నిధులిచ్చారు.. ఇందూరు మదిలో నిలిచారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి జిల్లాలో పలువురు సంతాపం ప్రకటించారు. ఏడాది పాటు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగారు. మంత్రి హోదాలో పలుమార్లు జిల్లా పర్యటనకు వచ్చారు.
రోశయ్యకు జిల్లాతో విడదీయని అనుబంధం
2008లో కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రోశయ్యతో అప్పటి సభాపతి సురేశ్రెడ్డి,
వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి, తాహెర్ బిన్ హందాన్
న్యూస్టుడే, ఇందూరు సిటీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి జిల్లాలో పలువురు సంతాపం ప్రకటించారు. ఏడాది పాటు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగారు. మంత్రి హోదాలో పలుమార్లు జిల్లా పర్యటనకు వచ్చారు. 2008లో కమ్మర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో నిధులు మంజూరు చేసి ఆయనే స్వయంగా శంకుస్థాపన చేశారు.
* తెలంగాణ విశ్వవిద్యాలయం ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే మంజూరైంది. అప్పటి నాయకుల వినతుల మేరకు వర్సిటీ సకాలంలో పూర్తయ్యేలా నిధులు విడుదల చేశారు.
* నిజామాబాద్లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారితో ఆయనకు సత్సంబంధాలున్నాయి. పలుమార్లు ఆయన శుభకార్యాలు, వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆర్యవైశ్య పాఠశాల ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు.
* జుక్కల్, బాన్సువాడ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వచ్చారు.
కాంగ్రెస్కు తీరని లోటు
ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, అర్బన్ ఇన్ఛార్జి తాహెర్ బిన్, నగర అధ్యక్షుడు కేశ వేణు, రూరల్ ఇన్ఛార్జి భూపతి రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారని తెలిపారు.
డీఎస్ సంతాపం
నిజామాబాద్ నగరం: మాజీ సీఎం రోశయ్య మృతికి రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి మంత్రిగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఒక మంచి నాయకుణ్ని కోల్పోయినట్లు పేర్కొన్నారు.
అనుబంధం మరువలేనిది
- సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి
వైఎస్ హయాంలో ఇద్దరం సహచర మంత్రులం. వైఎస్ మరణాంతరం రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేశాను. నిబద్ధత కలిగిన వ్యక్తి. రాజకీయాలకతీతంగా అభివృద్ధి కోసం పనిచేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరు ఓ గొప్ప నేతను కోల్పోయారు.
సామాన్యుడిగానే ఉన్నారు
- మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
రోశయ్యతో నాకు చాలా దగ్గరి సంబంధాలున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. నిత్యం మేము కలిసి రాజకీయ అంశాలపై చర్చించేవాళ్లం. కలిసి భోజనాలు చేసేవాళ్లం. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా.. సామాన్య వ్యక్తిగానే ఉన్నారు. గొప్ప విలువలు కలిగిన నేతను కోల్పోవడం బాధగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
[ 23-04-2024]
జిల్లాలో రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈఓ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 23-04-2024]
ధర్మారెడ్డి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మన పార్లమెంటు మహోన్నతం
[ 23-04-2024]
దేశమంతా సార్వత్రిక ఎన్నికల సంగ్రామంతో హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఫలితమెలా ఉంటుందని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది -
పద..పార్టీ మారుదాం !
[ 23-04-2024]
రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కిందిస్థాయి క్రీయాశీలక కార్యకర్తల వరకు ఒక్కొక్కరు తమకు అనుకూలంగా ఉండే పార్టీల వైపు క్యూ కడుతున్నారు. -
ఓటరే లక్ష్యం.. అస్త్రాలు సిద్ధం
[ 23-04-2024]
పార్లమెంటు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉండే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు -
12 లో ఫెయిల్ జీవితంలో గెలుపు
[ 23-04-2024]
పది, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణతే మైలురాయి కాదు. విద్యాలయాలకు వెళ్లకపోయినా దూర విద్యలోనూ డిగ్రీలు సాధించి ఉన్నత స్థానాల్లో స్థిరపడినవారున్నారు. పరిమిత వనరుల్లోనూ ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
ఓటరు తీర్పు విభిన్నం..
[ 23-04-2024]
కామారెడ్డి జిల్లా ప్రజలకు జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలతో అనుబంధం ఉంది. ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు. -
వీడని వాన
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాను అకాల వర్షాలు వీడటం లేదు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వరుసగా కురుస్తున్న వానలు అన్నదాతలకు కునుకులేకుండా చేస్తున్నాయి. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. -
బోధన్ - మహబూబ్నగర్ ప్యాసింజర్ రద్దు
[ 23-04-2024]
నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి మహబూబ్నగర్ మధ్య నడిచే రైలును మే 16 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వు జారీ చేశారు -
2.30 లక్షల మె.ట.ధాన్యం కొనుగోలు
[ 23-04-2024]
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొదట 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 411 కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది -
కాంగ్రెస్ శ్రేణుల్లో హుషారు
[ 23-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన తొలి ఎన్నికల సభకు భారీగా జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా ఇతర నాయకులు తమ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM