స్వచ్ఛ లక్ష్యం.. మరెంతో దూరం
నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడిన పడలేదు. ప్రధాన రోడ్లకే పరిమితమవుతూ శివారు, అంతర్గత కాలనీలను పట్టించుకోవట్లేదు. అక్కడి నివాసాల మధ్య చెత్త కుప్పలు, ముళ్ల పొదలు, మురుగు గుంతలు ఏర్పడి దుర్వాసన వెలువడుతోంది.
నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడిన పడలేదు. ప్రధాన రోడ్లకే పరిమితమవుతూ శివారు, అంతర్గత కాలనీలను పట్టించుకోవట్లేదు. అక్కడి నివాసాల మధ్య చెత్త కుప్పలు, ముళ్ల పొదలు, మురుగు గుంతలు ఏర్పడి దుర్వాసన వెలువడుతోంది. పారిశుద్ధ్య ఫిర్యాదుల ఆధారంగా ‘న్యూస్టుడే’ శనివారం ఉదయం 5 నుంచి 9 గంటల వరకు చేసిన పరిశీలనలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
ఒకరి భారం మరొకరిపై..
బోధన్ బసవతారకనగర్ కాలనీలో పేరుకున్న ప్లాస్టిక్ వ్యర్థాలు
బోధన్ పట్టణం : నలుగురు చేయాల్సిన పనికి ఇద్దరే హాజరవుతున్నారు. ఒక్కో కార్మికుడు రోజుకు 500-750 మీటర్లు ఊడవాలని, కాలువ పరిమాణం ఆధారంగా 80-160 మీటర్లు శుభ్రం చేయాలని నిబంధనలు చెబితే 50-70 శాతం అదనపు భారం పడుతోందంటున్నారు. బోధన్ పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థలో కార్మికులు తరుచూ గైర్హాజరవుతున్నారు. అదనంగా కార్మికులను నియమించినా పెరిగిన పట్టణ పరిధి, కాలనీలతో పారిశుద్ధ్య సేవలకు విఘాతం ఏర్పడుతోంది.
* 38 వార్డులను 9 జోన్లుగా విభజించి 137 మంది కార్మికులను కేటాయించారు. శనివారం 16 మంది గైర్హాజరయ్యారు. రోజూ ఈ సంఖ్య 25 వరకు ఉంటుంది. కేటాయించిన కార్మికుల్లో 9 ట్రాక్టర్లకు 27 మంది, ట్రక్కులకు 24 మందిని నియమిస్తారు. ఎక్కువ మందిని చెత్త సేకరణ పనుల కోసం వినియోగించగా కాలువల్లో పూడిక తొలగించడానికి ఇద్దరు లేదా ముగ్గురు మిగులుతున్నారు. ఇక్కడ హాజరు నమోదుపై ప్రత్యేక విధానం పాటిస్తున్నారు. రిజిస్టర్లో వేసిన హాజరుకు సంబంధించిన చిత్రాన్ని జవాన్ల గ్రూప్లో పోస్టు చేస్తున్నారు.
నిలిచిన మురుగు
నందిగల్లీలో..
భీమ్గల్ : భీమ్గల్ పట్టణంలోని కుప్కల్రోడ్డు, నందీశ్వర కాలనీ, వేల్పూర్ రోడ్డులోని కాలనీలు మురుగు నిలయాలుగా మారాయి. ఏడు వాహనాల ద్వారా చెత్త సేకరించారు. కాలనీల వారీగా బృందాలుగా విడిపోయి చెత్త ఊడ్చే పనిలో నిమగ్నమయ్యారు. పలుచోట్ల పోగు చేసిన చెత్తను తరలించక అలాగే వదిలేశారు. నందిగల్లీలో కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోంది.
సమయవేళలు పాటించరు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్లో చెత్త కుప్ప
నిజామాబాద్ నగరం : నగర పాలక సంస్థ శివారు కాలనీల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగట్లేదు. ప్రధాన రహదారులు మినహాయిస్తే రోటరీనగర్, సాయినగర్, ఆనంద్నగర్, దుబ్బ, ముజాయిద్నగర్, గౌతంనగర్, ఇందిరప్రియదర్శిని కాలనీల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించట్లేదు. కొత్త కలెక్టరేట్ సమీపంలోని దుబ్బలో రోడ్డు పక్కన చెత్త వేస్తున్నారు. తడి, పొడి చెత్త వేరు చేయాలని అధికారులు ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు. అరుంధతినగర్, గిరిరాజ్ కళాశాల, నీల కంఠేశ్వర్ నగర్, మారుతినగర్లో వాహనం సమయానికి రాలేదు.
* ఉదయం 7.30కు దుబ్బ ప్రాంతంలోని ఓ మహిళా చెత్తబుట్ట తీసుకొని రోడ్డుపైకి వచ్చింది. మున్సిపల్ వాహనం వస్తే అందులో వేయవచ్చు కదా అని ప్రశ్నించగా.. ఎప్పుడో ఒకసారి పది దాటిన తర్వాత వస్తుందని సమాధానం ఇచ్చారు. ఉదయం రావాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదన్నారు.
* ఉదయం 7.40కు గౌతంనగర్లో రోడ్డుపై చెత్త పేరుకపోయింది. సిబ్బంది సమయ వేళలు పాటించడం పాటించట్లేదని స్థానికులు తెలిపారు. ● దుబ్బ, చంద్రశేఖర్ కాలనీ(లోపల), వర్ని రోడ్డు, సీతారాంనగర్ కాలనీలోని మురుగు కాల్వల్లో చెత్తతో నిండిపోయాయి. ఆయా చోట్ల పది రోజులకోసారి కాల్వలు శుభ్రం చేస్తారని స్థానికులు తెలిపారు. కంఠేశ్వర్, చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా, గౌతంనగర్, పులాంగ్, వినాయక్నగర్లో కాల్వలు శుభ్రం చేశారు. అంతర్గత కాలనీలు శుభ్రం చేయలేరు.
ప్రధాన రోడ్ల వరకే..
పెర్కిట్ కూరగాయల మార్కెట్ ఆవరణను శుభ్రం చేస్తున్న సిబ్బంది
ఆర్మూర్ గ్రామీణం : ఆర్మూర్ పట్టణంలో ముఖ్యమైన ప్రదేశాలు, ప్రధాన రోడ్ల వెంట పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో సరిగా లేదు. పెర్కిట్, కొటార్మూర్, మామిడిపల్లిలోని కాలనీల్లో పక్కా మురుగు కాల్వలు నిర్మించలేదు. అన్నపూర్ణ కాలనీ, తిరుమల, శ్రీరామ, శ్రీనివాస, విద్యానగర్ కాలనీల్లో మురుగు కాల్వలు చెత్తతో పేరుకుపోయాయి. పెర్కిట్ పెద్ద చెరువులో మురుగు నీరు చేరుతుంది. మామిడిపల్లిలోని ఆదర్శ్నగర్, సరస్వతీనగర్, వెంకటేశ్వర, యోగేశ్వర కాలనీ, పాత మామిడిపల్లిలో మురుగు పారట్లేదు. మరో 17 మినీ ట్రాలీల అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 19-04-2024]
తాండూరు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి 6 గ్యారంటీలు, రుణమాఫీ గురించి స్థానిక కాంగ్రెస్ నాయకులు వివరించారు. -
పోరు.. ఇక జోరు
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
సిద్ధమవుతున్నారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. -
‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్ పోటీ’
[ 19-04-2024]
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. -
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ
[ 19-04-2024]
రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి
[ 19-04-2024]
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఇక ప్రచార హోరు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. -
బీఫాం అందుకున్న బాజిరెడ్డి
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు అధినేత కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు. -
రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత
[ 19-04-2024]
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. -
ఇద్దరు సీఐలపై వేటు
[ 19-04-2024]
కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన సాహిల్
[ 19-04-2024]
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. -
అరచేతిలో ఎన్నికల సమాచారం
[ 19-04-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? -
‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. -
హ్యాట్రిక్ వీరులు ఇద్దరు
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. -
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి