తుపాకీతో బెదిరించిన ముగ్గురి అరెస్టు
చిన్నపాటి గొడవకే తుపాకీతో బెదిరించిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులో పొందుర్తి చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దేవునిపల్లి పోలీసుస్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల
కామారెడ్డి నేరవిభాగం, న్యూస్టుడే : చిన్నపాటి గొడవకే తుపాకీతో బెదిరించిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులో పొందుర్తి చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దేవునిపల్లి పోలీసుస్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏఎస్పీ అన్యోన్య వివరాలు వెల్లడించారు. పొందుర్తి చౌరస్తా వద్ద ఓ దాబాలో భోజనం చేసేందుకు టేక్రియాల్కు చెందిన పోతారం సంతోష్ స్నేహితులతో కలిసి వెళ్లారు. తినేసి బయటకు వస్తుండగా చాట్ల జనార్దన్ అనే వ్యక్తి వారి కారుపై మూత్రం పోస్తూ కనిపించాడు. అందరూ కలిసి నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలోనే అక్కడికి వచ్చిన జనార్దన్ స్నేహితులు మహ్మద్ సాజిద్, భోగి రవీందర్ అతనికి మద్దతుగా నిలిచి దుర్భాషలాడారు. మహ్మద్ సాజిద్ తన వద్ద ఉన్న పిస్టల్ తీసి గురిపెట్టి ‘ఏమనుకుంటున్నార్రా చంపేస్తానంటూ’ భయపెట్టాడు. వారి నుంచి బయటపడ్డ సంతోష్ బృందం అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులకు విషయం చెప్పగా అక్కడికి చేరుకున్నారు. సాజిద్ వద్ద ఉన్న పిస్టల్తోపాటు ఏడు రౌండ్ల తూటాలు, మూడు చరవాణులు, కారును స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి శివారు ఇంద్రానగర్ కాలనీకి చెందిన మహ్మద్ సాజిద్, విద్యానగర్కాలనీలో నివాసముండే చాట్ల జనార్దన్, దేవునిపల్లికి చెందిన భోగి రవీందర్ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పేర్కొన్నారు. సాజిద్ పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడన్నారు. అతనిపై రౌడీషీట్ కూడా ఉందన్నారు. గతేడాది సెప్టెంబరు 20న తహసీల్దారు ముందు బైండోవర్ చేశామన్నారు. స్థిరాస్తి వ్యాపారం చేసే ఇతనిపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, గ్రామీణ సీఐ చంద్రశేఖర్రెడ్డి, దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
పుస్తకంతో దోస్తీ చేద్దామా..?
[ 20-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి నియంత్రించేందుకు తల్లిదండ్రులు చేసేది.. సెల్ఫోన్ ఇచ్చి ఒక చోట పరిమితం చేయడం. కానీ దాంతో కంటి చూపు మందగించడం, మానసిక సమస్యల వంటి దుష్పరిణామాలను గ్రహించలేకపోతున్నారు. -
‘నగరాభివృద్ధిపై భారాస ప్రభుత్వం వివక్ష’
[ 20-04-2024]
భారాస ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధిపై పూర్తి వివక్ష చూపారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
రెండో రోజు.. ఆరుగురు
[ 20-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన భారాస, భాజపా అభ్యర్థులున్నారు. -
బడుల బలోపేతానికి కృషి
[ 20-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు -
హలో పురపాలిక
[ 20-04-2024]
‘హలో మేము పాత బాన్సువాడ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పైపులైను పగిలి నీటి సమస్యగా మారింది. దీన్ని త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోండి -
సమస్యలు అటుంచి.. విధానాలే ముందుంచి
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోక్సభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగళ్ల వాన.. వణికిన రైతన్న
[ 20-04-2024]
వడగళ్ల వాన జిల్లాను మరోసారి వణికించింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో వాన కురిసింది -
ప్రమాదాల కాలం.. అప్రమత్తతతోనే పదిలం
[ 20-04-2024]
ఎండలు మండుతుండడంతో ఏప్రిల్, మే నెలల్లో అగ్నిప్రమాదాలకు ఆస్కారముంది. నాలుగు నెలల కిందట కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు రోజులకు గానీ మంటలు అదుపులోకి రాలేదు -
ఈ- కేవైసీకి మరో అవకాశం
[ 20-04-2024]
రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకునేందుకు అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గతంలో మూడు సార్లు గడువు పొడిగించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా 19 శాతం మంది ప్రక్రియ పూర్తిచేసుకోలేదు. -
ముందస్తు పన్ను రాయితీపై ఆసక్తి
[ 20-04-2024]
ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల వసూలులో ఆర్మూర్ బల్దియా ముందంజలో ఉంది. ఈనెల 1 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పన్ను రుసుముపై 5 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. -
గొలుసుకట్టు చెరువులు నిండేదెట్లా?
[ 20-04-2024]
వృథా నీటిని చెరువుల్లోకి మళ్లించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం చేపట్టిన లక్ష్యం నిధుల కొరతతో ఆచరణకు నోచుకోవడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!