logo

విద్యుదాఘాతంతో పాడి గేదె మృత్యువాత

మండలంలోని ఏఆర్పీ క్యాంప్‌ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి విద్యుదాఘాతంతో

Published : 15 Jan 2022 13:51 IST

ఎడపల్లి: మండలంలోని ఏఆర్పీ క్యాంప్‌ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి విద్యుదాఘాతంతో ఓ గేదె మృత్యువాతపడింది. గ్రామంలోని రైతు స్వామికి చెందిన ఈ పాడి గేదె మేత కోసం పంట పొలాల వైపు వెళ్లగా.. ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తగిలి ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో దాదాపు రూ.40 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. తనను ఆదుకోవాలని అధికారులను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని