230 ఎకరాల్లో పంట నష్టం
అకాల వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన జోరువానకు జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 230 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా తేల్చింది. ఇందులో ఎక్కువగా
ధర్పల్లి మండలం మైలారంలో వర్షానికి నేలవాలిన మొక్కజొన్నను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు, రైతులు
ఈనాడు, నిజామాబాద్: అకాల వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన జోరువానకు జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 230 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా తేల్చింది. ఇందులో ఎక్కువగా మొక్కజొన్న ఉంది. ఏపుగా ఎదిగి.. పూత దశలో ఉన్న పంట గాలుల కారణంగా నేలకొరిగింది. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో సమస్య ఉన్నట్లుగా గుర్తించారు. అధికారిక లెక్కల ప్రకారం 196 మంది అన్నదాతలపై ప్రభావం పడినట్లుగా చూపారు. కానీ 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న చోటే పంట నష్టాన్ని అధికారికంగా పరిగణనలోకి తీసుకుంటారు. కొంతమేర దెబ్బతిన్న పొలాలను కూడా లెక్కల్లోకి తీసుకుంటే నష్టం అంచనా మరింతగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కొన్ని చోట్ల ఉల్లి, ఆవాల పంటలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ఇటీవల వేసిన పొద్దుతిరుగుడు పంటకు నష్టం వాటిల్లినట్లుగా రైతులు చెబుతున్నారు.
పరిహారం అందని ద్రాక్షే.. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపడమే తప్ప, నాలుగేళ్లుగా పరిహారం అందట్లేదు. రాష్ట్రంలో పంటల బీమా పథకం ఐచ్ఛికం చేశారు. రైతులు నేరుగా బీమా కంపెనీలకు ప్రీమియాలు చెల్లించే పథకాలపై వారు ఆసక్తి చూపించట్లేదు. కేంద్ర, రాష్ట్ర వాటాలుగా ప్రీమియం చెల్లించి పరిహారం అందించే విధానం అమలైతే తప్ప కర్షకులకు ప్రయోజనం చేకూరదు.
ఐదెకరాల్లో దెబ్బతింది..
- వెంకటరెడ్డి, గన్నారం, ఇందల్వాయి
గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఐదెకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది. పూత దశలో నష్టం జరిగింది. విత్తనాల్లో కూడా తేడాలున్నట్లు అనుమానాలు ఉన్నాయి. వ్యవసాయాధికారులు పరిశీలించి సమస్య ఏంటో గుర్తించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
[ 28-03-2024]
జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి
[ 28-03-2024]
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. -
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు