కీపర్గా పురస్కారం అందుకుంది. రాష్ట్ర జట్టుకు ఎంపికై త్వరలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతోంది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో రాణించి జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్నది తన లక్ష్యమని ఈమె చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెంచులక్ష్మీపురంలో ఇంటింటి ప్రచారం
[ 24-04-2024]
కావలి నియోజకవర్గంలోని బోగోలులో రైల్వే ప్రాజెక్టును తీసుకువచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు -
తెదేపాలో చేరిక
[ 24-04-2024]
బోగోలు మండలం విశ్వనాధరావుపేట పంచాయతీ 6వ వార్డు వైకాపా నేత సుధీర్, ఎం. జయకుమార్ తెదేపాలో చేరారు. -
మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా అభ్యర్థి
[ 24-04-2024]
అల్లూరు మండలంలో తెదేపా అభ్యర్థి కావ్యక్రిష్టారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
[ 24-04-2024]
కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.