logo

తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో బుధవారం వెలుగు చూసింది. కాలనీలో నివాసముండే దొంతుల లింగం కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం కామారెడ్డి మండలం

Published : 09 Dec 2021 03:15 IST

12 తులాల బంగారం, 8 తులాల వెండి అపహరణ

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో బుధవారం వెలుగు చూసింది. కాలనీలో నివాసముండే దొంతుల లింగం కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం కామారెడ్డి మండలం ఉగ్గరవాయికి వెళ్లారు. దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలోని 12 తులాల బంగారు, 8 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బుధవారం ఉదయం చుట్టపక్కల వారు చూసి బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకొని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్‌ తెలిపారు. కాగా చోరీకి పాల్పడిన వ్యక్తి బుధవారం తెల్లవారుజాము ప్రాంతంలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. గంజాయి రవాణాపై తనిఖీలు చేస్తున్న సమయంలో పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నట్లు వినికిడి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని