TS News: ఎంపీ అర్వింద్ను అడ్డుకునేందుకు తెరాస యత్నం.. గన్నారంలో ఉద్రిక్తత
నిజామాబాద్జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో నిజామాబాద్ ఎంపీ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి..
ఇందల్వావాయి: నిజామాబాద్జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో నిజామాబాద్ ఎంపీ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీని తెరాస శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించారు. ఎంపీ రాకకు గంట ముందు నుంచే తెరాస కార్యకర్తలు గన్నారం ముఖద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, యాసంగిలో ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలకు రావడమేంటని ప్రశ్నించారు. ఎంపీ కాన్వాయ్ రాగానే తెరాస శ్రేణులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈక్రమంలో తెరాస, భాజపా శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు ఎంపీ కాన్వాయ్ను ముందుకు పంపడంతో గొడవ సద్దుమణిగింది.
రాజకీయాలకు ఇంకా సమయం ఉంది: ఎంపీ అర్వింద్
గన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ అర్విద్ మాట్లాడుతూ.. తనను ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో 60శాతం నిధులు కేంద్రానివేనని తెలిపారు. ¸కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్రం కోడిగుడ్డు కూడా కొనలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసని, రాజకీయాలకు ఇంకా సమయం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM