ప్రభుత్వ బడులకు దయానందుడు
ప్రభుత్వ బడులు, కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బాల్కొండ మండలం చిట్టాపూర్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దయానంద్రెడ్డి తోడ్పాటు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు రూ.48 లక్షలు వెచ్చించారు. మరమ్మతులు,
రూ.48 లక్షలతో మౌలిక వసతుల కల్పన
న్యూస్టుడే, ఆర్మూర్ గ్రామీణం
పెర్కిట్ ఉన్నత పాఠశాలకు అందజేసిన డ్యూయెల్ డెస్క్ బెంచీలతో ప్రధానోపాధ్యాయుడు సీతయ్య, ఉపాధ్యాయులు
ప్రభుత్వ బడులు, కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బాల్కొండ మండలం చిట్టాపూర్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దయానంద్రెడ్డి తోడ్పాటు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు రూ.48 లక్షలు వెచ్చించారు. మరమ్మతులు, విద్యుత్తు తీగల ఏర్పాటు, రంగులు వేయించడం చేశారు. సైన్స్ ల్యాబ్లు నెలకొల్పారు. డెస్క్ బల్లలు అందించి విద్యార్థులు చక్కగా పాఠాలు వినేందుకు సౌకర్యం కల్పించారు.
ఏడాది కాలంలో అందజేసినవి
* పెర్కిట్ ఉన్నత పాఠశాలకు రూ. 1.50 లక్షల విలువైన 50 డెస్క్ బల్లలు అందజేశారు.
* ఆర్మూర్ కేజీబీవీ జూనియర్ కళాశాలకు అప్గ్రేడ్ కావడంతో బెంచీల కొరత తీర్చేందుకు రూ.75 వేల విలువైన 25 బల్లలు ఇచ్చారు. ః పెర్కిట్, కోమన్పల్లి, బాల్కొండ, ముప్కాల్, వేల్పూర్, మోతె, కోటగిరి ఉన్నత పాఠశాలల్లో రూ.2 లక్షలతో సైన్స్ ల్యాబ్లు నెలకొల్పారు. ః వేల్పూర్ ఉన్నత పాఠశాలకు రూ.3 లక్షలు వెచ్చించి 100, పచ్చలనడ్కుడ ఉన్నత పాఠశాలకు రూ.1.50 లక్షల విలువైన 50 బల్లలు అందజేశారు. ః కమ్మర్పల్లి కేజీబీవీ కళాశాలకు రూ. 1.50 లక్షలు వెచ్చించి 50, చౌట్పల్లి ఉన్నత పాఠశాలకు 50 బల్లలు ఇచ్చారు.
పాఠశాలల అభివృద్ధికి చర్యలు
* తనకు విద్యాబుద్ధులు నేర్పిన పెర్కిట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాల సముదాయంలో 24 తరగతి గదులకు రూ.4.50 లక్షలు వెచ్చించి మరమ్మతులు, విద్యుత్తు వైరింగ్ పనులు, రంగులు వేయించారు.
* రూ.10 లక్షలతో బాల్కొండ ఉన్నత పాఠశాలలో విద్యుత్తు లైనింగ్, మరమ్మతులు, గదులకు రంగులు వేయించారు. రూ.3 లక్షలు వెచ్చించి 100 బల్లలు అందజేశారు.
* రూ.8 లక్షలు వెచ్చించి చిట్టాపూర్ , కోమన్పల్లి ఉన్నత పాఠశాలలకు రంగులు వేయించి సుందరంగా తీర్చిదిద్దారు.
పేద విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దని
- దయానంద్రెడ్డి, పారిశ్రామికవేత్త
సర్కారు బడిలో చదువుకొని ఈ స్థాయికి ఎదిగాను. పేద విద్యార్థుల చదువుకు ఇబ్బందులు తలెత్తొద్దని ప్రభుత్వ బడుల్లో వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాను. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకు నావంతు సాయం అందిస్తా.
అడిగిన వెంటనే స్పందిస్తున్నారు
- సీతయ్య, డీసీఈబీ కార్యదర్శి, పెర్కిట్ ప్రధానోపాధ్యాయుడు
దయానంద్రెడ్డి బాల్కొండ, పెర్కిట్ ఉన్నత పాఠశాలల పూర్వ విద్యార్థి. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న బడుల్లో సరైన బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయన దృష్టికి సమస్య తీసుకెళ్లిన వెంటనే వసతుల కల్పనకు స్పందిస్తున్నారు. పదుల సంఖ్యలో బడులను బాగు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కిసాన్ కాంగ్రెస్ సభ్యులు
[ 18-04-2024]
తాండూరు ప్రాథమిక సహకార సంఘ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సంఘ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. -
నామపత్రాల దాఖలుకు ఏర్పాట్లు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?
[ 18-04-2024]
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది. -
1950లో ఫిర్యాదుల స్వీకరణ
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేస్తారు. -
‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి’
[ 18-04-2024]
పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం ఎన్నికల జిమ్మిక్కని నిజామాబాద్ పార్లమెంట్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. -
బలం పెంచుకునేలా వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
నామపత్రాల దాఖలుకు వేళాయె
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
సాంకేతికతతో సమస్యలు అధిగమిద్దాం..!
[ 18-04-2024]
పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది. -
సువిధతో సులభం
[ 18-04-2024]
ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశం నిర్వహించాలంటే ఇది వరకు తెల్ల కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. -
ఈసారైనా మోక్షం లభించేనా?
[ 18-04-2024]
బోధన్ - బీదర్ రైల్వేలైన్పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. -
పొద్దంతా ఎండ.. రాత్రి వాన
[ 18-04-2024]
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. -
జానకీనాథుడి కల్యాణం.. కమనీయం
[ 18-04-2024]
జగదానందకారకుని దర్శనంతో భక్తజనం తన్మయత్వం చెందారు. సీతారాముల కల్యాణాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లిపెద్దలుగా మారి కన్యాదానం చేశారు. -
విరాళాలు పోగు చేసి.. పూడిక తీసుకున్నారు
[ 18-04-2024]
బీర్కూర్లోని నల్లజెరు చెరువు తూములో పూడిక పేరుకుపోయి యాసంగిలో పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయి. -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
శిక్షణ.. ఆత్మరక్షణ
[ 18-04-2024]
ఆత్మరక్షణ క్రీడలు ప్రతిఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాక.. మానసికంగానూ బలోపేతమవుతారు. ధైర్యం పెరుగుతుంది.. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. -
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
[ 18-04-2024]
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్