ధర ధగధగ.. దళారుల దగా
జిల్లాలో బత్తాయి సాగుదారులు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. బత్తాయి కాయలకు ధర ఆశించినంతగా ఉన్నా దిగుబడులు తక్కువగా ఉన్నాయి. ఇదే సందర్భంలో దళారులు రైతుల అవసరాలను సొమ్ముచేసుకుంటున్నారు.
బత్తాయి సాగుదారులకు కష్టం
సాగులోని బత్తాయి తోట
జిల్లాలో బత్తాయి సాగుదారులు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. బత్తాయి కాయలకు ధర ఆశించినంతగా ఉన్నా దిగుబడులు తక్కువగా ఉన్నాయి. ఇదే సందర్భంలో దళారులు రైతుల అవసరాలను సొమ్ముచేసుకుంటున్నారు. ధరలను తగ్గించి కొనుగోలు చేస్తూ అన్నదాతలను నష్టపరుస్తున్నారు. ఉదయగిరి, కనిగిరి ప్రాంతాల్లో అధికంగా బత్తాయి తోటలు సాగులో ఉన్నాయి. ప్రధాన మార్కెట్ నెల్లూరులో మాత్రమే ఉంది. అయినా కొందరు రైతులు గిట్టుబాటు ధర లభించలేదంటూ హైదరాబాదు, నాగపూర్, ముంబయి, దిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
న్యూస్టుడే, వరికుంటపాడు : ఆరుగాలం కష్టించి, లక్షలు పెట్టుబడిగా పెట్టి సాగు చేసిన బత్తాయి పంట దిగుబడి వచ్చిన తరువాత విక్రయించేందుకు జిల్లాలో సరైన మార్కెట్ సౌకర్యం లేదు. ప్రస్తుతం టన్ను బత్తాయి కాయల ధర రూ. 50వేల వరకు పలుకుతోంది. అయినా దళారులు తోటలవద్దకు వచ్చి కాయ నాణ్యతలేదని, మచ్చ ఉందని, మంగు సోకిందంటూ టన్నుకు రూ. 15 నుంచి రూ. 20 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్టుబడులు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
* నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 40 వేల ఎకరాల్లో బత్తాయిలో తోటలు విస్తరించి ఉన్నాయి. వరికుంటపాడు మండలంలో మూడు వేల ఎకరాల్లో తోటలు ఉన్నాయి. గతంలో వర్షాభావంతో తోటలు నిలువునా ఎండిపోయాయి. అప్పట్లో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో సాగు క్రమంగా తగ్గింది. ఈ మధ్య మళ్లీ పుంజుకుంటోంది.
* ఈ పంట ఏడాదిలో రెండు దఫాలుగా దిగుబడి ఇస్తోంది. వేసవిలో బత్తాయి కాయల వినియోగం ఎక్కువ. దీంతో ధర కూడా ఆశించిన రీతిలో ఉంటోంది. దిగుబడి తక్కువగా ఉంటోంది. వర్షాకాలంలో దిగుబడి ఎక్కువగా ఉన్నా ధర మాత్రం ఆశించినంతగా ఉండటంలేదు.
గిట్టుబాటు ధర కల్పించాలి
ఎకరా బత్తాయి తోట సాగుకు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చవుతుంది. వర్షాకాలంలో దిగుబడి 5 టన్నులు వరకు … వచ్చింది. వేసవిలో మాత్రం ఒకటిన్నర టన్నులు మాత్రమే వచ్చింది. ప్రభుత్వం ఇతర పంటల వలే బత్తాయికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. కాయలను నిల్వ ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి.
మల్లంపాటి కొండలరావు, రైతు
గిడ్డంగులు ఏవీ
వినియోగం తక్కువగా ఉన్న సమయంలో వచ్చిన పంటను నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. రవాణా సౌకర్యం కూడా కల్పిస్తే మేలు. దళారీ వ్యవస్థను నిర్మూలించి గిట్టుబాటు ధర కల్పించాలి. వేసవికాలంలో చెట్లను కాపాడుకోవడం కష్టంగా ఉంది. గొట్టపు బావులు వట్టిపోవడంతో ట్యాంకర్లతో నీటిని అందించి చెట్లను కాపాడుకుంటున్నాం.
మల్లంపాటి సుదర్శన్, రైతు
స్టోరేజీ సౌకర్యం కల్పించలేం
షహిల్, ఉద్యానాధికారి : బత్తాయికి స్టోరేజీ సౌకర్యం కల్పించలేని పరిస్థితి. నిల్వ ఉంచుకుని అమ్ముకుంటే రైతుకు నష్టం అధికమవుతుంది. వీటికి ఇతర పంటల వలే మద్దతు ధర కూడా కల్పించడం సాధ్యంకాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?