రెట్టింపవుతున్న పాజిటివ్లు
జిల్లాలో కొవిడ్ విజృంభిస్తోంది. రోజు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ బాధితులు పెరుగుతున్నారు. మూడో దశలో వైరస్ వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు స్పష్టం
మంగళవారం 318 మందికి వైరస్
న్యూస్టుడే: నిజామాబాద్ వైద్యవిభాగం : జిల్లాలో కొవిడ్ విజృంభిస్తోంది. రోజు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ బాధితులు పెరుగుతున్నారు. మూడో దశలో వైరస్ వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు స్పష్టం చేస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి తోడు స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఐసోలేషన్లో ఉండకుండా ఏదో ఒక అవసరాల నిమిత్తం బయటకు వస్తుండటం తీవ్రతను పెంచుతోంది.
పది రోజుల్లో 1216 కేసులు..
జిల్లాలో గత పది రోజుల్లో 6841 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 1216 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కొన్ని యూపీహెచ్సీల్లో 20 మందిని పరీక్షిస్తే పది మందికి వైరస్ ఉన్నట్లు గుర్తిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు.
బయట తిరిగేస్తున్నారు
బాధితుల్లో చాలా వరకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. ఇదే అదునుగా భావించి కొందరు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు.
* ఓ దుకాణంలో పనిచేసే వ్యక్తికి పాజిటివ్ అని తేలినా కుటుంబ పోషణ నిమిత్తం పనిలోకి వెళ్తున్నాడు. మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా పాజిటివ్ వచ్చినవారు బయటకు రాకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
* ఓ వైపు రెండింతల వేగంతో వైరస్ వ్యాపిస్తుంటే మరోవైపు ఎక్కడా కొవిడ్ నిబంధనలు అమలు కావట్లేదు. రెండో దశలో దుకాణాల ఎదుట భౌతిక దూరం పాటించేలా డబ్బాలు గీశారు. ప్రయాణ ప్రాంగణాల్లో ఒక సీటు వదిలి మరొకరు కూర్చునేలా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అలాంటివి కనిపించట్లేదు. మాస్కుల్లేకుండానే బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు.
మాత్రలు కొంటున్నారు
అనేక మంది ఔషధ దుకాణాల్లోకి వెళ్లి జ్వరం, జలుబు, గొంతునొప్పి మాత్రలు కొని వేసుకుంటున్నారు. కరోనా లక్షణాలు కనిపించినా పరీక్షలకు ముందుకు రావట్లేదు. ఇది సరైన పద్ధతి కాదంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
5,946 మందికి టీకా
నిజామాబాద్ వైద్యవిభాగం, న్యూస్టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సోమవారం 5,946 మందికి టీకాలు వేశారు. వీరిలో టీనేజర్లు 445, 18 నుంచి 60 ఏళ్లవారు 5,501 మంది ఉన్నారు.
ప్రజలు సహకరించాలి
- డాక్టర్ సుదర్శనం, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి
ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. కొవిడ్ నిబంధనలు పాటించడం తమ బాధ్యతగా భావించాలి. వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సహకరించాలి. అప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలం. పాజిటివ్ వచ్చిన వారు బయట తిరగొద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్