కదిలిన నైజీరియన్ కొకైన్ లింకు
నైజీరియన్ నెట్వర్క్తో రాజధానిలో నడిపిస్తున్న కొకైన్ మాఫియా డొంక కదులుతోంది. ఈ ఏడాది మే తొలివారంలో మాదాపూర్ ఎస్వోటీ, రాయదుర్గం పోలీసులకు చిక్కిన ముఠాతో లింకులున్న మరో ఐదుగురు గురువారం అరెస్టయ్యారు.
గతంలో ఈ ముఠాలోని నలుగురి అరెస్టు
తాజాగా.. వీరి నుంచి డ్రగ్స్ కొన్న మరో ఐదుగురు
ఈనాడు, హైదరాబాద్: నైజీరియన్ నెట్వర్క్తో రాజధానిలో నడిపిస్తున్న కొకైన్ మాఫియా డొంక కదులుతోంది. ఈ ఏడాది మే తొలివారంలో మాదాపూర్ ఎస్వోటీ, రాయదుర్గం పోలీసులకు చిక్కిన ముఠాతో లింకులున్న మరో ఐదుగురు గురువారం అరెస్టయ్యారు. గచ్చిబౌలిలోని ఇన్ఫినిటీ డ్రైవ్ ఇన్ యజమాని వెలగపూడి రఘుతేజ, బాలకృష్ణ, రతన్, మహదేవ్ కృష్ణ, సంస్కృత్లను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.
ఈ ఏడాది మే 6న నైజీరియన్లతో సంబంధాలున్న కొకైన్ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి వారినుంచి రూ.1.33 కోట్ల విలువైన 303 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన చింత రాకేశ్ రోషన్, గజ్జల శ్రీనివాస్రెడ్డి నుంచి తాజాగా అరెస్టయిన ఐదుగురు గతంలో కొకైన్ కొనుగోలు చేసి వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మాదకద్రవ్యాలు వినియోగం కింద కేసు నమోదు చేశారు.
ఈ ముగ్గురిదీ చీకటి దందా..!
ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన చింత రాకేశ్ రోషన్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాడు. ఒకసారి గోవాలో వేడుకలో పాల్గొన్న అతడు కొకైన్ తీసుకున్నాడు. క్రమంగా దానికి బానిసయ్యాడు. గోవాలో ఉండే నైజీరియన్, డ్రగ్ నెట్వర్క్ కింగ్పిన్ పెటిట్ ఎబుజర్ అలియాస్ గాబ్రియెల్ నుంచి కొకైన్ కొనుగోలు చేసి హైదరాబాద్కు కార్లు, బస్సుల్లో తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువధరకు విక్రయించేవాడు. ఈ క్రమంలోనే రాకేశ్కు.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన గజ్జల శ్రీనివాస్రెడ్డి(38) పరిచయమయ్యాడు. అప్పటికే హోటల్ వ్యాపారంలో నష్టపోయిన శ్రీనివాస్కు డ్రగ్స్ తీసుకునే అలవాటుంది. రాకేశ్ ప్రోద్బలంతో శ్రీనివాస్ కూడా కొకైన్ విక్రయించేవాడు. వీరిద్దరూ కలిసి స్విగ్గీ డెలివరీబాయ్, మణికొండలో నివాసముండే ఏపీలోని కాకినాడకు చెందిన శ్రీరంగం సూర్యప్రకాశ్ అలియాస్ డేవిడ్(26)ను కమీషన్ ఆశచూపి దందాలోకి దింపారు.
పట్టించిన ఫోన్ డేటా..!
ఐదేళ్లుగా నిందితులు నగరంలో కొకైన్ను విక్రయిస్తున్నారు. పూర్తిగా వాట్సప్ సంభాషణలు, కాల్స్ ద్వారా అవసరమున్న వారిని సంప్రదించి అమ్మేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా పార్టీలు నిర్వహించేవారు. మే 6న రాకేశ్, శ్రీనివాస్రెడ్డి, సూర్యప్రకాశ్, నైజీరియన్ విక్టర్ను అరెస్టు చేశారు. నిందితుల ఫోన్లలోని వాట్సప్ కాల్డేటా, చాటింగ్ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ ఐదుగురు వీరి వద్దే కొకైన్ కొనుగోలు చేసినట్లు నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప