ముగ్గుతో ముందుకు
సంక్రాంతి అంటే ఇంటికి చేరే ధాన్యపు రాశులు... పిండి వంటలు... గాలి పటాలు... రంగవల్లులు. వీటన్నింటిలో గుమ్మం ఎదురుగా వేసే ముగ్గులు పండగ శోభను ఆవిష్కరిస్తాయి. వాకిలి నిండా అద్దిన రంగులు... అతిథిని, సౌభాగ్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంటాయని నమ్ముతారు. ఇలాంటి సంబురాల వేళ విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ కొంత గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పండగ చరితను, ముగ్గుల పరమార్థాన్ని నేటి కాలమాన పరిస్థితులకు అన్వయించుకుని...
సంక్రాంతి వేళ ఒమిక్రాన్ విజృంభించనీయొద్దు
రంగవల్లిలోని పరమార్థాన్ని గ్రహించాల్సిన తరుణమిది
న్యూస్టుడే, ఇందూరు ఫీచర్స్
సంక్రాంతి అంటే ఇంటికి చేరే ధాన్యపు రాశులు... పిండి వంటలు... గాలి పటాలు... రంగవల్లులు. వీటన్నింటిలో గుమ్మం ఎదురుగా వేసే ముగ్గులు పండగ శోభను ఆవిష్కరిస్తాయి. వాకిలి నిండా అద్దిన రంగులు... అతిథిని, సౌభాగ్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంటాయని నమ్ముతారు. ఇలాంటి సంబురాల వేళ విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ కొంత గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పండగ చరితను, ముగ్గుల పరమార్థాన్ని నేటి కాలమాన పరిస్థితులకు అన్వయించుకుని కరోనా వైరస్ను నిలువరించేలా ముగ్గులోకి దింపాల్సిన అవసరముంది. అంటే ముగ్గులు చాటే ఆరు అంశాల ప్రాధాన్యాన్ని గ్రహించి ముందుకు సాగాలి.
1.శుభ్రత
ముగ్గులు వేయాలంటే ఇళ్లు, వాకిలి శుభ్రం చేయాలి. తరువాత పేడ కలిపిన కల్లాపి చల్లుతారు. ఇది శుభ్రంగా ఉండాలని నేర్పుతుంది. ప్రస్తుతం మనకు కావాల్సిన ప్రధాన ఆయుధం శుభ్రతనే. ఇంటితోపాటు జీవన విధానంలోనూ ఈ నియమాలు పాటించాలి. నిత్యం చేతులను శుభ్రం చేసుకోవాలి.. లేదా శానిటైజర్ రాసుకోవాలి. ముక్కు, నోటి ద్వారా తుంపర్లు గాలిలోకి వ్యాపించకుండా, గాలిలోని తుంపర్లను పీల్చుకోకుండా మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తేనే శుభ్రత అనే ముగ్గులోకి కరోనా వైరస్ చిక్కుతుంది.
2. ఆరోగ్యం
ఎప్పుడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో అప్పుడు ఆ కుటుంబమంతా ఆరోగ్యకర వాతావరణంలో జీవిస్తుందన్నమాట. ఇక్కడ శుభ్రం చేయడానికి, ముగ్గు వేయడానికి శారీరక శ్రమ అవసరమవుతుంది. శారీరక శ్రమతో ఒంటికి మంచి వ్యాయామం అవుతుంది. ముగ్గు వేయడానికి చేసే పనులన్నీ శారీరక వ్యాయామ ప్రాధాన్యం చాటుతాయి. కరోనాను ఎదుర్కొనేందుకు శరీరం దృఢంగా ఉండాలంటే సరైన మోతాదులో వ్యాయామం చేయాలన్నది సారాంశం. సకాలంలో నిద్ర లేవడం, కనీసం అరగంటైనా ఒంటికి పని చెప్పాలి.
3.సృజనాత్మకత
ముంగిట్లో ముగ్గులు ఆ గృహానికి కళ తీసుకొస్తాయి. భువిపై ఇంద్రధనసు ఆవిష్కరించడానికి సృజనాత్మకతకు పదును పెడుతుంటారు. కాలనీలు, వివిధ సంస్థలు నిర్వహించే పోటీల్లోనూ ప్రతిభను చాటుతుంటారు. ఇలాంటి సాధన జీవనోపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అవసరమని నొక్కి చెబుతోంది. కరోనాతో వివిధ రంగాల వారు అతలాకుతలమైనా.. సృజనాత్మక నైపుణ్యాలున్న వారు వణకలేదు. అందుకే చేస్తున్న పనిలో, చదువుల్లో వినూత్నంగా సాగాల్సిన అవసరముంది.
4.చుక్కలను కలపడం
ఎన్ని రెడీమేడ్ ముగ్గుల సాధనాలు వచ్చినా చుక్కల ముగ్గు వేస్తేనే సంతృప్తి. మనసులో అనుకున్న ఆకృతి, లేదా రథం ముగ్గు వేయడానికి చుక్కలన్నింటిని సమన్వయపరచాలి. చుక్క తప్పినా నమూనా రూపం దెబ్బ తింటుంది. జీవితంలోనూ ఇంతే. చుక్కల్లాంటి కుటుంబం కావాలంటే.. ఉద్యోగం, చదువు, బంధుత్వం, సమాజం ఇలా అన్నీ సమన్వయం చేసుకుంటూ సాగాలి.
5. ప్రకృతి
మన పండగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయనడంలో సందేహం లేదు. సంక్రాంతికి వాకిట్లో వేసే ముగ్గు గతంలో బియ్యం పిండితో వేసేవారు. అలా ముగ్గు చీమలకు, పక్షులకు ఆహారంగా మారేది. ప్రకృతిలోని జీవరాశులు ఏదో ఒక రూపంలో మానవ మనుగడకు దోహదం చేసేవే. అందుకే మనతోపాటు జంతుజాలాన్ని సంరక్షించి జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి. కరోనా వేళ ప్రకృతి ప్రాధాన్యం తెలిసొచ్చింది. ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. స్వచ్ఛమైన గాలిని
పీలుస్తూ ఊపిరితిత్తులను పదిలపరుచుకుంటే అన్ని అవయవాలు సమర్థంగా పనిచేస్తాయన్న స్పృహ పెంచుకోవాలి.
6.శాస్త్రీయత
ముగ్గుల నమూనాలో శాస్త్రీయ కోణం ఉందని చెబుతారు. మనసులో అనుకున్న ముగ్గు వేసేటప్పుడు ఏకాగ్రతగా వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. అది మనసును ముగ్గుపైనే లగ్నం చేసేలా చేయడంవల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. కరోనా సోకి మరణించడానికి భయాందోళనకే కారణమన్నది నిపుణుల మాట. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే ఏ ప్రతికూలతనైనా ఎదుర్కోవచ్చు. ప్రశాంతంగా ఆలోచించడం అలవరచుకోవాలన్నది ఈ ముగ్గు శాస్త్రం చెబుతుంది.
జిల్లాలో ఇలా..
(కరోనా మొదలైనప్పటి నుంచి ఈ నెల 13 వరకు కేసులు)నిర్వహించిన
పరీక్షలు : 5,67,398
నమోదైన పాజిటివ్ కేసులు : 58,257
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కిసాన్ కాంగ్రెస్ సభ్యులు
[ 18-04-2024]
తాండూరు ప్రాథమిక సహకార సంఘ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సంఘ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. -
నామపత్రాల దాఖలుకు ఏర్పాట్లు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?
[ 18-04-2024]
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది. -
1950లో ఫిర్యాదుల స్వీకరణ
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేస్తారు. -
‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి’
[ 18-04-2024]
పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం ఎన్నికల జిమ్మిక్కని నిజామాబాద్ పార్లమెంట్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. -
బలం పెంచుకునేలా వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
నామపత్రాల దాఖలుకు వేళాయె
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
సాంకేతికతతో సమస్యలు అధిగమిద్దాం..!
[ 18-04-2024]
పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది. -
సువిధతో సులభం
[ 18-04-2024]
ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశం నిర్వహించాలంటే ఇది వరకు తెల్ల కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. -
ఈసారైనా మోక్షం లభించేనా?
[ 18-04-2024]
బోధన్ - బీదర్ రైల్వేలైన్పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. -
పొద్దంతా ఎండ.. రాత్రి వాన
[ 18-04-2024]
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. -
జానకీనాథుడి కల్యాణం.. కమనీయం
[ 18-04-2024]
జగదానందకారకుని దర్శనంతో భక్తజనం తన్మయత్వం చెందారు. సీతారాముల కల్యాణాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లిపెద్దలుగా మారి కన్యాదానం చేశారు. -
విరాళాలు పోగు చేసి.. పూడిక తీసుకున్నారు
[ 18-04-2024]
బీర్కూర్లోని నల్లజెరు చెరువు తూములో పూడిక పేరుకుపోయి యాసంగిలో పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయి. -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
శిక్షణ.. ఆత్మరక్షణ
[ 18-04-2024]
ఆత్మరక్షణ క్రీడలు ప్రతిఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాక.. మానసికంగానూ బలోపేతమవుతారు. ధైర్యం పెరుగుతుంది.. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. -
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
[ 18-04-2024]
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?