సంఘటితమవుతుండ్రు
అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రామ్కు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 90,569 మంది, నిజామాబాద్ జిల్లాలో 31,912 మంది తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్: అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రామ్కు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 90,569 మంది, నిజామాబాద్ జిల్లాలో 31,912 మంది తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం లేకుండా వివిధ రంగాల్లో పని చేస్తున్న 18- 59 ఏళ్ల వారంతా నమోదుకు అర్హులు. జిల్లావ్యాప్తంగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మొదట నవంబరు వరకే నమోదు గడువు ఉండగా.. డిసెంబరు నెలాఖరు వరకు పొడిగించారు.
ఏడాదిపాటు బీమా
ఈ-శ్రామ్ పోర్టల్లో దరఖాస్తు చేసుంటే ప్రత్యేక గుర్తింపు కార్డు(యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్) కేటాయిస్తారు. ప్రతి కార్మికుడికి ఏడాది పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల ప్రమాద బీమా, అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష బీమా వర్తింపజేస్తారు. ఆర్థిక సాయం నేరుగా జమ చేస్తారు.
కలెక్టర్ ప్రత్యేక చొరవ
కామారెడ్డి జిల్లాలో ఈ-శ్రామ్ పథకం కింద ప్రతి కార్మికుడిని చేర్పించేలా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న అసంఘటిత కార్మికులను గుర్తించేందుకు కృషి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లలో కామారెడ్డి కంటే చాలా వెనుకబడి ఉంది.
వీరు అర్హులు..
ఈ-శ్రామ్ పథకానికి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ అర్హులే. చేనేత, ఇటుక బట్టీలు, క్వారీలు, వడ్రంగులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, వలసదారులు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ, ఉపాధిహామీ కూలీలు, వీధి వ్యాపారులు, రిక్షావాలాలు, మత్స్యకారులు, ప్రైవేటు వాహన డ్రైవర్లు, కల్లుగీత, బీడీ, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు నమోదు చేసుకోవచ్ఛు వీరిలో ఈఎస్ఐ, ఈపీఎఫ్ పొందుతున్న వారు, ప్రభుత్వానికి పన్ను చెల్లించే వారు అనర్హులు
నెలాఖరు నాటికి మరిన్ని పెంచుతాం - సురేంద్రకుమార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, కామారెడ్డి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-శ్రామ్ పథకంలో అర్హులైన ప్రతి కార్మికుడిని చేర్పించడానికి కృషి చేస్తున్నాం. ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించినందున మరింత మంది రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూస్తాం. చరవాణిలో స్వీయంగానే నమోదు చేసుకోవచ్ఛు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలిక అదృశ్యం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైనట్లు ఎస్సై మహేష్ గురువారం తెలిపారు. -
ప్రధాని మోదీ సారథ్యంలోనే దేశం అభివృద్ధి: ఎమ్మెల్యే
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భాజపా నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీల ఏజెంట్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు. -
అన్నపై తమ్ముడి దాడి
[ 25-04-2024]
అన్నపై తమ్ముడు దాడి చేసి గాయపర్చిన ఘటన ఎల్లారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. -
కాంగ్రెస్లో చేరిన కౌన్సిలర్ విజయలక్ష్మి
[ 25-04-2024]
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో ఎల్లారెడ్డి పురపాలక తొమ్మిదో వార్డు కౌన్సిలర్ సభ్యురాలు విజయలక్ష్మి, పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు
[ 25-04-2024]
రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి కారు ఢీ కొన్న ఘటన ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. -
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM