వచ్చింది ఇవ్వరు.. ఇచ్చింది వదలరు
స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం- వాటికి స్థానికంగా సమకూరే ఆదాయ వనరులకూ గండి కొడుతోంది.
టీడీ నిధులకు స్థానిక సంస్థల ఎదురు చూపు
కందుకూరు పట్టణం, న్యూస్టుడే
నెల్లూరులోని రిజిస్ట్రేషన్ కార్యాలయం
స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం- వాటికి స్థానికంగా సమకూరే ఆదాయ వనరులకూ గండి కొడుతోంది. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్శాఖ నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు సుమారు ఏడాదిగా రాకపోవడమే అందుకు నిదర్శనం. రిజిస్ట్రేషన్ అయ్యాక.. ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద 1.5 శాతం రిజిస్ట్రేషన్ శాఖ నుంచి చెల్లించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఆదాయ వనరుల్లో ఇది కీలకం. ఏడాదిగా నిధులు రాకపోవడంతో మౌలిక వసతుల కల్పనకు అవి ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది.
టీడీతో ఆదాయం
భూముల క్రయ విక్రయాలు గత కొన్నేళ్లుగా అధికమయ్యాయి. ఆ క్రమంలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు.. ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం అందులో 7.5 శాతం (ఫీజు) చలానా చెల్లించాలి. ఇందులో 5 శాతం స్టాంప్ డ్యూటీ కింద ప్రభుత్వానికి వెళుతుంది. 1.5 శాతం స్థానిక సంస్థలకు ట్రాన్స్ఫర్ డ్యూటీ(టీడీ) కింద వెళితే.. 1 శాతం రిజిస్ట్రేషన్ ఫీజుగా ఉంటుంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు టీడీ 1.5 శాతం మొత్తం ఆయా సంస్థలకే వెళుతుండగా.. పంచాయతీలకు వెళ్లే 1.5 శాతంలో జడ్పీకి 20, మండల పరిషత్తుకు 20, గ్రామ పంచాయతీలకు 60 శాతం చొప్పున వెళుతుంది.
బదిలీ కాని నగదు
దస్తావేజుల రిజిస్ట్రేషన్కు చెల్లించే రుసుం నేరుగా సీఎఫ్ఎంఎస్ ఖాతాకు జమవుతాయి. అందులో ట్రాన్స్ఫర్ డ్యూటీని వెంటనే స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి. సుమారు ఏడాదిగా బదిలీ చేయడం లేదు. సీఎఫ్ఎంఎస్లో నెలకొన్న సాంకేతిక కారణాలతో బదిలీ చేయడం లేదని.. కొద్ది రోజుల కిందట చేశామని అధికారులు చెబుతున్నా.. జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలకు రూపాయి కూడా జమ కాలేదు. కందుకూరు మున్సిపాలిటీకి 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 1.4 కోట్లు రావాల్సి ఉండగా- కావలి మున్సిపాలిటీకి రూ. 6.95 కోట్ల బకాయి ఉంది. కందుకూరు, గుడ్లూరు మండల పరిషత్తులకు 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు జమ కాలేదు. జిల్లాలో స్థానిక సంస్థలకు దాదాపు రూ. 40 కోట్ల వరకు టీడీ రావాల్సి ఉందని సమాచారం.
నిధుల లేమితో సతమతం
సాధారణంగా నెలకో, రెండు నెలలకో సబ్ రిజిస్ట్రార్లు టీడీని బదిలీ చేస్తారు. ఏడాదిగా జమ కాకపోవడంతో స్థానిక సంస్థలకు నిధుల కొరత ఏర్పడింది. టీడీ నగదు జనరల్ ఫండ్గా ఉంటుంది కాబట్టి.. మున్సిపాలిటీల్లో ఏ అవసరాలకైనా వినియోగించుకోవచ్చు. కందుకూరు, కావలి మున్సిపాలిటీల్లో అనేక చోట్ల అంతర్గత రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. మౌలిక వసతుల పరంగా ప్రజలు అర్జీలు ఇచ్చినా నిధుల లేమితో పరిష్కారం చూపించలేకపోతున్నట్లు అధికారులు చెబుతుండగా- ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు సొమ్ములు కనీసం ఎప్పుడు జమ అవుతాయో కూడా తెలియని పరిస్థితుల్లో స్థానిక సంస్థల అధికారులు ఉండగా.. రిజిస్ట్రేషన్ శాఖ మాత్రం మరో విధంగా చెబుతుండటం గమనార్హం.
కందుకూరులో అధ్వానంగా గుండంకట్ట రోడ్డు
ఏడాదిగా రాలేదు...
ఎస్.మనోహర్, మున్సిపల్ కమిషనర్, కందుకూరు
కందుకూరు మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్శాఖ ద్వారా రావాల్సిన టీడీ నిధులు ఏడాదిగా రాలేదు. ఏటా రూ. కోటికిపైగా వచ్చేవి. వాటిని ప్రజోపయోగ అవసరాలకు వినియోగించేవాళ్లం.
నిధులు జమ చేశాం
బాలాంజనేయులు, జిల్లా రిజిస్ట్రార్
దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన 1.5 శాతం టీడీ నిధులు జమ చేసేందుకు గతంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వాటిని పరిష్కరించుకుని నెల రోజుల కిందటే జిల్లా మొత్తం పంపించాము.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకటేశ్వరలో టీవీఎస్ ప్రాంగణ ఎంపికలు
[ 25-04-2024]
కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో 21 మంది ఎంపికయ్యారని కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. -
చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి
[ 25-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి, మంచి రోజులు రానున్నాయని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. -
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM