logo

ఆర్టీసీని ఆదరించాలి

ప్రజలు ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలని సంస్థ ఛైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కోరారు. హైదరాబాద్‌-బోధన్‌ వయా సిద్దిపేట్‌, సిరిసిల్ల, సిరికొండ మండలం మీదుగా నడిచే బస్సు సర్వీసును బుధవారం చీమన్‌పల్లిలో

Published : 09 Dec 2021 03:15 IST

బస్సు సర్వీసును ప్రారంభిస్తున్న ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి

సిరికొండ, న్యూస్‌టుడే: ప్రజలు ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలని సంస్థ ఛైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కోరారు. హైదరాబాద్‌-బోధన్‌ వయా సిద్దిపేట్‌, సిరిసిల్ల, సిరికొండ మండలం మీదుగా నడిచే బస్సు సర్వీసును బుధవారం చీమన్‌పల్లిలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రూరల్‌ నియోజకవర్గంలోని ప్రయాణప్రాంగణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.50 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అంతకుముందు పార్వతీ రాజరాజేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీపీ సంగీత, సిరికొండ, ధర్పల్లి జడ్పీటీసీలు మాన్‌సింగ్‌, జగన్‌, ఐడీసీఎంఎస్‌ ఛైర్మన్‌ మోహన్‌, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, రైసస మండలాధ్యక్షుడు తిర్మల్‌, దేవిదాస్‌, సర్పంచి పద్మ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని